VRS: విద్యుత్ ఉద్యోగుల వీఆర్ఎస్ బాట!
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) బాట పట్టారు. జెన్కో, ట్రాన్స్కోలో సుమారు 100 మంది విద్యుత్ ఇంజినీర్లు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు. ఈ అంశం
ఇప్పటికే వంద మంది దరఖాస్తు
పింఛన్ ప్రయోజనాలు తగ్గుతాయనే ఆందోళనతో నిర్ణయం
ఈనాడు - అమరావతి
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) బాట పట్టారు. జెన్కో, ట్రాన్స్కోలో సుమారు 100 మంది విద్యుత్ ఇంజినీర్లు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు. ఈ అంశం ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబరు ఆఖరుకు వందల సంఖ్యలో సిబ్బంది ఇదే బాట పట్టే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. 2022 ఏప్రిల్ నుంచి మాస్టర్ స్కేల్ ఆధారంగా పదవీ విరమణ ప్రయోజనాలు, పింఛన్ చెల్లింపు నిబంధనలను అమల్లోకి తేవాలని యాజమాన్యం భావిస్తున్నట్లు ఉద్యోగుల్లో ప్రచారం సాగుతోంది. యాజమాన్యం ఈ ప్రతిపాదనను ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు ఉద్యోగులు చెప్పారు. ఇది అమలైతే సుమారు రూ.30-40 లక్షల మేర పదవీ విరమణ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళన సిబ్బందిలో నెలకొంది. అలాగే పింఛన్లో కనీసం రూ.50 వేలు తగ్గే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే వీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఐదేళ్ల సర్వీసు ఉన్న వారూ వీఆర్ఎస్కు దరఖాస్తు చేయటం గమనార్హం.
సిబ్బందికి ప్రత్యేక పేస్కేల్
ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం లేకుండా విద్యుత్ సిబ్బందికి ప్రస్తుతం ప్రత్యేక పేస్కేల్ అమలవుతోంది. 1999లో విద్యుత్ బోర్డు నుంచి డిస్కంలు, ట్రాన్స్కో, జెన్కో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉద్యోగ సంఘాలతో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో రెండు ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే పేస్కేల్ వర్తింపు మొదటి ప్రతిపాదన. ఫిట్మెంట్లో 5 శాతం తగ్గించి.. ప్రతిఫలంగా 15 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల కంటే అదనంగా ఒక వెయిటేజ్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నది రెండో ప్రతిపాదన. రెండో ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు ఎంచుకున్నాయి. దీనిపై అప్పట్లో ట్రైపార్టీ ఒప్పందం(ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు, ఉద్యోగ సంఘాలు) కుదిరింది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల కంటే అదనంగా 16 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు విద్యుత్ సిబ్బందికి వచ్చే అవకాశం ఉంది. వాటికి చెల్లించే మొత్తాన్ని మాస్టర్ స్కేల్లో కలపకుండా.. వ్యక్తిగత జీతాల్లో కలిపి ప్రస్తుతం చూపుతున్నారు. పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపులో వాటినీ యాజమాన్యం పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ నిబంధనను మార్పు చేసి.. మాస్టర్ స్కేల్ ప్రకారం ఉన్న జీతాలకే పింఛన్ ప్రయోజనాలను పరిమితం చేయాలని యాజమాన్యం భావిస్తోంది. ఇదే ప్రస్తుతం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణంగా మారింది.
లక్షల నష్టం.. పింఛన్లో కోత
పింఛన్ ప్రయోజనాల లెక్కింపులో వెయిటేజ్ ఇంక్రిమెంట్లను పరిగణనలోకి తీసుకోకూడదన్న నిర్ణయం అమలైతే ఉద్యోగి స్థాయిని బట్టి రూ30-40 లక్షలు నష్టపోవాల్సి వస్తుందని ఉద్యోగసంఘాల ఐకాస సెక్రటరీ జనరల్ ప్రతాప్రెడ్డి తెలిపారు. పదవీ విరమణ తర్వాత అందే 300 రోజుల లీవ్ ఎన్క్యాష్మెంట్, 40 శాతం కమ్యుటేషన్పై దీని ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రతి నెలా చెల్లించే పింఛన్లో గరిష్ఠంగా రూ.50 వేల వరకూ తగ్గుతుందని అంచనా. ప్రస్తుతం సీఈ కేడర్లో పదవీ విరమణ చేసిన సిబ్బందికి ప్రతి నెలా రూ.1.50 లక్షల వరకు పింఛన్ వస్తుంది. కొత్త నిబంధన అమల్లోకి వస్తే పింఛన్లో రూ.50 వేలు తగ్గుతుంది.
* ప్రస్తుతం సర్వీసులో ఉన్న సిబ్బంది జీతాలూ సుమారు 15 శాతం దాకా తగ్గే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. మాస్టర్స్కేల్ ఆధారంగా ప్రయోజనాలను పరిమితం చేస్తే ఈపీఎఫ్ చందా, డీఏ తగ్గి ఆ మేరకు జీతాల్లో కోత పడుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంజినీర్లకు మాస్టర్ స్కేల్ రూ.1,82,975గా ఉంది. నాలుగు స్టాగ్నేట్ ఇంక్రిమెంట్లూ కలిపితే రూ.2.03 లక్షలు అవుతుంది. దీనికి మించి చెల్లించే మొత్తాన్ని పింఛన్ ప్రయోజనాల లెక్కింపులో పరిగణనలోకి తీసుకోకూడదని యాజమాన్యం భావిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. -
దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం
కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
సీపీఎస్ రద్దుపై మాట దాటేసిన బొత్స
భోగాపురం ఎయిర్ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. -
సుజనాచౌదరి రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతి
భాజపా నేత సుజనాచౌదరిపై రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ-హైదరాబాద్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు