Padayatra: పాదయాత్రపై లాఠీ
ప్రశాంతంగా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర.. గురువారం పోలీసు నిర్బంధాలతో రణరంగంగా మారింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై లాఠీలు ఝుళిపించడం, జనం ఎదురుతిరగడంతో ఉద్రిక్తంగా.....
అడుగడుగునా ఆంక్షలు.. రహదారుల దిగ్బంధం
రోప్పార్టీలతో అడ్డుకోవడంతో ఎదురుతిరిగిన ప్రజలు
పోలీసుల లాఠీఛార్జితో రణరంగం
పలువురికి గాయాలు.. చేయి విరిగిన వ్యక్తి
ఉవ్వెత్తున తరలివచ్చి పాదయాత్రకు జనం మద్దతు
ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద రైతులపై లాఠీఛార్జి చేస్తున్న పోలీసులు
ఈనాడు డిజిటల్, ఒంగోలు: ప్రశాంతంగా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర.. గురువారం పోలీసు నిర్బంధాలతో రణరంగంగా మారింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై లాఠీలు ఝుళిపించడం, జనం ఎదురుతిరగడంతో ఉద్రిక్తంగా మారింది. ఇన్ని కఠిన ఆంక్షలు, నిర్బంధాల్నీ తోసిరాజని పరిసర గ్రామాల నుంచి వేల మంది తరలివచ్చి యాత్రకు సంఘీభావం తెలిపారు. అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు నుంచి గురువారం ఉదయం యాత్ర మొదలయ్యేసరికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో బలగాల్ని మోహరించిన పోలీసులు.. అక్కడికి వచ్చే మార్గాలన్నీ దిగ్బంధించారు. చెక్పోస్టులు పెట్టి వాహనాల్ని మళ్లించారు. కనిపించిన ప్రతిఒక్కరినీ ఎక్కడికి వెళుతున్నారో అడిగి, పాదయాత్రకు కాదని నమ్మకం కుదిరితేనే పంపించారు. వందల మంది పోలీసులు లాఠీలు పట్టుకుని, పాదయాత్ర ముందు సాగుతూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. వాహనాలపై తిరుగుతూ ప్రజల్ని అడ్డుకున్నారు. పాదయాత్రకు వెళ్లేందుకు వీల్లేదని, ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. హెచ్చరికల్ని కాదని ముందుకు వచ్చినవారిని తోసిపారేశారు. వందల మంది పోలీసులు రోప్పార్టీలతో ఎక్కడికక్కడ దిగ్బంధించినా ప్రజలు ఎదురుతిరిగి రైతుల దగ్గరకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝళిపించారు. లాఠీఛార్జిలో పలువురు గాయపడ్డారు. ఒకరి చెయ్యి విరిగింది. నిబంధనలకు లోబడి శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రకు కొవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ పేరుతో కావాలనే ఆంక్షలు సృష్టిస్తున్నారని రైతులు, ఐకాస నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాగులుప్పలపాడు అష్టదిగ్బంధం
పాదయాత్ర చేస్తున్న రైతులు బుధవారం రాత్రి నాగులుప్పలపాడులో ఒక శీతలగిడ్డంగి ఆవరణలో బస చేశారు. అర్ధరాత్రి నుంచి వర్షం కురవడంతో రైతులు నిద్రిస్తున్న టెంట్లలోకి నీళ్లు చేరి వారికి కంటిమీద కునుకు కరవైంది. ఓవైపు ఆగకుండా వర్షం పడుతున్నా రెయిన్కోట్లు ధరించి, గొడుగులు పట్టుకుని ఉదయం 9.30కి రైతులు పాదయాత్ర ప్రారంభించారు. ఉదయం నుంచే నాగులుప్పలపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో పోలీసులు మోహరించార. నాగులుప్పలపాడు, కేశినేనివారిపాలెం, చదలవాడ, చీర్వానుప్పలపాడు కూడళ్లకు చేరుకున్న ప్రజల్ని వెనక్కు వెళ్లిపొమ్మని హెచ్చరించారు. చదలవాడ వద్ద తమతో వాగ్వాదానికి దిగిన ప్రజలు, రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. మహిళలు, రైతులు పరుగులు తీశారు. కొందరు కిందపడిపోయారు. లాఠీఛార్జిలో చీర్వానుప్పలపాడుకు చెందిన ఆళ్ల నాగార్జునకు చెయ్యి విరిగింది. ఆయన నొప్పి భరించలేక విలవిల్లాడుతూ కూలబడ్డారు. అదే గ్రామానికి చెందిన చుండూరు మూర్తికి మోకాలికి గాయమైంది. మరికొందరికీ దెబ్బలు తగిలాయి. పోలీసుల దాష్టీకంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. పోలీసులు అడ్డుగా పట్టుకున్న తాడును తోసుకుని, లాఠీలను తీసుకుని విసిరేసి, ఒక్కసారిగా పరుగులు తీశారు. పాదయాత్రకు ఎదురేగి, రైతులతో కలసి జై అమరావతి అంటూ నినదించారు. లాఠీఛార్జి విషయం తెలుసుకుని సమీప గ్రామాల ప్రజలూ ఉవ్వెత్తున తరలిరావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత యాత్ర ప్రశాంతంగా జరిగింది. పోలీసులు ఎంతగా రెచ్చగొట్టినా, కొట్టినా పాదయాత్రికులు, ప్రజలు సంయమనం పాటించాలని రైతు, అమరావతి ఐకాసల ప్రతినిధులు మైకులో పదేపదే చెప్పారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు వద్ద వర్షం కురుస్తుండగా రెయిన్ కోట్లు ధరించి పాదయాత్ర చేస్తున్న మహిళా రైతులు
మద్దిరాలపాడులో ఉద్రిక్తత
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న కారణం చూపించి, పోలీసులు తెదేపా ఎమ్మెల్యేల్ని, ముఖ్య నాయకులను పాదయాత్రలో పాల్గొనకుండా బుధవారం అర్ధరాత్రి నుంచే గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్లను గృహ నిర్బంధం చేశారు. మహా పాదయాత్రకు ప్రజల స్పందన చూశాకైనా వైకాపా ప్రభుత్వం అమరావతిపై కళ్లు తెరవాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి పేరుతో పోలీసులు తెదేపా నేతలు, కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమన్నారు. గురువారం మధ్యాహ్నానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్తోపాటు, రవికుమార్, విజయకుమార్లు రైతులకు సంఘీభావం చెప్పడానికి మద్దిరాలపాడు చేరుకున్నారు. పోలీసులు వారిని చుట్టుముట్టడంతో ఇరువర్గాలకు వాగ్వాదం జరిగింది.
చదలవాడ వద్ద పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ముందుకు వెళ్తున్న ప్రజలు, రైతులు
కొడతారా.. కొట్టండి చూద్దాం
పాదయాత్రకు వెళ్లకుండా తమను అడ్డుకుంటున్న పోలీసులపై పలుచోట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొడతారా! కొట్టండి చూద్దాం. మేమేమీ రాజకీయ విమర్శలు చేయడం లేదు. మద్యం, బిర్యానీ పొట్లాలు తీసుకుని రాలేదు. జై అమరావతి అన్న నినాదంతో దేవుడి దర్శనానికి వెళుతున్న రైతుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది భవిష్యత్తు తరాలకు స్ఫూర్తియాత్ర. దీన్ని అడ్డుకోకండి’ అని ధ్వజమెత్తారు.
దారి పొడవునా పాదయాత్రను అనుసరించిన పోలీసు బలగాలు
పాదయాత్రను హైకోర్టు చూస్తోంది
పాదయాత్రలో గురువారం హైకోర్టు న్యాయవాదులు పాల్గొని సంఘీభావం తెలిపారు. హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడుతూ పాదయాత్ర రైతులకు సంబంధించినదని, స్థానిక ఎన్నికల కోడ్ ఈ యాత్రకు వర్తించదన్నారు. యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక ఏదో ఒక కారణంతో ఆపాలని చూస్తున్నారని పేర్కొన్నారు. లాఠీఛార్జీతో యువకుడి చేయి విరిగేలా కొట్టిన పోలీసులపై కేసు నమోదవుతుందని, మహాపాదయాత్రను హైకోర్టు గమనిస్తోందని చెప్పారు. బార్కౌన్సిల్, బార్ అసోసియేషన్ మహాపాదయాత్రలో పాల్గొంటుందని.. అవసరమైతే హైకోర్టు నుంచి ఒక న్యాయవాదిని పెట్టి పాదయాత్రను నడిపిస్తామని చెప్పారు.
చదలవాడ గ్రామం వద్ద పోలీసులు, రైతులకు మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలో కింద పడిపోయిన రైతు
కక్షగట్టి చేయి విరగ్గొట్టారు
ఆళ్ల నాగార్జున, చీర్వానుప్పలపాడు
పోలీసుల లాఠీఛార్జిలో చేయి విరిగిన చీర్వానుప్పలపాడుకు చెందిన ఆళ్ల నాగార్జున
నాగులుప్పలపాడులో బస చేసిన అమరావతి రైతులకు మా గ్రామస్తులు చందాలు వేసుకుని బుధవారం రాత్రి భోజనాలు ఏర్పాటు చేశాం. దాంతో పోలీసులు మాపై కక్షగట్టారు. పాదయాత్రలో పాల్గొనేందుకు గురువారం చీర్వానుప్పలపాడు నుంచి బయలుదేరాం. చదలవాడ వద్ద పోలీసులు ఆపేశారు. యాత్రలో పాల్గొని తీరతామనడంతో విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారు. దీంతో నా చేయి విరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..