Chandrababu: చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
ముఖ్యమంత్రిని ఉద్దేశించి తెదేపా నేత పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైకాపా నేతలు డిమాండు చేశారు. గురువారం వైకాపా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపట్టారు. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు
ఈనాడు, యంత్రాంగం: ముఖ్యమంత్రిని ఉద్దేశించి తెదేపా నేత పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైకాపా నేతలు డిమాండు చేశారు. గురువారం వైకాపా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు చేపట్టారు. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. విజయవాడలో వైఎస్ విగ్రహం వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి దీక్షను ప్రారంభించారు. ‘చంద్రబాబుకు రాజకీయాల్లోనే కాదు, సమాజంలోనే ఉండే అర్హత లేదు, తెదేపా నాయకులు ఎక్కడ కనిపించినా నిలదీయాలి’ అని సూచించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.
* తెదేపాను కాపాడుకునేందుకే చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విశాఖజిల్లా తగరపువలస దీక్షకు ఆయన హాజరయ్యారు. పెందుర్తి దీక్షలో ఎమ్మెల్యే అదీప్రాజ్, గాజువాక జంక్షన్లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ బైక్ర్యాలీ నిర్వహించి, పట్టాభిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు.
* మరోసారి నోరు కదిపితే పట్టాభికైనా, వాళ్ల తాతకైనా కాళ్లు విరుగుతాయని విద్యుత్తుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద దీక్షలో ఆయన మాట్లాడారు. పర్చూరు, చీరాల, అద్దంకి, కనిగిరి, మార్కాపురం, దర్శి ప్రాంతాల్లో చేపట్టిన దీక్షల్లో ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
* చిత్తూరు జిల్లాలోని పలు స్టేషన్లలో పట్టాభిపై వైకాపా నేతలు ఫిర్యాదుచేశారు. నారాయణవనం, వాల్మీకిపురం, చిత్తూరులో దీక్షల్లో పలువురు పాల్గొన్నారు.
* అనంతపురంలోని వైకాపా కార్యాలయం, బుక్కరాయసముద్రం, కదిరి, రాయదుర్గం, గుంతకల్లులో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
* కడప అంబేద్కర్ కూడలి, రైల్వేకోడూరు, రాయచోటిలో దీక్షలు జరిగాయి.
* చంద్రబాబు దొంగదీక్షలతో ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని నెల్లూరు జిల్లా ముత్తుకూరు దీక్షలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. ఆత్మకూరు, నెల్లూరులోనూ దీక్షలు జరిగాయి.
* తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దీక్షలో మంత్రి వేణుగోపాలకృష్ణ, కాకినాడలో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, తుని గొల్లప్పరావు సెంటర్లో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్, అమలాపురంలో ఎంపీ చింతా అనూరాధ పాల్గొన్నారు.
* పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో మంత్రి రంగనాథరాజు ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. నరసాపురం అంబ్కేడర్ కూడలి, పాలకొల్లు, గోపాలపురం ప్రాంతాల్లో నిర్వహించిన దీక్షల్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
* శ్రీకాకుళం జిల్లా రాజాంలోని పాలకొండ కూడలి, ఇచ్ఛాపురం, కవిటి, ఆమదాలవలస, రణస్థలం ప్రాంతాల్లో దీక్షలు చేశారు.
* కర్నూలు జిల్లా ఆలూరులో దీక్షకు మంత్రి గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. నంద్యాల గాంధీచౌక్లో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో దీక్షను ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
* గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. తాడికొండలో ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, వేమూరులో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లిలో ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్, రేపల్లెలో ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు హాజరయ్యారు.
* విజయనగరం జిల్లా కురుపాం దీక్షలో ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోనూ దీక్షలు జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా