CM JAGAN:వరద బాధితులకు పక్కా ఇళ్లు
కడప, చిత్తూరు జిల్లాల్లో వరదలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలుస్తామని.. ప్రతి ఇంటికీ ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించారు. వరదల్లో ఇళ్లు దెబ్బతిన్నవారికి ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.
అన్ని విధాలా ఆదుకుంటాం
నిరుద్యోగులకు ఉపాధి చూపుతాం
కడప, చిత్తూరు జిల్లాల పర్యటనలో సీఎం జగన్ భరోసా
బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ
కడప జిల్లా పులపుత్తూరులో వరద బాధితులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్
ఒంటిమిట్ట- న్యూస్టుడే; ఈనాడు- తిరుపతి: కడప, చిత్తూరు జిల్లాల్లో వరదలతో నష్టపోయిన బాధితులకు అండగా నిలుస్తామని.. ప్రతి ఇంటికీ ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించారు. వరదల్లో ఇళ్లు దెబ్బతిన్నవారికి ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు 5 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తూ ఇళ్లపట్టాలు అందజేశారు. గతంలో ఎన్నడూ చేయని విధంగా సహాయ కార్యక్రమాలను శరవేగంగా చేపట్టామన్నారు. కడప జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు, దిగువ మందపల్లి, ఎగువ మందపల్లి, చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదళ్ల్లచెరువు, ఏర్పేడు మండలం పాపానాయుడుపేటల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనలను తిలకించారు.
గురువారం మధ్యాహ్నం 12.10 నుంచి 3.10 గంటల వరకు మూడు గంటలపాటు పులపుత్తూరు గ్రామంలోనే గడిపారు. తర్వాత ఎగువ, దిగువ మందపల్లి గ్రామాల్లో సీఎం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ‘కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తి.. పింఛ, అన్నమయ్య జలాశయాల మట్టికట్టలు తెగిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు నుంచి 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి పంపించవచ్చు. 3.20 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ఒత్తిడిని తట్టుకోలేక కట్ట దెబ్బతింది. ఆ నీరంతా చెయ్యేరు నది పరీవాహక గ్రామాల్లోకి చేరడంతో భారీ నష్టం వాటిల్లింది. బాధితులకు ఇప్పటికే 99 శాతం సాయం చేశాం. సాయం అందనివారు ఉంటే మీ వివరాలను గ్రామ సచివాలయాల్లో అందజేస్తే, విచారించి మేలు చేస్తాం. పింఛ, అన్నమయ్య జలాశయాల పునరుద్ధరణ పనులను కొత్త ఆకృతి ప్రకారం చేపడతాం. భవిష్యత్తులో ఎంతటి ప్రవాహం వచ్చినా గ్రామాల్లోకి వరద రాకుండా చర్యలు చేపడతాం. నదికి ఇరువైపులా నందలూరు వంతెన వరకు రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ఇళ్లు దెబ్బతిన్న వారికి రానున్న రోజుల్లో ప్రమాదం లేకుండా ఎత్తయిన ప్రదేశంలో పక్కాగృహాలు కట్టించడానికి కృషి చేస్తాం. ప్రతి కుటుంబానికి 5 సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేస్తాం. ఇళ్లు నిర్మించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. పంటలు నష్టపోయిన వారందరికీ పరిహారం ఇస్తాం. పొలాల్లో ఇసుక మేటలను తొలగించడానికి హెక్టారుకు రూ.12,500 చెల్లిస్తాం. స్వయం సహాయ సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలకు కంతులు చెల్లించలేమని నాతో చెప్పారు. ఉన్నతస్థాయిలో చర్చించి వారికి మంచి చేస్తాం. నిరుద్యోగుల కోసం జాబ్మేళా నిర్వహిస్తాం. పనులు లేనివారికి ఉపాధిహామీ పథకంలో పనులు కల్పిస్తాం. వాహనాలు కొట్టుకుపోయిన వారికీ న్యాయం చేస్తాం’ అని సీఎం భరోసా ఇచ్చారు. విపత్తు వేళ జిల్లా అధికారులు చక్కగా పనిచేశారని అభినందించారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు.
కడప జిల్లా పులపుత్తూరులో వరద బాధితురాలికి ఇంటి స్థలం పట్టా అందజేస్తున్న సీఎం జగన్
చిత్తూరు జిల్లాకు భారీ నష్టం
వరదల వల్ల చిత్తూరు జిల్లాకు ఎన్నడూ లేని విధంగా భారీ నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కడప జిల్లా పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం నేరుగా రేణిగుంట మండలం వెదళ్ల్లచెరువు ప్రాంతంలోని యానాది కాలనీకి వెళ్లి బాధితులను పరామర్శించారు. వరదలతో తాము ఎదుర్కొన్న కష్టాలను పలువురు ఆయనకు చెప్పారు. అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు బాధితులు.. కొందరు అధికారులు తమ సమస్యలు పరిష్కరించట్లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆ కాలనీలో ఇంటింటికీ తిరిగి దెబ్బతిన్న గృహాలు పరిశీలించారు. బాధితులకు ఇళ్ల పట్టాలతోపాటు నిత్యావసర సరకులు అందజేశారు. అక్కడి నుంచి ఏర్పేడు మండలం పాపానాయుడుపేట- గుడిమల్లం వెళ్లే మార్గంలో స్వర్ణముఖి నదిపై వంతెన కూలిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. శుక్రవారం తిరుపతిలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి, నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా