gas cylinder price:బండ బాదుడు!
పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పరుగు తీస్తున్నాయి. వాటితో వంట గ్యాస్ కూడా పోటీపడుతోంది. లీటరు పెట్రోలు రూ.110, డీజిల్ రూ.101 దాటేశాయి. లీటరు పెట్రోలుపై 30 పైసలు, డీజిల్పై 35 పైసల చొప్పున బుధవారం పెరిగింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.15 పెరిగి రూ.922 అయింది. ఈ ఏడాది జులైలో రూ.25.50 పెంచారు. ఆగస్టు 17, సెప్టెంబరు 1 తేదీల్లో రూ.25 చొప్పున పెరిగింది. పదేళ్లలో ఇంధన వాడకం, కేంద్రానికి వచ్చే ఆదాయం రెట్టింపు అయ్యాయి.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై రూ.15 పెంపు
లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్ రూ.100 పైమాటే
పదేళ్లలో రెట్టింపైన ఇంధన వినియోగం, ప్రభుత్వాల ఆదాయం
ఈనాడు - అమరావతి
పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పరుగు తీస్తున్నాయి. వాటితో వంట గ్యాస్ కూడా పోటీపడుతోంది. లీటరు పెట్రోలు రూ.110, డీజిల్ రూ.101 దాటేశాయి. లీటరు పెట్రోలుపై 30 పైసలు, డీజిల్పై 35 పైసల చొప్పున బుధవారం పెరిగింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.15 పెరిగి రూ.922 అయింది. ఈ ఏడాది జులైలో రూ.25.50 పెంచారు. ఆగస్టు 17, సెప్టెంబరు 1 తేదీల్లో రూ.25 చొప్పున పెరిగింది. పదేళ్లలో ఇంధన వాడకం, కేంద్రానికి వచ్చే ఆదాయం రెట్టింపు అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ భారీగానే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈసారి తొలి త్రైమాసికంలోనే (ప్రొవిజనల్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నిరకాల పెట్రో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా రూ.1.52 లక్షల కోట్లు సమకూరాయి. ఇందులో పెట్రోలు, డీజిల్పై ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ.72,361 కోట్లు, రాష్ట్రాలకు అమ్మకపు పన్నుల రూపంలో రూ.55,974 కోట్లు వచ్చాయి. అయినా పన్నుల తగ్గింపు బాధ్యత మీదంటే మీదంటూ కేంద్ర, రాష్ట్రాలు తప్పించుకుంటున్నాయి.
గృహవినియోగ గ్యాస్ సిలిండర్పై తొమ్మిది నెలల్లోనే రూ.206 పెంచారు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో సిలిండర్ ధర రూ.716 ఉండగా.. అక్టోబరులో రూ.922 అయింది. గతేడాది నవంబరుతో పోలిస్తే.. రూ.300 వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1.43 కోట్ల గృహ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో నెలకు 1.15 కోట్ల మంది సిలిండర్లు తీసుకుంటున్నారు. ఈ ఏడాదిలో పెంచిన రూ.200 లెక్కన చూస్తే.. నెలకు రూ.230 కోట్ల మేర వినియోగదారులపై భారం పడుతోంది.
* ప్రతి నెలా వంటగ్యాస్ ధరల్ని పెంచుతున్న కేంద్రం.. రాయితీకి దాదాపుగా మంగళం పాడేసింది. గతంలో సిలిండర్పై రూ.300 వరకు ఇవ్వగా.. ఇప్పుడు నామమాత్రంగానే అందుతోంది.
* వాణిజ్య సిలిండర్ (19 కిలోలు) ధర కూడా రూ.32 పెరిగింది. గత నెలలో రూ.1,814 ఉన్న సిలిండర్ రేటు.. అక్టోబరులో రూ.1,846 అయింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో రూ.1,891 వరకు ఉంది.
రోజువారీ పెట్రో బాదుడు
పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల రోజువారీ వ్యవహారంగా తయారైంది. జులై వరకు పగ్గాల్లేకుండా పెరిగిన ధరలు.. కొంతకాలం ఆగాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజులుగా పరుగు మళ్లీ మొదలైంది. వరసగా పదో రోజు డీజిల్, ఏడో రోజు పెట్రోలు ధరలు పెరిగాయి. దీంతో విజయవాడలో లీటరు పెట్రోలు రూ.108.54, డీజిల్ రూ.100.98 అయ్యాయి.
* రాష్ట్రంలో విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, కడప మినహా.. మిగిలిన అన్ని జిల్లా కేంద్రాల్లో లీటరు పెట్రోలు రూ.109, డీజిల్ రూ.101పైనే ఉన్నాయి. చిత్తూరులో పెట్రోలు రూ.110, డీజిల్ రూ.102 దాటాయి.
* శ్రీశైలంలో లీటరు పెట్రోలు రూ.110.07, డీజిల్ రూ.102.09 ఉండగా.. తిరుపతిలో పెట్రోలు రూ.109.43, డీజిల్ రూ.101.48 చొప్పున విక్రయిస్తున్నారు.
రెట్టింపైన రాబడి.. బాదుడు ఆపని కేంద్రం
దశాబ్దకాలంలో ఇంధన వినియోగం రెట్టింపు అయింది. ఏడేళ్లలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయమూ 164% పెరిగింది. అయినా పన్నులు తగ్గట్లేదు. అన్నిరకాల పెట్రో ఉత్పత్తులపై వివిధ రకాల పన్నుల రూపంలో కేంద్రానికి 2014-15 సంవత్సరంలో రూ.1.72 లక్షల కోట్ల ఆదాయం లభించగా.. గత ఆర్థిక సంవత్సరం నాటికి రూ.6.71 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో రూ.89,652 కోట్ల ఆదాయం వచ్చింది.
* దశాబ్దకాలంలో ఇంధన వాడకం దాదాపు రెట్టింపైంది. కొవిడ్ కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో కొంత తగ్గినా.. ఈ ఏడాది మళ్లీ పెరిగింది. 2019-20 ఆగస్టులో దేశవ్యాప్తంగా 25,75,000 టన్నుల పెట్రోలు వినియోగించగా.. ఈ ఏడాది ఆగస్టులో 26,91,000 టన్నులకు పెరిగింది.
* 2018 అక్టోబరులో లీటరు పెట్రోలుపై రూ.17.98, డీజిల్పై రూ.13.83 చొప్పున పన్నులు వసూలు చేయగా.. గతేడాది ఫిబ్రవరి నుంచి పెట్రోలుపై రూ.32.90, డీజిల్పై రూ.31.80 చొప్పున పిండుకుంటున్నారు.
పెట్రోలుపై పన్నులు తగ్గించిన తమిళనాడు.. ఏపీ కంటే లీటరుకు రూ.10 తక్కువ ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం.. పెట్రోలుపై పన్నులను తగ్గించింది. గతంలో 15% అమ్మకపు పన్ను+ లీటరుకు రూ.13.02 చొప్పున ఉండగా.. దీన్ని 13% అమ్మకపు పన్ను+ లీటరుకు రూ.11.52 చేసింది. ఈ రాష్ట్రానికి పన్నుల ద్వారా ఏడాదికి (2018-19లో) రూ.14,421 కోట్ల ఆదాయం వచ్చింది.
* ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే.. పక్కనే ఉన్న తమిళనాడులో పెట్రోలు ధరలు లీటరుకు రూ.10 వరకు తక్కువగా ఉన్నాయి. కుప్పంలో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ.111.48, డీజిల్ రూ.103.33 ఉంది. పక్కనే ఉన్న తమిళనాడు పరిధిలోని ప్రాంతంలో లీటరు పెట్రోలు రూ.101.56, డీజిల్ రూ.96.98 ఉంది.
రాష్ట్రానికి 3 నెలల్లో రూ.3,420 కోట్లు
దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ.. ఆంధ్రప్రదేశ్లోనే అమ్మకపు పన్ను ఎక్కువ. అదనపు వ్యాట్, రోడ్డు అభివృద్ధి సుంకం ద్వారా లీటరు పెట్రోలుపై రూ.29, డీజిల్ ద్వారా రూ.22పైగా రాష్ట్ర ఖజానాకు వస్తోంది. గతేడాది రూ.11,014 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో పెట్రోలు, డీజిల్పై అమ్మకపు పన్ను ద్వారా రూ.3,420 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.43 కోట్ల ఆదాయం వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా