ఫేస్బుక్ సాంకేతిక తప్పిదంతోనే..
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ సేవలు స్తంభించడానికి ఆ సంస్థ చేసిన పొరపాటే కారణమని తెలుస్తోంది. సోమవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు ఏడు గంటలపాటు స్తంభించిన ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం సేవలు మంగళవారం తెల్లవారుజాము నుంచి యథావిధిగా
ప్రపంచవ్యాప్తంగా సేవలకు అంతరాయం
ఏడు గంటల తర్వాత పునరుద్ధరణ
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ సేవలు స్తంభించడానికి ఆ సంస్థ చేసిన పొరపాటే కారణమని తెలుస్తోంది. సోమవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు ఏడు గంటలపాటు స్తంభించిన ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం సేవలు మంగళవారం తెల్లవారుజాము నుంచి యథావిధిగా పనిచేయడం ప్రారంభించాయి. ‘కాన్ఫిగరేషన్’లో తప్పుడు మార్పులు జరగడం వల్లనే సేవలు నిలిచిపోయినట్లు ఫేస్బుక్ పేర్కొంది. ‘బ్యాక్బోన్ రౌటర్స్ కాన్ఫిగరేషన్’లో మార్పులు చేయడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది. డేటా సెంటర్లు, నెట్వర్క్ ట్రాఫిక్ మధ్య సమన్వయానికి ఈ రౌటర్లే కీలకం. దీనిలో మార్పుల వల్ల డొమైన్ నేమ్ సిస్టం (డీఎన్ఎస్)లో తప్పులు వచ్చాయి. డీఎన్ఎస్ అంటే వెబ్సైట్ పేరును ఐపీ చిరునామాగా మార్చే వ్యవస్థ. సేవలు నిలిచిపోయినప్పుడు వినియోగదారులతో పాటు ఫేస్బుక్ సిబ్బందీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో అంతర్గత సమాచార వ్యవస్థ కూడా స్తంభించింది. ఈ సేవల్నీ ఫేస్బుక్ డొమైన్ నుంచే యాక్సెస్ చేయాల్సి ఉండటం ఇందుకు కారణం. డీఎన్ఎస్ సమస్య వల్ల ఫేస్బుక్ కార్యాలయంలోని ఇంజినీర్ల బ్యాడ్జీలు కూడా పనిచేయలేదు. ఫలితంగా వారు కార్యాలయంలోని కీలక గదుల్లోకి ప్రవేశించలేకపోయారు. సమస్యను పరిష్కరించేందుకు అన్ని గంటలు పట్టడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది.
ఏమైందో తెలుసుకుంటున్నాం..
సేవలకు అంతరాయం కలగడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. సేవల్లో కలిగిన అంతరాయానికి గానూ తమను క్షమించాలని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బర్గ్ కోరారు. ఒకరితో ఒకరు అనుసంధానమయ్యేందుకు ప్రజలు ఫేస్బుక్పై ఎంతగా ఆధారపడతారో తనకు తెలుసునని చెప్పారు. ‘సేవలు నిలిచిపోవడం వల్ల వాడకందారుల సమాచారానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దాదాపు సేవలన్నీ మునుపటి మాదిరిగా అందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మాపై ఆధారపడిన కోట్లమంది ప్రజలకు, వ్యాపారులకు కలిగిన అసౌకర్యంపై చింతిస్తున్నాం. ఎందువల్ల అంతరాయం వాటిల్లిందో పూర్తిస్థాయిలో తెలుసుకునే పనిలో ఉన్నాం. మా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది’ అని ఫేస్బుక్ ఉపాధ్యక్షుడు సంతోష్ జనార్ధన్ తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద సామాజిక మాధ్యమ సంస్థ అయిన ఫేస్బుక్ నుంచి సేవలన్నీ ఒకేసారి నిలిచిపోవడం అత్యంత అరుదైనదని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్