Viveka Murder Case: వివేకా హత్యలో ఉమాశంకర్రెడ్డి పాత్ర
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. నిందితుడు గజ్జల ఉమాశంకర్రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలున్నాయని సీబీఐ పేర్కొంది.....
హత్య తర్వాత ఆయన రోడ్డుపై పరిగెత్తారు
సంఘటన నాటి రాత్రి.. ఉమా, సునీల్, దస్తగిరి గోడ దూకి పారిపోయారు
కాపలాదారు రంగన్న వాంగ్మూలం
కోర్టులో సీబీఐ వెల్లడి
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. నిందితుడు గజ్జల ఉమాశంకర్రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలున్నాయని సీబీఐ పేర్కొంది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో.. ఆయన రహదారిపై పరుగు తీస్తున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని దుకాణం వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని వెల్లడించింది. వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వర్రెడ్డి సోదరుడు, ఈ కేసులో నిందితుడిగా జైల్లో ఉన్న గజ్జల ఉమాశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ శనివారం కడపలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా దాఖలు చేసిన కౌంటర్లో సీబీఐ సంచలన విషయాలను వెల్లడించింది. వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డి, షేక్ దస్తగిరి పాత్ర ఉందని పులివెందుల కోర్టులో అక్టోబరు 27న సీబీఐ ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసింది. ఇవన్నీ పరిశీలించిన కోర్టు కేసులో వాస్తవాలను తేల్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తున్నందున, ప్రస్తుత దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంటూ పిటిషన్ను కొట్టివేసింది.
ధ్రువీకరించిన ఎఫ్ఎస్ఎల్
విచారణలో భాగంగా సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్పించారు. వివేకా హత్యకు కుట్రలో ఉమాశంకర్రెడ్డి పాత్ర కీలకమని, ఆయన నార్కో అనాలసిస్ పరీక్షకు కూడా అంగీకరించలేదని పేర్కొన్నారు. ‘తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఉమాశంకర్రెడ్డి రహదారిపై పరుగు తీస్తున్న దృశ్యాలు వివేకా ఇంటి సమీపంలోని బ్రిడ్జ్ స్టోన్ దుకాణం వద్ద సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆయన పరుగు తీరును స్వతంత్ర సాక్షులు, వ్యక్తుల సమక్షంలో వీడియో రికార్డు చేశాం. దీన్ని, సీసీటీవీ రికార్డును గుజరాత్ గాంధీనగర్లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్, బెంగళూరులోని ఫిల్మ్ ఫ్యాక్టర్కు పంపాం. రెండు పరుగుల్లోనూ సారూప్యత ఉందని అవి అభిప్రాయపడ్డాయి’ అని సీబీఐ పేర్కొంది.
వ్యూహాత్మకంగా వ్యవహరించారు
వివేకానందరెడ్డి హత్య విషయంలో తమ కదలికలు బయటపడకుండా నిందితులు వ్యూహాత్మకంగా వ్యవహరించారని సీబీఐ వెల్లడించింది. ‘హత్యకు పది రోజుల ముందు వివేకా ఇంట్లోని కుక్కను.. సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి కారుతో ఢీకొట్టి చంపారు. నిందితుల్ని గుర్తించే ప్రక్రియలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్రెడ్డిలను కాపలాదారు రంగన్న గుర్తించారు. హత్య జరిగిన రోజు రాత్రి సంఘటనాస్థలి నుంచి వారు వెళ్లడం చూశానని ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సునీల్, ఉమాశంకర్, దస్తగిరిలు గోడదూకి పారిపోయారని, ఎర్రగంగిరెడ్డి బయటకు వెళ్తూ.. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని తనను బెదిరించారని రంగన్న చెప్పారు. 2019 మార్చి 15న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో వారంతా సమావేశమయ్యారు. పోలీసుల సంగతి తాను చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్లు రంగన్న వాంగ్మూలంలో పేర్కొన్నారు’ అని సీబీఐ తెలియజేసింది. నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించారని, సీబీఐ ప్రాథమిక అభియోగపత్రాన్ని దాఖలు చేసిందని, విచారణ కూడా పూర్తయిందని ఉమాశంకర్రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. దర్యాప్తునకు తన క్లయింట్ సహకరిస్తారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసినప్పటికీ.. హత్య వెనక కుట్ర, ఉద్దేశాలేమిటో తేల్చేందుకు తదుపరి విచారణ చేయాల్సి ఉందని సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. సునీల్తో కలిసి దాడి చేసిన నేపథ్యంలో ఉమాశంకర్రెడ్డి బెయిల్కు అనర్హుడని, ఆయన పిటిషన్ కొట్టేయాలని అభ్యర్థించారు.
ఈ దశలో బెయిల్ ఇవ్వలేం
కుట్రదారులెవరో తేల్చేందుకు తదుపరి విచారణ చేయాల్సి ఉందని సీబీఐ ప్రాథమిక అభియోగపత్రంలో పేర్కొందని ప్రత్యేక సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస శివరామ్ ఉత్తర్వుల్లో తెలిపారు. వివేకాను గొడ్డలితో నరికి చంపినవారిలో ప్రధాన కుట్రదారుడైన గంగిరెడ్డితో పాటు డ్రైవర్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి ఉన్నారని కాపలాదారు రంగన్న తన వాంగ్మూలంలో పేర్కొన్నారని గుర్తుచేశారు. కుట్రకోణం తేల్చడానికి తదుపరి విచారణ కొనసాగించాల్సి ఉన్నందున, ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా