Corona:రాష్ట్రంలో 1,257 కేసులు
రాష్ట్రంలో 101 రోజుల తర్వాత తొలిసారి 24 గంటల వ్యవధిలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 1,257 మందికి కొవిడ్ నిర్ధారణైంది.
101 రోజుల తర్వాత తొలిసారి వెయ్యికిపైగా నమోదు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 101 రోజుల తర్వాత తొలిసారి 24 గంటల వ్యవధిలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 1,257 మందికి కొవిడ్ నిర్ధారణైంది. గతేడాది సెప్టెంబరు 30న చివరిసారిగా 1,010 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వెయ్యికి పైగా కేసులు వెలుగుచూడటం ఇదే మొదటిసారి. 24 గంటల వ్యవధిలో 38,479 నమూనాలను పరీక్షించగా...3.26 శాతం మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ఈ నెల ఒకటో తేదీ నాటికి 0.57 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు గత వారం రోజుల వ్యవధిలో రోజు రోజుకూ పెరుగుతోంది. గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్తో మరణించారు.
ప్రవాసాంధ్రుల్లో పెరుగుతున్న కేసులు
విదేశాల నుంచి ఏపీకి చేరుకుంటున్న ప్రవాసాంధ్రుల్లోనూ కొవిడ్ విజృంభిస్తోంది. మస్కట్, కువైట్, కౌలాలంపూర్, దుబాయ్ ఇతర గల్ఫ్ దేశాల నుంచి నిత్యం ఒకటి లేదా రెండు సర్వీసుల్లో ప్రవాసాంధ్రులు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. 72 గంటలకు ముందు వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకుని నెగెటివ్ వచ్చిన వారిలో విమానం దిగిన తర్వాత పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. తాజాగా శనివారం దుబాయ్ నుంచి చేరిన ప్రవాసాంధ్రుల్లో నలుగురికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం.
* కర్నూలు వైద్య కళాశాలలోని బాలుర వసతి గృహంలో 11 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఆదివారం కొవిడ్ బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం నలుగురు హౌస్ సర్జన్లకు కొవిడ్ సోకింది.
* తమిళనాడులోని వేలూర్ సీఎంసీలో 200 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో కొత్తగా వచ్చే రోగులను ఆసుపత్రిలోకి అనుమతించకూడదని జిల్లా కలెక్టరు కుమరవేల్ పాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు. వేలూర్ సీఎంసీలో కరోనా బాధితులు చికిత్స పొందుతుండటంతో శనివారం వైద్య సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో సుమారు 200 మందికి కరోనా ఉన్నట్లు తేలింది.
తెలంగాణలో 1,673..
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 1,673 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,165 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు మృతి చెందారు.
ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ లేకపోతే రూ.50 జరిమానా
ఈనాడు, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేకుంటే రూ.50 చొప్పున జరిమానా విధించాలని ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని బస్సుల్లో టిమ్స్ ద్వారా జారీచేసే టికెట్లపై ఇదే విషయాన్ని ముద్రించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్