Covid: కొవిడ్ సాయానికి కొర్రీలెన్నో!
కొవిడ్ మృతుల కుటుంబాలు రూ.50వేల ఆర్థికసాయం పొందడానికి విధించిన షరతులతో వ్యయప్రయాసలు తప్పడం లేదు. బాధితులు ఇచ్చే దరఖాస్తుపై స్థానిక ఆశా, ఏఎన్ఎం, ప్రాథమిక....
దరఖాస్తుపై సంతకాల కోసం తిప్పలు
వ్యాధి నిర్ధారణ కానివారి విషయంలో ఇబ్బంది
అధికారిక మృతుల కంటే దరఖాస్తులు ఎక్కువ
కొన్ని జిల్లాల్లో ఒక్కోచోటే స్వీకరణ
ఈనాడు, అమరావతి: కొవిడ్ మృతుల కుటుంబాలు రూ.50వేల ఆర్థికసాయం పొందడానికి విధించిన షరతులతో వ్యయప్రయాసలు తప్పడం లేదు. బాధితులు ఇచ్చే దరఖాస్తుపై స్థానిక ఆశా, ఏఎన్ఎం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యుడి సంతకాలు తప్పనిసరి చేయడం ఇబ్బందికరంగా మారింది. కొవిడ్ మరణాలు అత్యధికంగా ప్రభుత్వాసుపత్రుల్లోనే నమోదయ్యాయి. ప్రభుత్వ అనుమతి పొందిన ఆసుపత్రుల్లో మరణించినా, ఆ వివరాలూ రికార్డుల్లో ఉంటాయి. అయినా దరఖాస్తుల్లో సంతకాలు తప్పనిసరి చేయడం బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలిగిస్తోంది. వైద్యాధికారి సంతకం పెడితేనే కింది స్థాయి సిబ్బంది స్పందిస్తున్నారు. ఇది ఇంకా సమస్యాత్మకం అవుతోంది. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పూర్తి కాకముందే ఆసుపత్రుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు నష్ట పరిహారంపై స్పష్టత లేదు.
వేలల్లో దరఖాస్తులు
వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచి 30 రోజుల్లో సంభవించిన మరణాన్ని కొవిడ్-19 మృతిగా నిర్ధారిస్తున్నారు. రాష్ట్రంలో గురువారం వరకు అధికారికంగా 14,409 మంది కొవిడ్తో మరణించారు. 30 రోజుల నిబంధనతో దరఖాస్తులు వేలల్లో రానున్నాయి. గుంటూరు జిల్లాలో గురువారం వరకు 1,246 మంది కొవిడ్తో మరణించినట్లు ప్రభుత్వ బులెటిన్ చెబుతోంది. మరోవైపు జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఒకే కేంద్రంలో ఇప్పటివరకు 2,900 దరఖాస్తులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో అధికారిక మరణాలు 854 కాగా.. వెయ్యి వరకు దరఖాస్తులు వచ్చాయి.
విజయవాడలోని కొవిడ్ కమాండ్ కంట్రోల్రూంలో కొవిడ్ మృతుల కుటుంబాలకు అందించే పరిహారం కోసం దరఖాస్తులిచ్చేందుకు బారులు తీరిన బాధితులు (ఇటీవలి చిత్రం)
గడువు లేదు
దరఖాస్తుల సమర్పణకు గడువు తేదీ గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన పెరుగుతోంది. దరఖాస్తుల స్వీకరణకు నిర్దేశిత గడువు ఏమీలేదని విజయవాడ సబ్కలెక్టర్ ప్రవీణ్చంద్ తెలిపారు.
ఇలా చేస్తే..
* దరఖాస్తులు ఎక్కడ ఇస్తారో, వాటిని తిరిగి ఎక్కడ ఇవ్వాలో తెలియక కొందరు అయోమయంలో ఉన్నారు. విజయవాడలోనే జీజీహెచ్ నుంచి కలెక్టరేట్ వరకు తిరుగుతున్నారు.
* బాధిత కుటుంబాలవారు ఎమ్మార్వో/ గ్రామ, వార్డు సచివాలయాలు జారీచేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా, ఆధార్, డెత్ సర్టిఫికెట్, ఇతర ఆధారాలను దరఖాస్తుకు జతచేయాలి. దరఖాస్తులో ఆశా, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్ సంతకాలే మరీ ఇబ్బంది అవుతున్నాయి.
* ఆర్టీపీసీఆర్/ మాలిక్యులర్ టెస్ట్/ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్/ క్లినికల్ (సీటీ స్కాన్, ఇతర) పరీక్షల్లో కొవిడ్ సోకినట్లు చూపాలి. 30 రోజుల నిబంధన ప్రకారం.. ఆసుపత్రుల్లో చికిత్స పొంది డిశ్ఛార్జి అయి ఇంటికెళ్లాక మరణించినా అది కొవిడ్తోనే జరిగినట్లు గుర్తిస్తున్నారు.
* బాధిత కుటుంబాల వద్ద పాజిటివ్ వచ్చినట్లు సెల్ఫోన్లకు వచ్చిన ఎస్ఎంఎస్ మాత్రమే ఉంది. ఇలాంటి దరఖాస్తులు వస్తే ఐసీఎంఆర్, వెబ్సైట్ నుంచి సిబ్బందే అవసరమైన పత్రాలను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలి.
* కొవిడ్ సోకిన వారిలో కొందరు ఇళ్ల (హోం ఐసొలేషన్) వద్దే ఉంటూ 30 రోజుల్లోగా చనిపోయారు. ఇలాంటివారి విషయం తమకు తెలియదని వైద్యులు అంటున్నట్లు తెలుస్తోంది.
* పరీక్షలు చేయించకుండానే కొవిడ్ లక్షణాలతో చనిపోతే వీఆర్వో నుంచి నిర్ధారణ పత్రాన్ని తేవాలని నెల్లూరు అధికారులు చెబుతున్నారు.
కొవిడ్ నిర్ధారణ కాకున్నా...
వ్యాధి నిర్ధారణ కాకుండా కొవిడ్ వార్డులో మరణిస్తే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నామని కృష్ణా జిల్లా జేసీ శివశంకర్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలు పెంచుతున్నామన్నారు. అర్హతలు, దరఖాస్తుల వివరాలపై ప్రచారం చేస్తున్నామని వివరించారు.
సమస్యలివీ..
* ఒంగోలు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కర్నూలులోనే ఆయా జిల్లాలకు దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో దూరప్రాంతాల వారు వచ్చేందుకు అవస్థలు పడుతున్నారు. విశాఖ, చిత్తూరు, కడప జిల్లాల్లో మాత్రం మండలాల స్థాయిలోనూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
* కృష్ణా జిల్లాకు మచిలీపట్నం, విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయాలలోనే తొలుత దరఖాస్తులు స్వీకరించారు. తర్వాత గుడివాడ, నూజివీడులోనూ ఏర్పాట్లుచేశారు. విజయవాడ సబ్-కలెక్టరేట్లోనే ఇప్పటివరకు 700 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో అధికారిక మరణాలు 1,441.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు