ED: జగన్పై మరో కేసు
వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో మరొకటి చేరింది. 11 సీబీఐ, 6 ఈడీ కేసులకు అదనంగా మరో ఈడీ కేసు నమోదు కావడంతో... కేసుల సంఖ్య 18కి పెరిగింది. ఉమ్మడి రాష్ట్ర ఏపీ హౌసింగ్ బోర్డు, ఇందూ
ఇందూ హౌసింగ్ బోర్డు అక్రమాలపై ఈడీ అభియోగపత్రం
నిందితుల్లో వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్తో సహా 11 మంది
విజయసాయిరెడ్డి పేరు తొలగింపు
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో మరొకటి చేరింది. 11 సీబీఐ, 6 ఈడీ కేసులకు అదనంగా మరో ఈడీ కేసు నమోదు కావడంతో... కేసుల సంఖ్య 18కి పెరిగింది. ఉమ్మడి రాష్ట్ర ఏపీ హౌసింగ్ బోర్డు, ఇందూ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్ట్ అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత ఏడాది దాఖలు చేసిన అభియోగ పత్రంపై ఇటీవల ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. గత ఏడాది ఈడీ అభియోగ పత్రం దాఖలు చేసినప్పటికీ అందులో లోపాలు ఉండటంతో కోర్టు పలుమార్లు వెనక్కి పంపింది. సమగ్ర వివరాలతో ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రంపై ఏప్రిల్ 23న విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం మరోసారి విచారణకు రాగా జూన్ 30కి వాయిదా పడింది. ఈ కేసులో 11 మందిని (వ్యక్తులు/సంస్థలు) నిందితులుగా పేర్కొంది. నిందితుల జాబితాలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ఐ.శ్యాంప్రసాద్రెడ్డి, జితేంద్ర మోహన్దాస్ వీర్వాణి, వై.వి.సుబ్బారెడ్డి, ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే వి.వి.కృష్ణప్రసాద్, ఇందూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిడ్కో (సైబర్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్), ఇందూ ఈస్ట్రన్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందూ రాయల్ హోమ్స్, వసంత ప్రాజెక్ట్స్, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లను చేర్చింది. నిందితులపై మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 4, 3 కింద ఫిర్యాదు దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణ జూన్ 30న జరగనుంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే రూ.117 కోట్ల ఆస్తులను జప్తు చేసిన విషయం విదితమే.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో నమోదైన కేసుల్లో మొదటిసారి విజయసాయిరెడ్డి పేరు కనిపించలేదు. సీబీఐ కేసులు 11, ఈడీ ఇప్పటిదాకా దాఖలు చేసిన 6 అభియోగ పత్రాలతో సహా మొత్తం 17 కేసుల్లోనూ రెండో నిందితుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ఉంది. హౌసింగ్ బోర్డు అక్రమాలపై దాఖలు చేసిన అభియోగ పత్రంలోనూ రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పేరును ఈడీ తన ఫిర్యాదులో తొలగించింది. విజయసాయిరెడ్డితో పాటు సీబీఐ కేసులో నిందితుల జాబితాలో ఉన్న జగన్కు చెందిన కార్మెల్ ఏసియా లిమిటెడ్ను, ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మొహంతిని కూడా నిందితుల జాబితా నుంచి ఈడీ తొలగించింది.
కేసు నేపథ్యం ఇదీ
గృహనిర్మాణ మండలి నుంచి హైదరాబాద్లోని కూకట్పల్లి, గచ్చిబౌలి, బండ్లగూడ, కర్నూలు జిల్లా నంద్యాలలో హౌసింగ్ ప్రాజెక్టులను ఇందూ గ్రూపు అక్రమంగా పొందిందని సీబీఐ పేర్కొంది. కూకట్పల్లిలో 65, బండ్లగూడలో 50, గచ్చిబౌలిలో 21 ఎకరాలను, నంద్యాల మూలసాగరంలో 75 ఎకరాలను మార్కెట్ ధరకంటే చౌకగా హౌసింగ్ బోర్డు కేటాయించింది. గృహనిర్మాణ మండలి ప్రాజెక్టులను పొందడానికి స్నేహితుల కంపెనీల సాయంతో ఇందూ కంపెనీ అర్హత సాధించిందని, ఆపై ఆ కంపెనీలు బయటికి వెళ్లిపోయాయని సీబీఐ పేర్కొంది. ఎంబసీ గ్రూపు ఛైర్మన్ జితేంద్ర వీర్వాణి అలియాస్ జీతూ వీర్వాణి ఈ ప్రాజెక్ట్ వల్ల రూ.50.16 కోట్లు లబ్ధి పొందారని తేల్చింది. గచ్చిబౌలి ప్రాజెక్టులో 4.5 ఎకరాలను కృష్ణప్రసాద్కు చెందిన వసంత ప్రాజెక్ట్స్కు కేటాయించారు. వసంత ప్రాజెక్ట్స్లో తనకున్న సగం వాటాను శ్యాంప్రసాద్రెడ్డి... అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖర్రెడ్డి తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డికి బదలాయించారు. వై.వి.సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్లు విల్లాలను మిత్రులు, బంధువులకు కేటాయించుకుని లబ్ధి పొందారు. వైవీకి వాటా దక్కడంతో ఇందూకు ఎలాంటి బిడ్ లేకుండానే అదనంగా 15 ఎకరాలను కూకట్పల్లి ప్రాజెక్టులో భాగంగా కేటాయింపు జరిగిపోయిందనీ సీబీఐ వెల్లడించింది. వీటన్నింటికీ ప్రతిఫలంగా ఇందూ గ్రూపు పలు కంపెనీల ద్వారా జగన్ కంపెనీల్లోకి రూ.70 కోట్లు పెట్టుబడులు పెట్టింది. సీబీఐ ఛార్జిషీటు ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసి...పెట్టుబడుల మళ్లింపు, అక్రమ లావాదేవీలపై ఫిర్యాదు దాఖలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు