Krishnapatnam: ఒక విడతలో 10 లక్షల మందికి
రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే.. అన్ని వనరులు సమకూరితే ఒక విడతలో 10 లక్షల మందికి మందు తయారు చేయగలమన్న నమ్మకాన్ని ఆనందయ్య వ్యక్తం చేశారు.. ‘మందు తయారీకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాం
మందు తయారీపై ఆనందయ్య విశ్వాసం
ప్రభుత్వ సాయం కోరామని వెల్లడి
ఈనాడు డిజిటల్, నెల్లూరు - కృష్ణపట్నం (ముత్తుకూరు), న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే.. అన్ని వనరులు సమకూరితే ఒక విడతలో 10 లక్షల మందికి మందు తయారు చేయగలమన్న నమ్మకాన్ని ఆనందయ్య వ్యక్తం చేశారు.. ‘మందు తయారీకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఇప్పటివరకు సాయం అందలేదు. అందిన వెంటనే వేగంగా ప్రజలకు మందు అందిస్తాం’ అని చెప్పారు. సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో తన నివాసంలో ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో, విలేకరులతో మాట్లాడారు. ‘అవాంతరాలతో 15 రోజులపాటు తయారీ నిలిచిపోయింది. అనుమతి ఇచ్చినప్పటి నుంచి తయారీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులతో యంత్రాలు కాలిపోతున్నాయి. మందు తయారీ నిర్విరామంగా జరగాలంటే.. కాస్త సమయం పడుతుంది. దేశంలో అవసరమైన వారందరికీ అందజేయాలని ప్రణాళిక నిర్దేశించుకున్నాం. నా మీద రాజకీయ ఒత్తిడి లేదు. ముందుగా కొవిడ్ బాధితులకు ఇవ్వాలనుకుంటున్నాం. అధికారులు సహకరించి పాజిటివ్ వ్యక్తులను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తే ప్రయోజనంగా ఉంటుంది. సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో పంపిణీ చేసే ఉద్దేశం లేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఆనందయ్య వివరించారు. మరో వైపు ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆర్డీవో హుస్సేన్సాహెబ్, గ్రామీణ డీఎస్పీ హరినాథ్రెడ్డి ఆయనతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో ఆనందయ్య మాట్లాడుతూ.. రవాణా, ప్యాకింగ్ వంటి పనులకు దాదాపు 300 మంది అవసరమవుతారని చెప్పారు. కృష్ణపట్నంలోనే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకుని తయారు చేసేందుకు ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు.
సంపాదించాలన్న ఆలోచన చేస్తే నాశనమవుతా: ఎమ్మెల్యే కాకాణి
వెంకయ్య స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. ఆనందయ్య మందును అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించాలనుకున్నా.. ఆ దిశగా ఆలోచన చేసినా తాను, తమ కుటుంబసభ్యులు సర్వనాశనమైపోతామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మండలం గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలోని కల్యాణమండపంలో ఆనందయ్య మందును ఆయన పంపిణీ చేశారు. తనపై అభాండాలు వేసిన వారికి ఏ శిక్ష విధించాలో దేవుడే చూసుకుంటారన్నారు. నియోజకవర్గంలోని 1.80 లక్షల కుటుంబాలకు తొలుత మందు అందజేస్తామని చెప్పారు.
నా ఆరోపణలన్నీ నిజాలే: సోమిరెడ్డి
నెల్లూరు, న్యూస్టుడే: ఆనందయ్య మందు పంపిణీకి తయారుచేసిన వెబ్సైట్ విషయంలో తాను చేసిన ఆరోపణలన్నీ నిజాలేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. వాటి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడిస్తే అర్ధరాత్రి నాన్బెయిలబుల్ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. సోమవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, అరెస్టు చేసుకోండని సవాల్ చేశారు. అక్రమంగా వెబ్సైట్ను ప్రారంభించిన వారిపై కేసులు నమోదు చేయరా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేని కలిశానని వెబ్సైట్ తయారీదారు ఒప్పుకున్నారని, అధికారుల వద్దకు వెళ్లానని కూడా చెప్పారని వెల్లడించారు. పబ్లిక్ వెబ్సైట్లో ఉన్న వాటిని మీడియా ముందు ఉంచితే కేసులు పెడతారా అని వ్యాఖ్యానించారు. సంస్థ ఉండేది నెల్లూరు దర్గామిట్ట పోలీసుస్టేషన్ పరిధిలో అయితే కృష్ణపట్నంలో కేసు ఎలా పెడతారని మండిపడ్డారు. వెబ్సైట్పై ఫిర్యాదు ఇవ్వాలని రోజంతా ఎదురుచూసినా ఒక్క పోలీసు అధికారి కూడా అందుబాటులో లేరన్నారు. దీంతో మెయిల్లో ఎస్పీకి పంపామని వివరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ, తమ పోరాటంతోనే ఆనందయ్య మందుకు అనుమతులు త్వరగా వచ్చాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు?
రాజీనామా చేశాక వాలంటీర్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మధ్య అనుబంధం పోతుందని.. అలాంటప్పుడు వారి మాట విని ఏ లబ్ధిదారు ఓటేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
గులకరాయి కేసులో కస్టడీ పిటిషన్పై ముగిసిన వాదనలు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్ను పోలీసు కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.