Aryan Khan: బెయిలు కోసం ఎదురుచూపులే
మాదకద్రవ్యాల కేసులో బెయిలు కోసం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
ఆర్యన్ పిటిషన్పై బాంబే హైకోర్టులో నేడు కొనసాగనున్న విచారణ
అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో ఆయనకు సంబంధాలు!: ఎన్సీబీ
ముంబయి: మాదకద్రవ్యాల కేసులో బెయిలు కోసం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఆయన దాఖలు చేసిన బెయిలు పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. బుధవారం కూడా వాదనలు ఆలకించనున్నట్లు తెలిపింది. అంతకుముందు, ఆర్యన్ తరఫున మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఆర్యన్ డ్రగ్స్ వినియోగించినట్లు ఎన్సీబీ వద్ద సాక్ష్యాధారాలేవీ లేవని పేర్కొన్నారు. ఆయన నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోలేదనీ చెప్పారు. ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచారని వాదించారు. ఆర్యన్ 2018, 2019, 2020ల్లో వాట్సప్ వేదికగా చేసిన చాట్లను ఈ కేసుతో ముడిపెట్టి చూడటం సరికాదన్నారు. మరోవైపు- ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే, కొంతమంది రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆర్యన్కు సంబంధం లేదని తేల్చిచెప్తూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో అదనపు పత్రాన్ని సమర్పించారు. వాంఖడే సహా ఎన్సీబీ అధికారులెవరిపైనా షారుక్ కుమారుడికి ఫిర్యాదుల్లేవని అందులో పేర్కొన్నారు. వాంఖడే, ఇతరులపై ముడుపుల ఆరోపణలు చేసిన ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్ సాయీల్తోనూ ఆర్యన్కు సంబంధాల్లేవని స్పష్టం చేశారు.
డ్రగ్స్ వినియోగదారుడే కాదు.. రవాణాదారు కూడా..
ఆర్యన్ బెయిలు దరఖాస్తును ఎన్సీబీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన డ్రగ్స్ వినియోగదారుడు మాత్రమే కాదని, వాటి అక్రమ రవాణాలోనూ ప్రమేయమున్నవాడని హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు మంగళవారం ప్రమాణ పత్రం సమర్పించింది. షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ, ఆర్యన్.. సాక్షులను ప్రభావితం చేస్తూ కేసు దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అందులో ఆరోపించింది. ఎన్సీబీ అధికారులపై ముడుపుల ఆరోపణలు చేసిన ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్ సాయీల్ వ్యవహారాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. ఆర్యన్కు అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. నౌకలో ఆర్యన్ వద్ద మాదకద్రవ్యాలు దొరకనంత మాత్రాన ఆయన్ను వదిలేయలేమని పేర్కొంది. ముంబయి నౌక డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఈ నెల 3న అరెస్టయ్యారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాల బెయిలు పిటిషన్లపై కూడా బాంబే హైకోర్టు బుధవారం వాదనలు విననుంది.
ఇద్దరు నిందితులకు బెయిలు
ముంబయి నౌక డ్రగ్స్ కేసులో మనీష్ రాజ్గరియా, అవిన్ సాహు అనే ఇద్దరు నిందితులకు మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల (ఎన్డీపీఎస్) చట్టం ప్రత్యేక కోర్టు తాజాగా బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో మొత్తం 20 మంది అరెస్టవగా.. ఇప్పటివరకు బెయిలు దొరికింది వీరిద్దరికే కావడం గమనార్హం.
కిక్కిరిసిన కోర్టు గది.. కాసేపు బయటకు వెళ్లిన న్యాయమూర్తి
ఆర్యన్ బెయిలు పిటిషన్పై విచారణ సందర్భంగా మంగళవారం కోర్టు గది న్యాయవాదులు, పాత్రికేయులతో కిక్కిరిసిపోయింది. కొవిడ్ నియంత్రణ మార్గదర్శకాలను ఎవరూ ఖాతరు చేయలేదు! దీంతో.. అక్కడ వెంటనే విచారణ జరగనున్న కేసులకు సంబంధించిన న్యాయవాదులు మినహా మిగతావారిని బయటకు పంపించాలని న్యాయమూర్తి జస్టిస్ ఎన్.డబ్ల్యూ.సాంబ్రె తన సిబ్బందికి సూచించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. ఆ వెంటనే న్యాయమూర్తి వేదికను వీడి కొద్దిసేపు కారిడార్లోకి వెళ్లారు. పలువురు న్యాయవాదులు, పాత్రికేయులు కోర్టు గది నుంచి వెళ్లిపోయాక తిరిగి వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం పాత్రికేయులను పోలీసులు/సిబ్బంది మళ్లీ గదిలోకి అనుమతించారు. లోపల ఉన్నవారు మాట్లాడటం వల్ల ముకుల్ రోహత్గీ వాదనలకు పదేపదే అంతరాయం ఏర్పడింది. ఒక దశలో కోర్టు గదిలో తోపులాట చోటుచేసుకొని, తలుపు విరగడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
వైకాపా ఎన్నికల ప్రచారం చేసిన ఆర్టీసీ వైఎస్ఆర్ యూనియన్ నేత!
ఆర్టీసీలోని వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం నేత ఒకరు తన పుట్టినరోజు వేడుక పేరిట కార్యక్రమం నిర్వహించి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. -
సంక్షిప్త వార్తలు
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె