AP HighCourt: పోలీసులది అత్యుత్సాహం
రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు శనివారం నిప్పులు చెరిగింది. ‘చట్టబద్ధ పాలన అంటే వారికి గౌరవం లేదు. హైకోర్టు జడ్జిలు, ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఉత్సాహం చూపని పోలీసులు..
హైకోర్టు జడ్జీలను దూషించినా వేగంగా చర్యల్లేవే!
ముఖ్యమంత్రి విషయంలో అంత ఉత్సాహమెందుకు?
గౌరవం, ప్రతిష్ఠ సీఎంకే కాదు.. అందరికీ ఉంటాయి
పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం.. పట్టాభికి బెయిలు మంజూరు, విడుదల
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు శనివారం నిప్పులు చెరిగింది. ‘చట్టబద్ధ పాలన అంటే వారికి గౌరవం లేదు. హైకోర్టు జడ్జిలు, ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఉత్సాహం చూపని పోలీసులు.. ముఖ్యమంత్రిని దూషించారనే కారణంతో తెదేపా నేత పట్టాభి అరెస్టు విషయంలో అంత అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం ఏముంది? గౌరవం, ప్రతిష్ఠ ముఖ్యమంత్రికే కాదు.. ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందరి గౌరవాన్నీ కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. ముఖ్యమంత్రి అయినా సరే! పోలీసుల వ్యవహార శైలిపై అభ్యంతరంతో న్యాయస్థానం ముందుకు రోజూ పలు వ్యాజ్యాలు విచారణకు వస్తున్నాయి. మేమూ గమనిస్తున్నాం. పట్టాభిరామ్ అరెస్టులో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఓ వైపు అరెస్టు చేయడానికి పట్టాభి ఇంటికి వెళ్లామని చెబుతూ.. మరోవైపు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసు ఇచ్చాం, సహకరించలేదు, అందుకే అరెస్టు చేశామంటూ పరస్పర విరుద్ధమైన, పొంతన లేని వివరాలను దర్యాప్తు అధికారి రిమాండు రిపోర్టులో పేర్కొనడం ఆత్మహత్యాసదృశం కాదా? అరెస్టు చేసే ఉద్దేశం ఉంటే 41ఏ నోటీసు ఎందుకిచ్చారు? ఆ నోటీసు ఇచ్చాక మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారు? అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా పోలీసుల తీరు ఉంది’ అని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించారా.. లేదా... అనే అంశంపై పోలీసులు, రిమాండుకు పంపిన విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నివేదికలు దాఖలు చేయాలని ఆదేశించింది. విజయవాడ పోలీసులు అరెస్టు చేసిన తెదేపా నేత పట్టాభిరామ్కు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ.20వేల బాండుతో రెండు పూచీకత్తులు దిగువ కోర్టులో సమర్పించాలని స్పష్టం చేసింది. బెయిలు ఇవ్వొద్దన్న ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలను తోసిపుచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
నిబంధనలను పాటించలేదు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై పరుష పదజాలం ఉపయోగించి గొడవలకు కారకులయ్యారని విజయవాడకు చెందిన వ్యాపారి షేక్ మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెదేపా నేత పట్టాభిరామ్ను పోలీసులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న పట్టాభి.. బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ‘నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్ను అరెస్టుచేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలి. నోటీసు ఇచ్చామని పోలీసులు చెబుతున్నా.. నిబంధనలను పాటించలేదు. 41ఏ నోటీసు పట్టికలో ఖాళీలు ఉండటంపై మేజిస్ట్రేట్ అభ్యంతరం వ్యక్తంచేస్తూ వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు. నోటీసుపై అభ్యంతరం ఉన్నప్పుడు రిమాండ్కు ఇవ్వకుండా ఉండాల్సింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావు. పిటిషనర్కు బెయిలు మంజూరు చేయండి’ అని కోరారు.
ఆ సెక్షన్లు సరైనవే
పోలీసుల తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘నమోదు చేసిన సెక్షన్లు సరైనవే. ముఖ్యమంత్రిపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పిటిషనర్ ప్రెస్మీట్ వీడియోను పరిశీలించండి. బెయిలు ఇవ్వొద్దు. ఇస్తే పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘన అయ్యే అవకాశం ఉంది’ అని కోరారు.
ఎవరికైనా ఒకే విధానం
రిమాండు రిపోర్టులోని వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. 41ఏ నోటీసు విషయంలో దర్యాప్తు అధికారి పరస్పర విరుద్ధమైన వివరాలు పేర్కొనడంపై అభ్యంతరం తెలిపారు. చట్ట నిబంధనల మేరకు పోలీసులు వ్యవహరించలేదన్నారు. ‘దూషణలకు పాల్పడ్డ నిందితులు చేసింది తప్పా, ఒప్పా? అని ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ వారి విషయంలో అనుసరించాల్సిన విధానం ఒకటి ఉంది. దాన్ని పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. సీఎం, హైకోర్టు న్యాయమూర్తులు, ఏజీ తదితరులను దూషించిన వారి పట్ల ఎలా వ్యవహరించాలో చట్టంలో ఒకే విధానం ఉంది’ అన్నారు. ‘ఉదాహరణకు నన్నే ఎవరైనా దుర్భాషలాడితే.. ఆ వ్యక్తులను తీసుకెళ్లి ఎవరికీ తెలియని ప్రాంతంలో ఉంచడం సబబేనా’ అని ప్రశ్నించారు. పిటిషనరు పట్టాభికి బెయిలు మంజూరు చేశారు.
బెయిలుపై పట్టాభి విడుదల
రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్టుడే: తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో... రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న పట్టాభిని తీసుకెళ్లేందుకు ఆయన వ్యక్తిగత సిబ్బంది శనివారం సాయంత్రం జైలుకు వచ్చారు. బెయిలు పత్రాలు సమర్పించడంతో రాత్రి ఏడు గంటల సమయంలో ఆయన్ను విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఎస్.రాజారావు తెలిపారు. విడుదలైన ఆయన తన కారులో బయలుదేరి విజయవాడ వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న