CM Jagan: 50 లక్షల మంది రైతులకు భరోసా
‘రైతు సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా ప్రభుత్వానికి.. మనందరి ప్రభుత్వానికి వ్యత్యాసం మీరే గుర్తించి, అందరికీ తెలియజెప్పాలి.. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఏడాదికి రూ.13,500 చొప్పున క్రమం తప్పకుండా 50.10 లక్షల మంది రైతులకు సాయం చేస్తున్నాం’....
ఏలూరు జిల్లా గణపవరం సభలో సీఎం జగన్
రైతు భరోసా నగదు ఖాతాల్లో జమ
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే, గణపవరం: ‘రైతు సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా ప్రభుత్వానికి.. మనందరి ప్రభుత్వానికి వ్యత్యాసం మీరే గుర్తించి, అందరికీ తెలియజెప్పాలి.. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఏడాదికి రూ.13,500 చొప్పున క్రమం తప్పకుండా 50.10 లక్షల మంది రైతులకు సాయం చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా గణపవరంలో నాలుగో ఏడాది మొదటి విడత రైతు భరోసా నగదు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు సభలో మాట్లాడారు. ‘తెదేపా ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతులకు ఇచ్చే వడ్డీలేని రుణాలు గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.782
కోట్లు ఇస్తే.. మనందరి
ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.1,282 కోట్లు ఇచ్చింది. ఖరీఫ్ సీజన్, వ్యవసాయ పనులు మొదలు కాకుండానే మొదటి విడత రూ.7,500లో రూ.5,500 చొప్పున రూ.3,758 కోట్లను సరాసరి మీ ఖాతాల్లోకే వేస్తున్నాం. మిగిలిన రూ.2వేల సాయం కేంద్రం పీఎం కిసాన్ కింద నెలాఖరుకు జమ చేస్తుంది. అక్టోబరులో పంట కోత సమయంలో రూ.4వేలు జమ చేస్తాం. సంక్రాంతి సమయంలో మరో రూ.2వేలు ఇస్తాం. నాలుగు విడతల్లో క్రమం తప్పకుండా రైతు భరోసా కింద దాదాపు రూ.23,875 కోట్లు అందించాం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆహారధాన్యాల ఉత్పత్తి 16 లక్షల టన్నులు పెరిగింది. సుభిక్షంగా వర్షాలు కురిసి అనంతపురం లాంటి కరవు జిల్లాలో సైతం భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి’ అని పేర్కొన్నారు.
ప్రశ్నించలేని దత్తపుత్రుడిని ఏమనాలి
‘తెదేపా పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వదిలేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాస్బుక్, సీసీఆర్సీ కార్డు ఉన్న ప్రతి రైతుకూ రూ.7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం. రైతులను ఉద్ధరిస్తానని బయల్దేరిన చంద్రబాబు దత్తపుత్రుడు.. అన్ని అర్హతలుండీ పరిహారం పొందని ఒక్క రైతునూ చూపించలేకపోయాడు. గతంలో తెదేపా మేనిఫెస్టోలో చంద్రబాబుతో పాటు దత్తపుత్రుడి ఫొటో పెట్టారు. వీళ్లందరూ చాలరన్నట్లు మోదీ చిత్రం తగిలించారు. ప్రజలను ఎందుకు మోసం చేశారని ప్రశ్నించలేని దత్తపుత్రుడిని ఏమనాలి?
రైతులకు పరిహారం ఇవ్వలేదు
గత ప్రభుత్వం వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఏళ్లు గడిచినా పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం పంట నష్టం జరిగిన తర్వాత ఆ పంటకాలం పూర్తయ్యేలోపే పరిహారం జమ చేస్తున్నాం. రైతుల పొలాల్లో మోటార్లు తీసుకుపోవడం, విద్యుత్తు కోతలు.. న్యాయం కోరిన రైతులపై బషీర్బాగ్లో కాల్పులు జరిపిన తెదేపా పాలనను గుర్తుచేసుకోండి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఫొటోతో మేనిఫెస్టో విడుదల చేశారు. తర్వాత దాన్ని తెదేపా వెబ్సైట్ నుంచి తొలగించడంతోనే వారి చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.
పదెకరాల్లోపు ఆక్వా రైతులకు రాయితీ
పదెకరాల్లోపు చెరువులున్న ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీ వర్తింపజేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కోరగా దీనికి స్పందించిన ముఖ్యమంత్రి ఆక్వా జోన్ పరిధిలో ఉన్న పదెకరాల్లోపు రైతులకు ఈ రాయితీ ఉంటుందని ప్రకటించారు. కొల్లేరు రెగ్యులేటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోసేనురాజు, ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, వ్యవసాయ, సహకార మార్కెటింగ్శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చంద్రబాబు.. కరవు కవల పిల్లలు: కాకాణి
సభలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో వర్షాలు ఉండవు. కరవు, చంద్రబాబు కవలపిల్లల్లా ఉంటారు. వైకాపా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల నుంచి ధాన్యం వరకు అన్ని అవసరాలూ తీరుస్తున్నాం. వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు.
సీఎం సభలో నిరసన
ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారానికి చెందిన పలువురు మహిళలు లేచి నిలబడి ‘సీఎం గారూ.. మాకు న్యాయం చేయాలి.. గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇప్పించండి’ అంటూ రాసిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. పోలీసులు వారి చేతుల్లో నుంచి ఫ్లెక్సీలను లాక్కున్నారు. మహిళా సీఐతో పాటు పలువురు మహిళా కానిస్టేబుళ్లు వారిని గ్యాలరీ నుంచి బయటకు తీసుకొచ్చారు.
ఆంక్షలతో సతమతం
సీఎం పర్యటన నేపథ్యంలో గణపవరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం నుంచే దుకాణాలను మూయించారు. సోమవారం గణపవరంలో వారపు సంత జరగలేదు. దీంతో పరిసర గ్రామాలవారు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు రహదారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడ్డారు. సీఎం హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి కారులో వెళ్లారు. ఆ సమయంలో సుమారు గంటసేపు వాహనాలను నిలిపివేశారు. ఆరోగ్యం బాగాలేదు.. అత్యవసరంగా భీమవరం వెళ్లాలి.. అనుమతివ్వండి’ అని అడిగినా దారి ఇవ్వలేదని నిడమర్రు మండలానికి చెందిన ఒక రోగి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్ వెళ్లిన సుమారు 20 నిమిషాల తర్వాత ఆ వాహనానికి అనుమతి ఇచ్చారు.
సీఎం ప్రసంగిస్తుండగానే.. బయటకు!
వీక్షకులు కూర్చునేందుకు 16 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ, కళాశాల బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలను భారీగా తరలించారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నప్పుడు సభకు వచ్చినవారు పెద్ద సంఖ్యలో లేచి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు. వారు బయటకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. అయినా సీఎం ప్రసంగం సగం పూర్తయ్యేసరికి 10 గ్యాలరీల్లోని జనం బయటకు వెళ్లిపోయారు. దీంతో వైకాపా నాయకులు మిగతా గ్యాలరీల్లోని జనాల్ని ఖాళీ గ్యాలరీల్లోకి పంపే ఏర్పాటు చేశారు. సభ ప్రారంభానికి గంట ముందు కొద్దిపాటి వర్షం కురిసింది. తర్వాత ఉక్కపోత, వేడితో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
పది నిమిషాలైనా ఉండండి: వెళ్లిపోతున్న మహిళలకు ఎంపీడీవో విజ్ఞప్తి
కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా గ్యాలరీల నుంచి పెద్ద ఎత్తున మహిళలు బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న గణపవరం ఎంపీడీవో జి.జ్యోతిర్మయి మహిళలు వెళ్లకుండా బారికేడ్లు అడ్డుపెట్టాలని సిబ్బందికి సూచించారు. కనీసం 10 నిమిషాలైనా సభలో ఉండాలని ఎంపీడీవో చెబుతున్న మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
* ముఖ్యమంత్రికి తన గోడు విన్నవించుకునేందుకు ఓ మహిళ హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి వస్తున్న సీఎం కాన్వాయ్కి అడ్డుపడ్డారు. దీంతో ఆమెను సభా ప్రాంగణానికి తీసుకురావాలని పోలీసులకు ముఖ్యమంత్రి సూచించినట్లు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి