Perni Nani:ఎవరిపైనా కక్ష లేదు
తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని, ఎవరికి వారుగా ఆపాదించుకుని, వారి కోసమే సినిమా టికెట్ల రేట్లను తగ్గించారనడం సరికాదని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య
సినిమా టికెట్ ధరలను కమిటీ పరిశీలిస్తుంది
పంపిణీదారుల సంఘం నేతలతో మంత్రి పేర్ని నాని
ఈనాడు - అమరావతి
తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని, ఎవరికి వారుగా ఆపాదించుకుని, వారి కోసమే సినిమా టికెట్ల రేట్లను తగ్గించారనడం సరికాదని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన సినిమా పంపిణీదారుల సంఘం నేతలతో మంగళవారం సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘హైకోర్టు సూచన మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ... టికెట్లు, బెనిఫిట్ షోలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. పంపిణీదారులు, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్, సినిమాహాళ్ల యజమానులతోపాటు వివిధ వర్గాల విజ్ఞప్తులను కమిటీకి అందిస్తాం. చాలా థియేటర్లకు అనుమతులు లేవని సెప్టెంబరులోనే చెప్పినా... స్పందించని వారిపైనే చర్యలు తీసుకుంటున్నాం. అనుమతులకు దరఖాస్తు చేసిన వారి జోలికి వెళ్లలేదు. ఇప్పటివరకు 9 జిల్లాల్లో 130 సినిమాహాళ్లు నిబంధనలను పాటించడం లేదని గుర్తించాం. ఇందులో 25 హాళ్లకు జరిమానా విధించాం. 83 సీజ్ చేశాం. 22 రెన్యువల్ చేసుకోకుండా సొంతంగా మూసేశారు. టికెట్ల ధరలు, సినిమాహాళ్ల అనుమతుల పునరుద్ధరణకు 4 వారాల సమయం ఇవ్వాలని కోరారు. సినిమా టికెట్ల అంశంపై ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత దానయ్య నాకు రెండు సార్లు ఫోన్ చేశారు. ఈ విషయాలనూ కమిటీ పరిశీలిస్తుంది. త్వరలోనే ఆన్లైన్ టికెట్ విధానం అమల్లోకి తెస్తాం’ అని మంత్రి వివరించారు.
నాని... ఎక్కడి థియేటర్, కిరాణా కొట్టు లెక్క లేశారో... సినీ హీరో నాని ఏ ఊళ్లో సినిమా హాలు, దాని పక్కనున్న కిరాణ కొట్టు లెక్కలేశారో తెలియదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. టికెట్ ధరలపై హీరో నాని వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా... ‘ఆయన బాధ్యతాయుతంగానే ప్రకటన ఇచ్చారనుకుంటా. సినిమా హాలు కౌంటరు, పక్కన వెచ్చాల కొట్టు కౌంటరును లెక్క పెట్టే ఉంటారు’ అని మంత్రి స్పందించారు. చెన్నైలో ఉండే సినీ హీరో సిద్దార్థ్ ఆంధ్రప్రదేశ్లోని సినిమా టికెట్ల గురించి ఎందుకు మాట్లాడతారని మంత్రి నాని ప్రశ్నించారు. ‘మేం విలాసంగా బతుకుతున్నామో లేదో ఆయనొచ్చి చూశారా? తమిళనాడు సీఎం స్టాలిన్, అక్కడి మంత్రులను, లేదంటే మోదీని ఉద్దేశించి మాట్లాడి ఉంటారు’ అని పేర్కొన్నారు.
టికెట్ల రేట్లు పెంచండి
కార్పొరేషన్ల పరిధిలో ఏసీ హాళ్లకు రూ.150 - రూ.50 (గరిష్ఠం-కనిష్ఠం), ఏసీలేని వాటిలో రూ.100- రూ.40 చొప్పున, ఇతర ప్రాంతాల్లోని ఏసీ హాళ్లలో రూ.100- రూ.40(గరిష్ఠం- కనిష్ఠం), ఏసీ లేని వాటిలో రూ.80- రూ.30 చొప్పున ధరలను నిర్ణయించాలి. కొత్త సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని మంత్రి నానిని కోరాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు