AP Elections: పరిషత్ పోరులో.. అధికార పార్టీ ఆధిక్యం
రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా మెజార్టీ స్థానాల్ని గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా చాలాచోట్ల గట్టి పోటీనిచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు
11 జడ్పీటీసీ స్థానాల్లో 8 వైకాపా.. 3 తెదేపా కైవసం
పలుచోట్ల విపక్షం గట్టిపోటీ
హిరమండలంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమారుడి ఓటమి
రాజధాని పరిధిలోని 2 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా గెలుపు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా మెజార్టీ స్థానాల్ని గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా చాలాచోట్ల గట్టి పోటీనిచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని మూడు స్థానాల్ని గెలుచుకుంది. మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. వైకాపా 8, తెదేపా 3 చోట్ల గెలిచాయి. 129 ఎంపీటీసీ స్థానాల్లో వైకాపా 85, తెదేపా 33 చొప్పున గెలుపొందాయి. జనసేన ఐదు, సీపీఎం రెండు, సీపీఐ, భాజపా ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు.
ఎమ్మెల్యేలకు చుక్కెదురు
* వైకాపా ఎమ్మెల్యే రెడ్డిశాంతి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని హిరమండలం జడ్పీటీసీ స్థానంలో ఆమె కుమారుడు శ్రవణ్.. తెదేపా అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు చేతిలో 59 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చెల్లని ఓట్లుగా పక్కనపెట్టిన 332 బ్యాలెట్ పత్రాల్ని మళ్లీ పరిశీలించి, లెక్కించాలని వైకాపా పట్టుబట్టింది. అయినా ఫలితం మారలేదు. బుచ్చిబాబు వంశధార ప్రాజెక్టు నిర్వాసితుడు.
* కృష్ణా జిల్లా పెడనలో వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్కు ఎదురుదెబ్బ తగిలింది. పెడన జడ్పీటీసీ స్థానంలో 658 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి అర్జా వెంకటనగేశ్ గెలుపొందారు. నగేశ్ విజయ డెయిరీలో డైరెక్టర్గా ఉన్నారు.
* గుంటూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం జడ్పీటీసీ స్థానాన్ని తెదేపా గెలుచుకుంది. అక్కడ తెదేపా అభ్యర్థి పారా హైమావతి 1,046 ఓట్ల ఆధిక్యం సాధించారు. బ్రహ్మనాయుడు, హైమావతి ఇద్దరూ వేల్పూరు గ్రామస్థులే. వైకాపా నాయకులు శావల్యాపురం ఎంపీపీ, కారుమంచి పీఏసీఎస్ అధ్యక్షుడిదీ అదే గ్రామం. తెదేపా అభ్యర్థిగా అప్పట్లో హైమావతి భర్త హైమారావు నామినేషన్ వేశారు. ఉపసంహరణకు ముందే ఆయన చనిపోవడంతో ఎన్నిక రద్దైంది. ఇప్పుడు హైమావతి పోటీచేసి ఘనవిజయం సాధించారు.
* రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో మూడు జడ్పీటీసీలకు ఎన్నికలు జరగ్గా.. రెండుచోట్ల వైకాపా, ఒకచోట తెదేపా గెలిచాయి.
ఎంపీటీసీ ఎన్నికల్లోనూ గట్టిపోటీ
* ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో వైకాపా, తెదేపా అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో ప్రతిపక్షం గట్టి పోటీనిచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలకు ఐదు, తూర్పుగోదావరి జిల్లాలో 21కి 6, అనంతపురం జిల్లాలో 16కు 6చోట్ల తెదేపా అభ్యర్థులు గెలిచారు.
* తూర్పుగోదావరి జిల్లాలో సీపీఎం రెండు, సీపీఐ ఒక ఎంపీటీసీ స్థానాల్ని గెలుచుకున్నాయి. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండి, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో కలసిన ఎటపాక మండలంలోని విస్సుపురంలో సీపీఎం, కృష్ణవరంలో సీపీఐ గెలుపొందాయి. వి.ఆర్.పురం మండలంలోని చిన్నమట్టపల్లెలో సీపీఎం గెలిచింది.
* విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని ఎ.వెంకంపేటలో భాజపా విజయం సాధించింది.
* గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఉన్న ఫిరంగిపురం మండలంలోని గుండాలపాడు, వేమవరం ఎంపీటీసీలను తెదేపా కైవసం చేసుకుంది. రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతం నుంచి వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తగ్గిన ఓట్లు.. ఏమైనట్లు?
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురం ఎంపీటీసీ స్థానానికి పోలైన ఓట్ల కంటే.. బ్యాలెట్ పెట్టెల్లో తక్కువ ఓట్లు ఉన్నాయి. పోలింగ్ నాడు 2,251 ఓట్లు నమోదుకాగా, లెక్కింపులో ఆరు ఓట్లు తక్కువగా వచ్చాయి. ఓటర్లు బ్యాలెట్ పేపర్ను బాక్సులో వేయకుండా వెళ్లిపోవడం వల్లే తేడా వచ్చిందని ఎంపీడీవో శివశంకరప్ప తెలిపారు. అక్కడ తెదేపా అభ్యర్థి కె.పద్మావతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
లెక్కింపులో వివాదాలు
* నెల్లూరు జిల్లా కోట మండలం కోట-2 ఎంపీటీసీ స్థానంలో తెదేపా, వైకాపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. అధికారులు మరోసారి లెక్కించి, వైకాపాకు మూడు ఓట్ల ఆధిక్యం వచ్చినట్టు ప్రకటించారు.
* విశాఖ జిల్లా కె.కోటపాడు మండలంలోని దాలివలస ఎంపీటీసీగా వైకాపా అభ్యర్థి కొట్నాన అశోక్ 26 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. లెక్కింపులో తేడా జరిగిందంటూ తెదేపా నేతలు రీకౌంటింగ్ కోరారు. ఆర్వో తిరస్కరించడంతో.. గంటపాటు రాస్తారోకో చేశారు.
* చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వసంతాపురం ఎంపీటీసీ స్థానంలో తెదేపా అభ్యర్థి విజయలక్ష్మి 16 ఓట్ల ఆధిక్యం సాధించారు. వైకాపా నాయకులు రీకౌంటింగ్కు పట్టుబట్టగా.. ఆర్వో అంగీకరించలేదు. జడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాలతో మళ్లీ ఓట్లు లెక్కించారు. తెదేపా అభ్యర్థి 15 ఓట్ల మెజార్టీ తేలింది.
* ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ ఎంపీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి పమిడిముక్కల శివకృష్ణకు 126 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైకాపా అభ్యర్థి డిమాండ్ మేరకు రెండోసారి లెక్కించినా.. అదే ఫలితం వచ్చింది.
* పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం సత్యవోలు ఎంపీటీసీగా తెదేపా నుంచి నాగరాజు 26 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. వైకాపా నాయకుల డిమాండ్తో రీకౌంటింగ్ చేయగా.. నాగరాజు మెజార్టీ 27కు పెరిగింది.
ఎన్నికల కోడ్ ఎత్తివేత
పురపాలక, పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ను గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.
పరిషత్ ఎన్నికల ఫలితాలు
ఈనాడు, అమరావతి
ఎన్నిక జరిగిన జడ్పీటీసీ స్థానాలు: 11
వైకాపా గెలిచినవి: 8, ఆనందపురం(విశాఖపట్నం), పెనుగొండ(పశ్చిమగోదావరి), జి.కొండూరు, విస్సన్నపేట(కృష్ణా), బంగారుపాళ్యెం(చిత్తూరు), జమ్మలమడుగు(కడప), నంద్యాల(కర్నూలు), చిలమత్తూరు(అనంతపురం),
తెదేపా గెలిచినవి: 3, శావల్యపురం(గుంటూరు), హిరమండలం(శ్రీకాకుళం), పెడన(కృష్ణా)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం
-
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?