AP News: రాష్ట్రానికి కేంద్రం షాక్
రుణాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేస్తూ తాఖీదు పంపింది. ఒక వైపు రుణ పరిమితిని పెంచాలని ...
బహిరంగ మార్కెట్ రుణ పరిమితిలో భారీ కోత
పాత అప్పుల పేరుతో రూ.17,924 కోట్ల తీసివేత
ఇతరత్రా అప్పులూ మినహాయింపు
ఉన్న రుణ పరిమితికీ ఎసరు
ఇక మిగిలింది రూ.27,668 కోట్లే
ఆర్థికశాఖ అధికారుల తర్జనభర్జన
ఈనాడు, అమరావతి: రుణాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేస్తూ తాఖీదు పంపింది. ఒక వైపు రుణ పరిమితిని పెంచాలని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు కేంద్రం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.42,472 కోట్ల బహిరంగ మార్కెట్టు రుణంగా తొలుత లెక్కతేల్చినా ఇప్పుడు అందులో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు భారీ కోత పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్టు రుణ పరిమితిని రూ.27,668 కోట్లుగా నిర్ధారించి ఆ విషయాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్కు తెలియజేస్తూ కేంద్ర ఆర్థికశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ అగర్వాల్ లేఖ పంపారు.
అప్పుల కథ తెలుసుకుని మరీ...
రాష్ట్రం నికర రుణ పరిమితి లెక్కలు తేల్చేందుకు గత కొన్నేళ్లుగా తీసుకున్న రుణాలపై సమగ్ర నివేదిక పంపాలని ఈ ఏడాది మార్చిలోనే కేంద్రం కోరింది. ఆ వివరాలన్నీ సమర్పించిన తర్వాత పరిమితి ఎంత ఉందో చెబుతామని స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్లో ఆర్థికశాఖ అధికారులు ఆ వివరాలన్నీ కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. ఆ లెక్కలన్నీ పరిశీలించిన కేంద్రం... రుణ పరిమితిలో భారీ కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.27,668 కోట్లకే రుణాన్ని పరిమితం చేసింది. పెట్టుబడి వ్యయం కోసం మొత్తాన్ని ఖర్చు చేశాక మరో 0.5% మేర రుణ పరిమితి పెంచుతామని షరతు విధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తి రూ.10,61,802 కోట్లుగా ఆర్థిక సంఘం లెక్కలు వేసింది. అందులో 4% మేర ఈ ఏడాది రాష్ట్రం అప్పులు చేసుకునేందుకు వీలుంటుందని తేల్చింది. ఆ లెక్కన రూ.42,472 కోట్లు రాష్ట్రం అప్పు తీసుకోవచ్చని లెక్కలు కట్టింది. ఇందులో మూలధన వ్యయం కింద రూ.27,589 కోట్లు ఖర్చు చేయాలంది. అలా చేస్తేనే రుణ పరిమితి మరో 0.5% ఇస్తామని పేర్కొంది. మూలధన వ్యయం ఆ మేర చేశారో లేదో లెక్కించే వరకూ 0.5%... అంటే రూ.5,309 కోట్ల మేర కోత పెడుతున్నట్లు పేర్కొంది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ రుణ పరిమితి రూ.37,163 కోట్లకు పరిమితమైంది. అయితే, రుణాలు తిరిగి చెల్లించడంతో రూ.14,429 కోట్ల అదనపు వెసులుబాటు వచ్చింది. అప్పుడు నికర రుణపరిమితి రూ.51,592 కోట్లకు చేరింది.
రూ.17,924 కోట్ల అప్పు ముందే చేసేసి..
రాష్ట్ర ప్రభుత్వం విభజన తర్వాత ఇంతవరకు చేసిన అప్పుల వివరాలన్నీ ఏప్రిల్ 22న లేఖ రూపంలో కేంద్రానికి తెలియజేసింది. రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి కన్నా ఇంతకుముందు సంవత్సరాల్లోనే అదనంగా రూ.17,923.94 కోట్లు అప్పు చేసినట్లు కేంద్రం గుర్తించింది. దీంతోపాటు ఇతరత్రా అప్పుల రూపంలోనూ రూ.6,000 కోట్లు మినహాయించింది. అన్నీ కలిపి ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రుణ పరిమితికి రూ.23,924 కోట్ల కోత పడి... చివరకు రూ.27,668 కోట్లకు చేరింది.
అధికారుల తర్జనభర్జన
కేంద్రం నుంచి తాఖీదు అందడంతో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేది ఎలాగని సమావేశమై చర్చించినట్లు తెలిసింది. కేంద్రానికి వివరణలు పంపి కొంతమేర అదనపు రుణ పరిమితి రాబట్టేందుకు ఉన్న మార్గాలపై సమాలోచనలు జరుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ