Flood: వరదపోటు
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీవర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెన్నై-కోల్కతా జాతీయ రహదారి సహా పలు మార్గాల్లో రాకపోకలకు తీవ్రంగా
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వాగులు ఉప్పొంగి స్తంభించిన రాకపోకలు
కండలేరు ఉద్ధృతికి హైవే జలదిగ్బంధం
ఈనాడు డిజిటల్-ఒంగోలు, నెల్లూరు, గూడూరు- న్యూస్టుడే: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీవర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెన్నై-కోల్కతా జాతీయ రహదారి సహా పలు మార్గాల్లో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. నెల్లూరు జిల్లా నుంచి సోమశిల జలాశయం ద్వారా లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు జలాశయానికి 37 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ రిజర్వాయర్ను 16 అడుగుల వరకు నింపి.. 5 గేట్ల ద్వారా 48 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న మన్నేరుకు వదిలారు. ఈ నీటితో కందుకూరు- గుడ్లూరు మధ్య మాచవరం సమీపంలో రాకపోకలు నిలిచాయి. పామూరు మండలంలో రెండు రోజుల వ్యవధిలో 177 మిల్లీమీటర్లు, సీఎస్పురంలో 109, వెలిగండ్లలో 102 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. పామూరు పాతచెరువు అలుగు పొంగి.. కట్ట కొంతమేర కోసుకుపోయింది. జేసీ వెంకటమురళి ఆధ్వర్యంలో నీటిపారుదలశాఖ అధికారులు ఇసుక, కంకర బస్తాలు వేసి కట్ట మరమ్మతులు చేపట్టారు. గోపాలపురం ఎస్సీకాలనీ వద్ద 565 జాతీయ రహదారికి ఇరువైపులా నీరు నిలిచి ఇళ్లలోకి చేరింది. రహదారి మధ్యలో పొక్లైయిన్తో తవ్వి పైపులు వేసి బయటకు తోడిపోస్తున్నారు. పామూరు నుంచి కనిగిరి, కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు పొంచి ఉన్న ఇనిమెర్ల, నుచ్చుపొద గ్రామాల ప్రజలను స్థానిక పాఠశాల భవనాల్లోకి తరలిస్తున్నారు. పీసీపల్లి మండలంలోని బట్టుపల్లి వద్ద పాలేరు, తలకొండపాడు వాగులు, రాచర్ల మండలం పలకవీడు వద్ద ఉప్పువాగు పొంగాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు.
గూడూరు శివారులో స్తంభించిన వాహనాలు
నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో హైవే చుట్టూరా వరద నీరు చేరి.. ఆ మార్గంలో వాహనాలు స్తంభించిపోయాయి. ఇక్కడ చెన్నై-కోల్కతా (ఎన్హెచ్-16)పై కొత్త వంతెనలు నిర్మిస్తుండటంతో కొన్నాళ్లుగా వాహనాలను డైవర్షన్ రోడ్డులో మళ్లిస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కండలేరు సహా స్థానిక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. డైవర్షన్ రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. ఐదు అడుగుల మేర వరద పోటెత్తడంతో దారి కనిపించలేదు. సోమవారం రాత్రి నుంచే రాకపోకలు నిలిపివేశారు. గూడూరు నుంచి అటూఇటూ సుమారు 25 కిలోమీటర్ల మేర వాహనాలు మూడు వరుసల్లో నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు, డీటీసీ చందర్, గూడూరు సబ్డివిజనల్ అధికారులు వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు.
ప్రయాణికుల ఆహాకారాలు
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు వాహనాల్లోనే ఉండి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చుట్టూరా నీరే ఉండటంతో కిందకు దిగేందుకూ వీలుకాలేదు. మంచినీరు, ఆహారం దొరక్క నానాయాతన అనుభవించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ సుమారు 10 గంటల పాటు వాహనాల్లోనే గడిపారు. తర్వాత కార్లు, బస్సులను పొదలకూరు, వెంకటగిరి, పోర్టు రోడ్డు మార్గంలో పంపించారు. టోల్ ఫీజు మాత్రం యథాతథంగా వసూలు చేశారు. మరోపక్క, హైవే నిర్మాణ పనుల్లో జాప్యం చర్చనీయాంశమైంది. వంతెనల నిర్మాణం ఏడేళ్లయినా పూర్తిచేయలేదు. 2015లో వరదలకు గూడూరు- నెల్లూరు మధ్య రోడ్డు కొట్టుకుపోగా, ఇప్పటికీ అక్కడ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి సీఎం చంద్రబాబు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినా పురోగతి లోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు