
Chandrababu: పన్నులు, ధరలపై సామాన్యునికి అండగా పోరాటం
ప్రతిపక్షనేత చంద్రబాబు స్పష్టీకరణ
తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ర్యాలీ
‘ప్రజాకంటక ప్రభుత్వం నశించాలి’ అనే బ్యానర్ పట్టుకుని అసెంబ్లీ వరకు నడచి వెళుతున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పన్నులు, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీలను తగ్గించేవరకు సామాన్యునికి అండగా పోరాటం చేస్తామని ప్రతిపక్షనేత, తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేేశాల సందర్భంగా ఆయన గురువారం తొలుత వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెలగపూడి అసెంబ్లీ సమీపంలోని మారుతి షోరూం చేరుకుని అక్కడి నుంచి తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ‘ప్రజాకంటక ప్రభుత్వం నశించాలి’ అని రాసున్న ఫ్లెక్సీతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, చినరాజప్ప, అనగాని సత్యప్రసాద్, ఆదిరెడ్డి భవాని, ఎమ్మెల్సీలు దీపక్రెడ్డి, చిక్కాల రామచంద్రరావు, బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ‘పెట్రోలు, డీజిల్ ధరలు, విద్యుత్తు ఛార్జీల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉపాధి అవకాశాలూ తగ్గిపోవడంతో సామాన్యులు చితికిపోతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. పెంచిన పన్నులు, ధరలను తగ్గించేవరకు పోరాటం చేస్తాం’ అని స్పష్టంచేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
-
Crime News
Crime News: షాకింగ్! ఆసుపత్రిలో శిశువును ఎత్తుకెళ్లిన శునకాలు.. ఆపై విషాదం!
-
India News
Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
-
General News
Health: పాడైన చిగుళ్లను బాగు చేసుకోవచ్చు..ఎలానో తెలుసా..?
-
World News
Joe Biden: బైడెన్ సతీమణి, కుమార్తెపై రష్యా నిషేధాజ్ఞలు..!
-
India News
Udaipur: పట్టపగలే టైలర్ దారుణ హత్య.. ఉదయ్పూర్లో టెన్షన్.. టెన్షన్..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్ను కలిసిన ఫడణవీస్
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Ire vs Ind: ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం.. సిరీస్ కైవసం
- డీఏ బకాయిలు హుష్కాకి!
- గెలిచారు.. అతి కష్టంగా
- Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం