Chandrababu: మినీ స్టేడియం మీ తాత జాగీరా?
మహానాడును ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో మొదట అనుకున్న చోటే నిర్వహించాలని తెదేపా అధిష్ఠానం నిర్ణయించింది. ఒంగోలులోని మినీ స్టేడియం
ఇప్పటి వరకు నాన్చి ఇప్పుడు ఇవ్వం అంటారా?
ప్రభుత్వంపై తెదేపా ఆగ్రహం
మహానాడు ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష
ఈనాడు, అమరావతి: మహానాడును ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో మొదట అనుకున్న చోటే నిర్వహించాలని తెదేపా అధిష్ఠానం నిర్ణయించింది. ఒంగోలులోని మినీ స్టేడియం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో మండువవారిపాలెం రెవెన్యూ గ్రామ పరిధిలోని త్రోవగుంట వద్ద ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు జరపాలని నిర్ణయించింది. మహానాడు సన్నాహాలపై పార్టీ కమిటీలతో తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం ఆన్లైన్లో సమీక్షించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మహానాడు నిర్వహణకు ఒంగోలులోని మినీ స్టేడియం ఇవ్వాలని తెదేపా దరఖాస్తు చేస్తే, చివరి నిమిషం వరకు నాన్చి, ప్రభుత్వం నిరాకరించిందని పార్టీ నేతలు ధ్వజమెత్తారు.ముందుగా దరఖాస్తు చేసుకున్నా, అవసరమైన ఫీజులు ముందే చెల్లించినా స్టేడియం ఇవ్వలేదని మండిపడ్డారు. ‘స్టేడియం ఎందుకివ్వరు? అదేమైనా వాళ్ల తాత జాగీరా’ అని సమావేశంలో పాల్గొన్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడును వినూత్నంగా, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా నిర్వహించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తెదేపా అవసరాన్ని చాటిచెప్పేలా మహానాడు ఉండాలన్నారు. సమయం దగ్గరపడుతున్నందున పనులు వేగవంతం చేయాలన్నారు. మహానాడు ప్రాంగణంలో బుధవారం నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు పార్టీనేతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్