Azadi Ka Amrit Mahotsav: చైనాతో పో‘టీ’పడి మనకు రుద్దారు!
నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా లెక్కనేనన్నిసార్లు గొంతుల్లో పడనిదే మనసును ప్రశాంతంగా ఉండనివ్వని చాయ్కీ... మన జాతీయోద్యమానికీ సంబంధం ఉంది.
నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా లెక్కనేనన్నిసార్లు గొంతుల్లో పడనిదే మనసును ప్రశాంతంగా ఉండనివ్వని చాయ్కీ... మన జాతీయోద్యమానికీ సంబంధం ఉంది. బ్రిటన్లో డబ్బులు కాపాడుకోవటానికి తెల్లవారు వేసిన ఎత్తుగడ మన గొంతులకూ చుట్టుకుంది... ఇప్ప‘టీ’కీ వదలకుండా!
వ్యాపారం కోసం భారత్లో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ బ్రిటన్లో తమ ఖజానా ఖాళీ కాకుండా కాపాడుకోవటానికి ‘టీ’ని భారత్కు అంటగట్టింది. కాపాడుకుంటే చాలనుకుంటే ఏకంగా అది తమ ఖజానాను నింపేదిలా మారటం తెల్లవారు కూడా ఊహించని పరిణామం! 18వ శతాబ్దంలో బ్రిటన్లో టీకి డిమాండ్ ఎక్కువుండేది. వారిక్కావల్సిన తేయాకును చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. దీంతో చాలా సొమ్ము చైనాకు చెల్లించాల్సి వచ్చేది. బ్రిటిష్వారి బుర్రలో ఓ ఐడియా వెలిగింది. చైనాకు అవసరమైన నల్లమందును ఎగుమతి చేసి, బదులుగా టీని దిగుమతి చేసుకోవాలని తలచారు. ఇందుకోసమని భారత్లో భారీస్థాయిలో నల్లమందు పండించటం మొదలెట్టించారు. భారత్ నుంచి నల్లమందును చైనాకు పంపించి... చైనా నుంచి తేయాకును ఇంగ్లాండ్కు రప్పించేవారు.
చైనా మత్తువదలటంతో...
తమ ప్రజానీకం మత్తుకు బానిసవుతున్నారని ఆందోళన చెందిన చైనా... నల్లమందు దిగుమతిని ఆపేయాలని నిర్ణయించింది. దీనిపై 1839లో నల్లమందు యుద్ధమే జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటన్ గెలిచినా చైనా నుంచి టీ ఎగుమతులు తగ్గిపోయాయి. బ్రిటన్ కన్ను భారత్పై పడింది. తమ చేతిలో బొమ్మలా మారిన భారత్లోనే తేయాకు పండిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించింది. 1830లో ఈస్టిండియా కంపెనీ అస్సాంలో తొలి టీ ఎస్టేట్ను ఆరంభించింది. చైనా నుంచి రహస్యంగా తెచ్చిన విత్తనాలను నాటించారు. తేయాకు పంట ఆరంభించారు. అది విజయవంతమైంది. ఇంగ్లాండ్కే కాదు యావత్ యూరప్కు సరిపడా భారత్లోనే పండించసాగారు. లండన్లో చైనా తేయాకు వాటా 70% నుంచి 10శాతానికి పడిపోయింది.
ఇంటింటికీ ఉచితంగా..
అంతటితో తెల్లవారి ఆబ ఆగలేదు. ఈ తేనీరును భారీ జనాభాగల భారతీయులకు అలవాటు చేస్తే మరింత లాభాలు గడించవచ్చని భావించారు. వెంటనే... ఉచితంగా టీపొడి ప్యాకెట్లు పంచారు. రైల్వేస్టేషన్లలో, సినిమా హాళ్లలో, ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా ఆ ప్యాకెట్లు ఇచ్చేవారు. కానీ బ్రిటిష్వారు ఎంతగా ప్రయత్నించినా భారతీయుల నుంచి మొదట్లో అంతగా స్పందన రాలేదు. కారణం- టీ-ని భారత కాంగ్రెస్ సీనియర్ నేతలంతా బ్రిటిష్ సామ్రాజ్యవాద వస్తువుగా చూడటమే. ప్రఖ్యాత బెంగాల్ రచయిత శరత్ చంద్ర నవలల్లో (పరిణీత) కూడా చాయ్ను వ్యతిరేకిస్తూ పాత్రలుంటాయి. 1920ల్లో టీని విషంతో సమానంగా పోలుస్తూ ఆచార్య ప్రఫుల్ల రే కార్టూన్లు వేశారు. మహాత్మాగాంధీ సైతం చాయ్ పట్ల విముఖత ప్రదర్శించారు. దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తన పుస్తకంలో ఆరోగ్యం గురించిన అధ్యాయంలో ... టీ అనేది సిగరెట్, మత్తుపదార్థాల్లాంటి పరిహరించాల్సిన పదార్థమేనని రాశారు గాంధీజీ!
పోటాపోటీగా...
ఈ వ్యతిరేకత కారణంగా చాయ్ను భారతీయులకు అంటగట్టడానికి కంపెనీలు, బ్రిటిష్ ప్రభుత్వం నానా అగచాట్లు పడ్డాయి. జాతీయ నాయకుల ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రకటనలు ఇచ్చేవారు. టీ తాగితే శరీరంలో సరికొత్త బలం వస్తుందని, విషానికి విరుగుడనీ... ప్రచారం చేసేవారు. ఎడ్లబండ్లపై పట్టణాల్లోనే కాకుండా ఊర్లలోకీ ఈ ప్రచారాన్ని విస్తరించారు. కొన్నికంపెనీలైతే... ఎడ్లబండ్లపై ప్రచారంతో పాటు... పాలు తీసుకొస్తే ఉచితంగా చాయ్ చేసి ఇచ్చేవి. అలా మెల్లమెల్లగా అలవాటు చేయగా... 1920నాటికి భారత్లో టీ పొడి అమ్మకం 25 లక్షల కిలోలకు చేరింది. 1947కల్లా ఇది రెట్టింపైంది. స్వాతంత్య్రానంతరం ఇక చెప్పనే అక్కర్లేకుండా... టీ పూర్తిగా భారతీయమైపోయింది!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్