Justice NV Ramana: తెలుగోడి గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటండి
తెలుగోడి గొప్పదనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తోటి తెలుగువారిపై చులకన భావాన్ని విడనాడాలని, విమర్శించే బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని సూచించారు. కరోనా వ్యాధికి మనదేశంలో తయారైన కొవాగ్జిన్ టీకా అద్భుతంగా పనిచేస్తుందని
విమర్శించే బానిస మనస్తత్వాన్ని విడనాడాలి
తెలుగు భాష, సంస్కృతులను గౌరవించండి
రామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఈనాడు, హైదరాబాద్: తెలుగోడి గొప్పదనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తోటి తెలుగువారిపై చులకన భావాన్ని విడనాడాలని, విమర్శించే బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని సూచించారు. కరోనా వ్యాధికి మనదేశంలో తయారైన కొవాగ్జిన్ టీకా అద్భుతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్ను కూడా సమర్థంగా ఎదుర్కొంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అయినా మన దేశంలో తయారైందంటూ కొందరు నిరుత్సాహపరిచారని, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు చేశారని, గుర్తింపురాకుండా పలు ప్రయత్నాలు చేశారని అన్నారు. ఓవైపు బహుళ జాతి కంపెనీలు భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ మార్కెట్లోకి రాకుండా ప్రయత్నిస్తుంటే, మరోవైపు మనవాళ్లు కూడా వెనక్కి లాగడానికి ప్రయత్నించారన్నారు. తెలుగువాళ్లలో ఐక్యత అవసరమని, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనవారితో కలిసి తెలుగువారి గొప్పదనాన్ని తెలియజేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్లో గురువారం జరిగిన డాక్టర్ రామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాతృమూర్తిని, మాతృభాషను, దేశాన్ని గౌరవించడం సంప్రదాయమన్నారు. బాధ్యతగల వ్యక్తులు సమాజం కోసం పనిచేయాల్సి ఉందంటూ గురజాడ చెప్పిన ‘దేశమంటే మనుషులోయ్’ అన్న గేయాన్ని వినిపించారు. తెలుగు భాషను పిల్లలకు నేర్పాలని, కనీసం ఇంట్లో అయినా మాట్లాడే అవకాశం కల్పించాలని, సాహిత్యాన్ని చదవడంతోపాటు తెలుగు నాటకాలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు తదితరాలను ప్రోత్సహించాలన్నారు.
కృష్ణ ఎల్ల దంపతులు కష్టాలతో ఎదిగారు
అవార్డు గ్రహీతల్లో చాలా మంది తన జీవన గమనంలో సుపరిచితులని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వారికి పురస్కారాలు ప్రదానం చేయడం గొప్ప అవకాశమన్నారు. వారు ఇతరుల సహకారంతో కాకుండా కఠోర శ్రమతో ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల పలు కష్టాలు ఎదుర్కొన్నారన్నారు. అమెరికాలో చిన్నచిన్న ఉద్యోగాలు చేశారని తెలిపారు. కృష్ణ పరిశోధనలు చేస్తున్నపుడు సుచిత్ర ఉద్యోగం చేస్తూ అండగా నిలిచారన్నారు. దేశానికి ఏదైనా సేవ చేయాలని ఇక్కడికి వచ్చి పలు కష్టాలు ఎదుర్కొని ఒకానొక దశలో వెనక్కి వెళ్లిపోవాలనుకున్నారన్నారు. అయితే మనోనిబ్బరంతో నిలబడి కరోనా వ్యాక్సిన్ను తయారు చేసి భారత కీర్తిపతాకను గగన వీధుల్లో ఎగురవేశారన్నారు. అవార్డు అందుకున్న డాక్టర్ మస్తాన్ 20 ఏళ్లుగా తనతోపాటు మరో 10 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వైద్యం అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మలయాళీ అయిన సుమ గత జన్మలో తెలుగువారై ఉంటారని, తెలుగు గొప్పదనాన్ని చాటుతున్న సుమ ఈ తరానికి ఆదర్శప్రాయమన్నారు. బండ్లమూడి శ్రీనివాస్ శిరిడీలో వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఆహారం అందజేస్తున్నారన్నారు. అత్యంత సన్నిహితుడైన బ్రహ్మానందం హాస్యనటుడనుకోరాదని, డైనమేట్లాంటి వ్యక్తి అన్నారు. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితిని తనకు కల్పించారని, కష్టపడి పైకి వచ్చారని తెలిపారు. డాక్టర్ దుర్గా పద్మజ పలువురికి సేవలందించారని, ఎస్వీ రామారావు సినిమా రంగానికి చేసిన సేవలు మరువలేనివన్నారు ఆయన సేవలను మనం సరిగా వాడుకోలేదనిపిస్తోందన్నారు. నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజు వ్యవసాయ కుటుంబంలో పుట్టారని, కరోనా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులకు, గ్రామీణ మహిళలకు అండగా నిలిచారన్నారు. రామినేని దంపతులు 1950 ప్రాంతంలోనే ఆమెరికా వెళ్లినా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మూలాలను మర్చిపోకుండా పిల్లలకు, సంస్కృతిని, భాషను నేర్పించారన్నారు. ఆ పిల్లలే మహావృక్షాలుగా నిలబడి ప్రముఖులను గుర్తించి 20 ఏళ్లకుపైగా అవార్డులను అందజేయడం గొప్పవిషయమని అభినందనలు తెలిపారు.
టీకాల తయారీలో భారత నాయకత్వం గర్వకారణం: కృష్ణ ఎల్ల
టీకాల తయారీలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తుండటం గర్వకారణమని భారత్ బయోటెక్ వ్యవస్థాపక ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. రామినేని ఫౌండేషన్ విశిష్ఠ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇతర దేశాల మీద ఆధార పడుతున్నామన్నారు. ఆవిష్కరణల వైపు అడుగులు వేయలేకపోతున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు వచ్చిందని, తాను 20 ఏళ్ల క్రితమే దీన్ని నమ్మానని గుర్తు చేశారు. ఎంచుకున్న మార్గంలో ఎంతటి ప్రమాదం ఎదురైనా ముందుకే వెళ్లాలన్నారు. భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణ, ఓర్పు విషయంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తనకు తానే సాటి అన్నారు. అంతగొప్ప వ్యక్తిని చూసి ఎంతో నేర్చుకుంటున్నానని తెలిపారు. టీకా తయారీ ఘనత తమది మాత్రమే కాదని.. అది భారత్ బయోటెక్లో పనిచేసే 2000 మంది ఉద్యోగుల కష్టంతో సాధించిన విజయమన్నారు. నాబార్డు ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజు మాట్లాడుతూ సామాజికసేవ చేస్తున్న వారికి అవార్డులు అందించటం హర్షణీయమన్నారు. హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ జస్టిస్ ఎన్వీ రమణ పక్కవాళ్ల కష్టం, సమన్యాయం తెలిసిన మనిషి అన్నారు. వ్యాఖ్యాత సుమ మాట్లాడుతూ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ మహిళా సాధికారికతకు పెద్దపీట వేశారన్నారు. కార్యక్రమంలో రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ ధర్మప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం, మాజీ మంత్రి చంద్రమోహన్రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, రామినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజుకు నాగలి బహూకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!