OTS: ఎప్పుడో కట్టిన ఇళ్లకు... ఇప్పుడెందుకు వసూళ్లు?
పేదలకు సెంటు ఇంటి స్థలం పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల మందికి ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇళ్ల పట్టాల కోసం భూసేకరణకు, చదును చేయడానికి రూ.10 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టామని చెబుతోంది. వాటిలో సుమారు 30 లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఉచితంగా కట్టించి ఇస్తామంటోంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో అత్యాధునిక వసతులతో, గేటెడ్ కమ్యూనిటీ తరహాలో కట్టిన టిడ్కో ఇళ్లలో... 300 చదరపు అడుగుల కేటగిరీ గృహాలను లబ్ధిదారులకు
టిడ్కో, జగనన్న ఇళ్లు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం నాటి గృహాలకు ఓటీఎస్ కట్టించుకోవడమేమిటి?
డబ్బు తీసుకోకుండానే హక్కు కల్పించొచ్చు కదా
మేం మాత్రం పేదలం కాదా?
విస్మయం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
ఓటీఎస్తో 39 లక్షల మందిపై రూ.5,850 కోట్ల భారం
ప్రభుత్వ పెద్దలు స్వచ్ఛందమంటున్నా... కిందిస్థాయిలో లక్ష్యాలు పెడుతున్న అధికారులు
ఈనాడు, అమరావతి: పేదలకు సెంటు ఇంటి స్థలం పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల మందికి ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇళ్ల పట్టాల కోసం భూసేకరణకు, చదును చేయడానికి రూ.10 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టామని చెబుతోంది. వాటిలో సుమారు 30 లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఉచితంగా కట్టించి ఇస్తామంటోంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో అత్యాధునిక వసతులతో, గేటెడ్ కమ్యూనిటీ తరహాలో కట్టిన టిడ్కో ఇళ్లలో... 300 చదరపు అడుగుల కేటగిరీ గృహాలను లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా ఇస్తామనీ ప్రకటించింది.
పేదలకు ఇన్ని చేస్తున్నామని చెబుతున్న సర్కారు... ఎప్పుడో 3, 4 దశాబ్దాలనాడు ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్లను కట్టుకున్న నిరుపేదలకు వాటిపై ఉచితంగా ఎందుకు హక్కు కల్పించరు? పేదలకు ఇళ్లపై హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అయినప్పుడు టిడ్కో, జగనన్న గృహాల మాదిరిగా... ఉచితంగానే చేయవచ్చు కదా! అని లబ్ధిదారుల్లో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
స్వచ్ఛందం అంటూనే... ఓటీఎస్ పేరుతో సుమారు రూ.5,850 కోట్ల భారాన్ని ప్రజలపై ఎందుకు మోపుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఓటీఎస్ పూర్తిగా స్వచ్ఛందమేనని బలవంతమేమీ లేదని ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఓటీఎస్పై బుధవారం సమీక్ష సందర్భంగానూ ముఖ్యమంత్రి జగన్ మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. కానీ దిగువ స్థాయిలో మాత్రం అధికారులు, సిబ్బంది ఓటీఎస్కు రుసుము చెల్లించాలంటూ లక్ష్యాలు నిర్దేశించి వెంటపడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఎన్టీఆర్ హయాం నుంచి ప్రభుత్వాలు వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఇళ్లను, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ రుణ సాయంతో నిర్మించుకున్నవారు... ఇప్పుడు వాటికి ఓటీఎస్ కట్టాలనడమేంటి?’ అని పలువురు పేదలు నిలదీస్తున్నారు.
అమలాపురం మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన మెమో
తరాలు మారాక...
రాష్ట్రంలో 1983-2011 మధ్య అనేక లక్షల మంది ప్రభుత్వాలు మంజూరు చేసిన గృహాలను నిర్మించుకున్నారు. అవి కొన్ని ఇళ్లు చేతులు మారిపోయాయి. అనధికార క్రయవిక్రయాలూ జరిగిపోయాయి. అలాంటి వాటిలో 46 లక్షల ఇళ్లకు లబ్ధిదారులు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి అప్పట్లో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని, వారిలో ఏడు లక్షల గృహాల వివరాలు అందుబాటులో లేవని ప్రభుత్వం చెబుతోంది. మిగతా 39 లక్షల మంది ప్రాంతాలవారీగా నిర్దేశించిన రుసుములు చెల్లిస్తే ఆస్తిపై వారికి పూర్తి హక్కు కల్పిస్తామంటోంది. గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు ఓటీఎస్ కింద కట్టాలని చెబుతోంది. ఇళ్లు చేతులు మారి ఉంటే... ఇప్పుడు అనుభవంలో ఉన్నవారు... రెట్టింపు డబ్బు కట్టాలని నిబంధన పెట్టింది. ఒక్కో ఇంటికి సగటున రూ.15,000 చొప్పున వేసుకున్నా.. 39 లక్షల ఇళ్లపై ప్రభుత్వానికి రూ.5,850 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే ఆ మేరకు పేదలపై భారం పడినట్లే.
వాళ్లకెందుకు ఉచితంగా ఇవ్వరు?
పేదలకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే... దశాబ్దాలనాడు ఇళ్లు కట్టుకున్నవారికి వాటిపై ఎందుకు ఉచితంగా హక్కు కల్పించడం లేదని వివిధ వర్గాలవారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు జగనన్న కాలనీల్లో స్థలాలు ఇచ్చిన పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు వెచ్చిస్తోంది. ఆ మొత్తాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా కేంద్రమే భరిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల చొప్పున వెచ్చిస్తోంది. గత ప్రభుత్వం... గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల నిర్మిత ప్రదేశంగల ఫ్లాట్లను లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా ఇస్తామని ప్రస్తుత సర్కారు ప్రకటించింది. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంగల ఫ్లాట్లకూ భారీ రాయితీలిస్తోంది. ‘టిడ్కో లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లు ఇస్తున్నారు. కొత్తగానూ కొందరికి ఉచితంగా స్థలాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్నారు. కానీ గతంలో ఎప్పుడో గృహాలు నిర్మించుకున్నవారికి మాత్రం కేవలం హక్కు కల్పించేందుకు డబ్బు వసూలు చేస్తారా? ఏమిటీ వివక్ష?’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
లక్ష్యాలు పెట్టి మరీ వసూళ్లు
ఓటీఎస్ నిర్బంధం కాదని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారి నుంచే డబ్బు కట్టించుకుంటామని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఓటీఎస్ రుసుముల వసూళ్లకు వివిధ మార్గాలు అనుసరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ నుంచి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగి వరకు ప్రస్తుతం... అదే తమ ప్రాధాన్య కార్యక్రమంగా నిర్దేశించుకున్నారు. గ్రామ/వార్డు సచివాలయాల వారీగా, రోజువారీ లక్ష్యాలు నిర్దేశించారు. లక్ష్యాన్ని చేరుకోని ఉద్యోగులకు మెమోలూ ఇస్తున్నారు.
* తాజాగా అమలాపురం మున్సిపల్ కమిషనర్ పట్టణంలోని సచివాలయాల కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు. ఓటీఎస్ లక్ష్యం చేరుకోనివారిపై చర్యలు తప్పవని, ప్రొబేషన్ డిక్లేర్ చేయబోమని హెచ్చరించారు. ‘నవంబరు 29 నుంచి డిసెంబరు 10 వరకు ఓటీఎస్పై వారోత్సవాలు నిర్వహించాలని, రోజువారీ లక్ష్యాలు నిర్ణయిస్తూ ఉత్తర్వులిచ్చాం. లక్ష్యాన్ని పూర్తి చేయడంలో వార్డు సెక్రటరీల నిర్లక్ష్య వైఖరి వల్ల అమలాపురం పురపాలక సంఘం సదరు సంక్షేమ పథకం అమలులో వెనుకబడింది. జిల్లా కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అది మీరు విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం’ అని ఆ మెమోలో కమిషనర్ పేర్కొన్నారు.
* కొన్నిచోట్ల ఇళ్ల పథకం లబ్ధిదారుల్లో డ్వాక్రా మహిళల్ని గుర్తించి పొదుపు మొత్తం నుంచి ఓటీఎస్కు మళ్లించే ప్రక్రియ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం