River Board: ఏ బోర్డుకూ లేనన్ని!
దేశంలోని ఏ నదీ యాజమాన్య బోర్డుకూ లేని విస్తృత అధికారాలను కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్రం కల్పించింది. ఏ బోర్డుకు తమ ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వాలపై చర్య తీసుకునే అవకాశంలేదు. కానీ ఈ రెండు బోర్డులకు....
కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలను కల్పించిన కేంద్రం
గీత దాటితే జరిమానాలు
ఈనాడు - హైదరాబాద్
దేశంలోని ఏ నదీ యాజమాన్య బోర్డుకూ లేని విస్తృత అధికారాలను కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్రం కల్పించింది. ఏ బోర్డుకు తమ ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వాలపై చర్య తీసుకునే అవకాశంలేదు. కానీ ఈ రెండు బోర్డులకు ఆ అవకాశాన్ని కేంద్రం కల్పించింది. తాజాగా ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలను, దీనికి ఆధారంగా తీసుకున్న ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి విడుదలలో సమస్యలు వచ్చే అవకాశమున్న ప్రాజెక్టులు, నీటిని విడుదల చేసే తూములే కాకుండా మొత్తం బేసిన్లోని అన్ని ప్రాజెక్టులను కేంద్రం బోర్డుల పరిధిలోకి తెచ్చింది. కృష్ణా బేసిన్లోని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పెన్నా బేసిన్కు.., గోదావరి ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్లోకి నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టులున్నాయి. దీంతో కృష్ణా, పెన్నా బేసిన్లను కృష్ణా బోర్డు పరిధిలోకి తెచ్చింది. వీటన్నింటికీ మించి ఏపీ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలు 9వ పేరా ప్రకారం ఏ రాష్ట్రమైనా నిర్ణయాన్ని అమలు చేయకపోతే దీనికి సంబంధిత రాష్ట్రం బాధ్యత వహించడంతో పాటు కేంద్రం ఆర్థికంగానూ, ఇతరత్రా రూపంలో వేసే అపరాధాన్ని భరించాల్సి ఉంటుంది.
ఇలాంటి నిబంధన ఇప్పటివరకూ ఏ బోర్డులోనూ లేదు. వివిధ రకాల నీటి లభ్యత కింద కేటాయింపులు ఉన్నందున తీర్పును ఒక రాష్ట్రం అమలు చేయకపోయినా ఇంకో రాష్ట్రంపై ఆ ప్రభావం పడుతుంది. దీనిని పరిగణనలోకి తీసుకొని కృష్ణా జల తీర్పు అమలు బోర్డు(కె.డబ్ల్యు.డి.ఐ.బి)ను ఏర్పాటు చేయాలని కృష్ణా జలవివాద ట్రైబ్యునల్-2 పేర్కొంది. దీనికి పర్యవేక్షణ అధికారం మాత్రమే ఉంది. దీని పరిధి మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు ఉంది. రాష్ట్రాలు ఇచ్చే సమాచారాన్ని రికార్డు చేయడం, తీర్పు ప్రకారం నిల్వలు, విడుదల, వినియోగం ఉన్నాయో లేదో చూడటమే దీని పని. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు మరిన్ని విస్తృతాధికారాలతో కొత్త బోర్డును కేంద్రం నోటిఫై చేసింది. కృష్ణా ట్రైబ్యునల్-2 తుది తీర్పు 2013లోనే వచ్చినా సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఇంకా కేంద్రం నోటిఫై చేయలేదు. ఇది నోటిఫై అయితే ఇంకో బోర్డు వస్తుందో లేదో చూడాల్సి ఉంది. వస్తే ఒకదానిమీద ఇంకొకటి, రాకుంటే ఎగువ రాష్ట్రాల నీటి వినియోగంపై పర్యవేక్షణ ఉండదు.
మెజారిటీ ఇంజినీర్లు బోర్డు పరిధిలోకి: రెండు రాష్ట్రాల పరిధిలో ప్రత్యేకించి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఇంజినీర్లలో ఎక్కువ మంది ఇక నుంచి బోర్డు పరిధిలోకి రానున్నారు. బోర్డు కనుసన్నల్లోనే ఇక్కడ చేసే పనులు జరుగుతాయి. ఈక్రమంలో కొందరు చీఫ్ ఇంజినీర్ల పాత్ర నామమాత్రం కానుంది. అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చినా, బోర్డు నియంత్రణలో కొన్ని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించేవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు శ్రీశైలం ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖకు సంబంధించి 250 మంది ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వీరంతా బోర్డు పరిధిలోకే వస్తారు. శ్రీశైలం అనుబంధంగానే రెండు విద్యుత్తు హౌస్లు, హంద్రీనీవా, కల్వకుర్తి, పోతిరెడ్డిపాడు, బనకచెర్ల హెడ్రెగ్యులేటర్, వెలిగొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, దీనికి అనుబంధంగా ఉన్న కాలువలు, పవర్ హౌస్ ఇలా అన్నీ బోర్డు పరిధిలోనే ఉన్నాయి. దీని నియంత్రణలో ఉండే ప్రాజెక్టుల్లోని ఉద్యోగులకు చెందిన అంశాలను కూడా బోర్డే చూస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తుంగభద్ర, కావేరిలలో ఇలా..
తుంగభద్ర నదీ యాజమాన్య బోర్డుకు పూర్తి అధికారాలున్నాయి. ఇది ఒక ప్రాజెక్టు కింద రెండు రాష్ట్రాల వినియోగం... ఎగువన అనధికార వినియోగంతో సరిహద్దులో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నీరు రాకున్నా పోలీసుల సాయంతో వచ్చేలా ప్రయత్నం చేయడం తప్ప వేరే రకమైన చర్య తీసుకోవడానికి వీల్లేదు. పైగా అక్కడ కాలువల ద్వారా వచ్చే నీటిని అనధికారికంగా వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కావేరిలో నీటి యాజమాన్య అథారిటీ తీసుకొనే నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకున్నా.. సహకరించకపోయినా కేంద్రం సాయం కోరవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం