AP Capitals: రాజధానిపై విపక్ష నేతలు ఏమన్నారంటే
విభజన చట్టం ప్రకారం రాజధానిగా ఏర్పడిన అమరావతిని మార్చడం ఎవరితరమూ కాదు. ఎప్పటికీ ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుంది. అమరావతి రూపశిల్పి చంద్రబాబు... ప్రజల భాగస్వామ్యంతో
అమరావతిని మార్చడం ఎవరితరమూ కాదు
- కె.రఘురామ కృష్ణరాజు, నరసాపురం ఎంపీ
విభజన చట్టం ప్రకారం రాజధానిగా ఏర్పడిన అమరావతిని మార్చడం ఎవరితరమూ కాదు. ఎప్పటికీ ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగుతుంది. అమరావతి రూపశిల్పి చంద్రబాబు... ప్రజల భాగస్వామ్యంతో, సెల్ఫ్ ఫైనాన్సింగ్ నమూనాలో నిర్మించాలనుకున్నారు. అయితే ఒకాయన దురదృష్టవశాత్తూ కాస్త హ్రస్వదృష్టితో సోదర సోదరీమణులారా! అన్నా... కూడా చౌదర చౌదరీమణులారా అన్నట్లుగా అర్థం చేసుకుని అన్ని కులాల వారిని ఒకే కులం వారిగా అపార్థం చేసుకున్నారు. మీ త్యాగం ముందు అవన్నీ దిగదుడుపే. భగవంతుడు, న్యాయస్థానంపై మీకున్న నమ్మకమే అమరావతిని నిలబెడుతుంది.
రాజధాని ఏదంటే ఏంచెప్పాలి?
-కె.నారాయణ, కె.రామకృష్ణ, సీపీఐ నేతలు
దిల్లీ, కోల్కతా తదితర నగరాలకు వెళ్లినప్పుడు మీ రాజధాని నగరం ఏదీ? అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. అమరావతి అనే ముక్కుపచ్చలారని పసికందును మూడు ముక్కలుగా నరికేసి.. మూడు ప్రాంతాల్లో పడేసి ఇదే రాజధాని అంటున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా ఒక్క ఫోన్కాల్ చేసి ఆదేశిస్తే చాలు జగన్ దాన్ని శిరసావహిస్తారు.
దోపిడీ కోసమే విశాఖపట్నంలో రాజధాని
-కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు
అమరావతిలో దోచుకోవడానికి ఏమీ లేదని విశాఖలో అయితే అన్నీ దోచుకోవచ్చనే ఉద్దేశంతోనే అక్కడ రాజధాని పెడతామంటున్నారు. అక్కడి దోచేస్తున్న తీరు చూసి ప్రజలు భయభ్రాంతులవుతున్నారు.
అలా చేస్తే విశాఖ రాజధాని వద్దని జగనే అంటారు
-ఎన్.తులసిరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
సీఎం జగన్ది, నాది పులివెందులే. ఆయన రోడ్డు మార్గంలో అమరావతి నుంచి పులివెందులకు వచ్చి, మళ్లీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలోనే విశాఖపట్నం వెళ్లి, ఆ తర్వాత అక్కడి నుంచి పులివెందులకు రోడ్డుమార్గంలోనే వస్తే వామ్మో...! విశాఖ రాజధాని వద్దే వద్దంటారు.
మహిళలను ఏడిపించినందుకే ఆర్థిక కష్టాలు
- పాతూరు నాగభూషణం, భారతీయ జనతా పార్టీ
ఆడవాళ్లను ఏడిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అమరావతి మహిళల్ని ఏడిపించినందుకే ఆంధ్రప్రదేశ్ అప్పులపాలైంది.
రాజధాని కథ సుఖాంతం అవుతుంది
- రాందాస్చౌదరి, జనసేన రాయలసీమ కన్వీనర్
రైతుల పక్షాన జనసేన ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతే రాజధానిగా కొనసాగుతుంది. అయిదు కోట్ల ఆంధ్రుల మనసుల్లో మీ స్థానం పదిలం. అమరావతి కథ సుఖాంతం అవుతుంది.
‘అంబేడ్కర్ స్మారక చిహ్నం’ నీరుగారింది
- రావెల కిశోర్బాబు, మాజీ మంత్రి, భాజపా
చంద్రబాబు అమరావతికి రూ.వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. రూ.125 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో అంబేడ్కర్ స్మారక చిహ్నాన్ని నిర్మించే ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుత సీఎం దాన్ని నీరుగార్చారు.
పంజాబ్ రైతుల స్ఫూర్తితో అమరావతి పోరాటం
రావుల వెంకయ్య, అఖిలభారత కిసాన్ సభ అధ్యక్షుడు
వ్యవసాయ చట్టాలపై ఉద్యమించి... కేంద్రం ఉపసంహరించుకునేలా చేసిన చరిత్ర పంజాబ్, హరియాణా రైతులది. అమరావతి రైతు పోరాటాన్ని కూడా వారి స్ఫూర్తితో కొనసాగించాలి.
పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే
కుమారస్వామి, భారతీయ కిసాన్సంఘ్, ఆంధ్రప్రదేశ్
పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే. రాజకీయాలకు అతీతంగా జరిగే ఉద్యమాలే విజయం సాధించాయి. తిరుపతి వెంకన్న సాక్షిగా చెబుతున్నాం.. ముఖ్యమంత్రి జగన్ పతనం మొదలైంది.
‘అమరావతి’పై భాజపా తీర్మానించింది
వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్రెడ్డి 30 వేల ఎకరాలు కావాలన్నారు. అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించడం మంచిదా? అమరావతి రాజధానిగా ఉండాలని భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసింది.
సమాజం బాగుండాలని కోరుకునేది రైతులే
సిరాజ్, ముస్లిం హక్కుల పోరాట సమితి
నేను ఏమై పోయినా ఫర్వాలేదు, నా సమాజం బాగుండాలని కోరుకునేవారు రైతు సోదరులే. పార్టీలకు అతీతంగా... అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు.
జగన్ వస్తే నష్టమని ఆనాడే చెప్పా: శివాజీ, సినీనటుడు
జగన్ అధికారంలోకి వస్తే అమరావతి పక్కకు పోతుందని ఎన్నికల ముందే నేను చెప్పా. ఎన్నికల ముందు నేనున్నాను, నేను విన్నాను, ఉద్యోగాలు తెస్తానని ప్రతి కాలేజీకి తిరిగిన వ్యక్తిని యువత ఇప్పుడు ఎందుకు ప్రశ్నించదు?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ