Fitment:ఫిట్మెంట్ 23%
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని, సమస్యల్ని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఫిట్మెంట్పై ఒక వాస్తవిక అంకెను చెప్పింది. 14.29 శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కానీ ఉద్యోగుల ఆకాంక్షల్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని.
2020 ఏప్రిల్ నుంచి వర్తింపు
ఉద్యోగులకు సవరించిన జీతాలు ఈ నెల నుంచి అమల్లోకి
పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకూ జనవరి జీతాలతో కొత్త స్కేల్స్
ఇకపై కేంద్ర వేతన సవరణ సంఘాల సిఫారసులే అమలు
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో సీఎం జగన్ ప్రకటన
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని, సమస్యల్ని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఫిట్మెంట్పై ఒక వాస్తవిక అంకెను చెప్పింది. 14.29 శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కానీ ఉద్యోగుల ఆకాంక్షల్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని.. వీలైనంత మంచి చేయాలన్న తపనతో 23 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించాం.
- ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. ఫిట్మెంట్ సహా కీలక అంశాలపై ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ సంఘాల్ని నియమించబోదని, కేంద్ర వేతన సవరణ సంఘం సిఫారసుల్నే అనుసరిస్తామని, ఉద్యోగులకు కూడా దాని వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికే 27 శాతం ఐఆర్ అమలు చేస్తోంది. వారికి 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎస్ కమిటీ సిఫారసు చేసింది. 55 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల ఐకాసలు, కనీసం 34 శాతమైనా ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేశాయి. వీటన్నింటినీ సమీక్షించిన ప్రభుత్వం 23 శాతం ఫిట్మెంట్ ఖరారు చేసింది. ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ అన్ని కోణాల్లో క్షుణ్నంగా అధ్యయనం చేసి 14.29 శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. వీలైనంత మంచి చేయాలన్న తాపత్రయంతో 23 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించాం’ అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం పేర్కొన్నారు. ‘ఒక వ్యక్తి ఆధ్వర్యంలోని కమిటీలు శాస్త్రీయంగా నిర్ణయాలు తీసుకోలేవు. కేంద్ర వేతన సవరణ సంఘాలు విస్తృత ప్రాతిపదికల్ని పరిగణనలోకి తీసుకుని, శాస్త్రీయ పద్ధతుల్లో చేసే ప్రతిపాదనల్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా అమలు చేస్తున్నాయి. ఇకపై మన రాష్ట్రంలోనూ అదే పంథా అనుసరించాలని నిర్ణయించాం’ అని ఆయన స్పష్టం చేశారు. పీఆర్సీ అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.10,247 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. అయినా ఉద్యోగులకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే, ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ ఆ బాధ్యత స్వీకరిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. అధికారుల కమిటీ చెప్పిన దానికంటే దాదాపు 9 శాతం పెంచి ఫిట్మెంట్ ఇస్తున్నామని, ఉద్యోగ సోదరులంతా సవినయంగా అర్థÄం చేసుకోవాలని మనవి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సీపీఎస్పై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని, జూన్ 30లోగా దానిపై ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.
ఇబ్బందులున్నా ఇస్తున్నాం
‘మీతో గురువారం సమావేశమైన తర్వాత మీరు చెప్పిన అన్ని అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించాను. మన ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర విభజనతో ఏర్పడ్డ సంక్లిష్టతలు, కొవిడ్ వల్ల ఆదాయం తగ్గడం, తాజాగా వచ్చిన ఒమిక్రాన్ రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో తెలియని సందిగ్ధతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని గురువారం సమావేశంలోనే చెప్పారు. ఈ ఉదయం అధికారులతో మళ్లీ మాట్లాడాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ 14.29 శాతానికి మించి ఫిట్మెంట్ ప్రతిపాదనకు అంగీకరించవద్దని వారు పదే పదే చెప్పారు. ఉద్యోగుల ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకుని మనం కూడా నాలుగడుగులు అటు వేయాలని సీఎస్ తదితరులకు చెప్పాను’ అని సీఎం వివరించారు. ఉద్యోగుల ఇతర డిమాండ్లపై కూడా ఆ సమావేశంలో చర్చించామని, వాటిని కూడా నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఆదేశించానని తెలిపారు. ‘ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సంతృప్తి స్థాయిలో అందాలంటే ఉద్యోగుల సహకారం లేకపోతే సాధ్యం కాదు. మా కుటుంబసభ్యులుగానే మిమ్మల్ని భావిస్తాను. ఇది మీ ప్రభుత్వం, ఈ భరోసా ఎప్పటికీ ఉండాలన్నదే నా భావన కూడా’ అని సీఎం పేర్కొన్నారు.
21 నెలల ముందుగానే..
‘కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాల్ని 2022 అక్టోబరు నుంచి ఇవ్వాలని సీఎస్ కమిటీ ప్రతిపాదించింది. అయితే ఉద్యోగుల ఆకాంక్షల మేరకు.. 21 నెలల ముందుగా, 2020 ఏప్రిల్ నుంచే ఇవ్వాలని నిర్ణయించాం’ అని సీఎం ప్రకటించారు. ‘ఈ నెల నుంచే పీఆర్సీ అమలు చేసి, సవరించిన జీతాలివ్వాలని అధికారులను ఆదేశించాను. పెండింగ్లో ఉన్న అన్ని డీఏల్ని ఒకేసారి జనవరి జీతంలో కలిపి ఇస్తాం. పీఎఫ్, జీఎల్ఐ, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి పెండింగ్ బకాయిలన్నీ ఏప్రిల్ నాటికి చెల్లిస్తాం. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకూ మేలు చేయాలన్న ఉద్దేశంతో వారికీ కొత్త స్కేల్స్ను జనవరి జీతాలతోనే అమలు చేస్తాం’ అని సీఎం వివరించారు. 2018 జులై 1ని పీఆర్సీ అమలు తేదీ (నోషనల్ బెనిఫిట్)గా పరిగణిస్తామన్నారు.
మీ అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే..!
ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంపు నిర్ణయం కూడా ఈ నెల ఒకటి నుంచే అమల్లోకి వస్తుందని సీఎం తెలిపారు. ‘మీరు సుదీర్ఘకాలం ప్రజాసేవలో పనిచేశారు. మీకు ఇంకా ఏ విధంగా మంచి చేయగలమని ఆలోచించాను. మీ అనుభవం రాష్ట్రానికి లభించిన ఆస్తి. రాష్ట్రాభివృద్ధికి మీ అనుభవం ఉపయోగపడాలి. మీ సేవల్ని మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలి, మీకు మరింత మేలు చేయాలన్న ఉద్దేశంతో పదవీ విరమణ వయసు పెంచుతున్నాం’ అని జగన్ ప్రకటించారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం చెప్పిన మరిన్ని ముఖ్యాంశాలు
* కొవిడ్ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. జూన్ 30లోగా నియామకాలన్నీ పూర్తి చేస్తాం.
* ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత మెరుగుపరచాలని మీ నుంచి పలు సూచనలు, సలహాలు వచ్చాయి. వాటిపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తున్నాం. రెండు వారాల్లో సమస్యలన్నీ పరిష్కరించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి... అత్యుత్తమ విధానం తెమ్మని సీఎస్కి చెప్పాను.
* గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం. సవరించిన రెగ్యులర్ జీతాలను ఈ ఏడాది జులై నుంచి ఇస్తాం.
* సొంతిల్లులేని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎంఐజీ లేఅవుట్లలోని ఫ్లాట్లలో 10 శాతం రిజర్వు చేస్తాం. నియోజకవర్గం యూనిట్గా తీసుకుంటాం. ఉద్యోగులకు 20 శాతం రిబేటుపై స్థలాలు కేటాయిస్తాం. ఏ ఉద్యోగీ సొంతింటి స్థలం లేకుండా ఉండకూడదన్నదే మా లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. -
దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం
కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
సీపీఎస్ రద్దుపై మాట దాటేసిన బొత్స
భోగాపురం ఎయిర్ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. -
సుజనాచౌదరి రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతి
భాజపా నేత సుజనాచౌదరిపై రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ-హైదరాబాద్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్