AP News: ఓటీఎస్పై తెదేపా భగ్గు
ఎప్పుడో కట్టిన ఇళ్లకు వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడటంపై తెదేపా శ్రేణులు భగ్గుమన్నాయి. ‘ఓటీఎస్ వసూళ్లు- పేదలకు ఉరితాళ్లు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా...
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన
కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట
గుంటూరులో లాఠీఛార్జి
ఈనాడు డిజిటల్, అమరావతి, ఈనాడు యంత్రాంగం: ఎప్పుడో కట్టిన ఇళ్లకు వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడటంపై తెదేపా శ్రేణులు భగ్గుమన్నాయి. ‘ఓటీఎస్ వసూళ్లు- పేదలకు ఉరితాళ్లు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. ఆ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి.ఈ విధానాన్ని రద్దు చేయాలంటూ తెదేపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు విన్నపాలనిచ్చారు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా ఓటీఎస్ మొత్తాన్ని చెల్లించవద్దని, తాము అధికారంలోకి రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని నేతలు హామీనిచ్చారు. గుంటూరు నగరపాలక కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్ వద్దకు చేరుకున్నాక విన్నపమివ్వడానికి లోనికి వెళ్లేందుకు తెదేపా శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. పలువురు పోలీసులు, కార్యకర్తలతోపాటు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కిందపడ్డారు.
* కాకినాడ పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు కలెక్టరేట్కు చేరుకుని ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లు, రోప్ను దాటుకుంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే చినరాజప్ప, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
* ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.
* మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన తెదేపా నేతలను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
* కడపలో పార్టీ కార్యాలయంనుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
* అనంతపురంలో విద్యుత్ కార్యాలయంనుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడి బారికేడ్లను తోసుకుంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరిగింది. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆందోళనలో పాల్గొన్నారు.
* విశాఖ కలెక్టరేట్ వద్ద పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
* విజయనగరం లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున చీపురుపల్లినుంచి వాహనాలతో విజయనగరం వరకు ర్యాలీ నిర్వహించారు.
* కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
* మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, నేతలు నెట్టెం రఘురాం, కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్, శ్రీరాంరాజగోపాల్ పాల్గొన్నారు.
* ఒంగోలులో పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
గుత్తేదార్ల దయ.. గనులశాఖ ప్రాప్తం
టెండరు దక్కించుకున్న గుత్తేదారు ఒకటో తేదీన ఆ నెల సొమ్ము అడ్వాన్స్గా జమ చేయాలనేది నిబంధన. కానీ అత్యధిక జిల్లాల్లో గుత్తేదారులు ఆ డబ్బు చెల్లించడం లేదు. -
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి.