CM Jagan: 24,419 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం అదనంగా మరో 19 ల్యాబ్లు అందుబాటులోకి రాబోతున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రూ.426 కోట్లతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్పీఎం (లీటర్ ప£ర్ మినిట్) సామర్థ్యం కలిగిన 176 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లతోపాటు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్ఎంవో ట్యాంకులు,
‘వర్చువల్’ విధానంలో ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేసిన సీఎం జగన్
మరో 19 ల్యాబ్లలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు
రోజుకు లక్ష నమూనాల సామర్థ్యం
ముఖ్యమంత్రి జగన్ వెల్లడి
ఆక్సిజన్ ప్లాంట్లు జాతికి అంకితం
ఈనాడు, అమరావతి: కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం అదనంగా మరో 19 ల్యాబ్లు అందుబాటులోకి రాబోతున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రూ.426 కోట్లతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్పీఎం (లీటర్ పర్ మినిట్) సామర్థ్యం కలిగిన 176 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లతోపాటు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్ఎంవో ట్యాంకులు, ఆక్సిజన్ పైపులైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 24,419 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. తాడేపల్లి కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కొవిడ్ నియంత్రణపైనా అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న 20 కాకుండా అదనంగా మరో 19 ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు సిద్ధమవుతున్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ట్రూనాట్ ల్యాబ్లతో కలిపితే 150 ల్యాబ్లు సమకూరుతాయని తెలిపారు. వీటి ద్వారా రోజుకు లక్ష నమూనాలను పరీక్షించవచ్చన్నారు. విజయవాడలో ఏర్పాటైన జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. కొవిడ్ నియంత్రణలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని.. కరోనా చికిత్స, టీకాల పంపిణీలో ఏపీ అగ్రగామిగా ఉందని చెప్పారు. కొవిడ్లో ఎలాంటి వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాలన్నీ సిద్ధం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన 32 ఆక్సిజన్ ప్లాంట్లు, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పెట్టిన 144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేసినట్లు సీఎం వెల్లడించారు. ‘50 పడకల సామాజిక వైద్యశాలల్లోనూ ఆక్సిజన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 100 పడకలు దాటిన 71 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30% సబ్సిడీ ఇచ్చింది. మొత్తంగా రాష్ట్రంలో 247 ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. మలి విడత కొవిడ్లో ఆక్సిజన్ కొరతతో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆక్సిజన్ ట్యాంకర్లను విమానాలు, నౌకల ద్వారా రప్పించాల్సి వచ్చింది. ఈ గుణపాఠాలతో రూ.426 కోట్లు ఖర్చు చేసి, నిమిషానికి 44వేల లీటర్ల మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నాం. మొత్తమ్మీద 24,419 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఏర్పడింది. కొవిడ్ కారణంగా చిన్నపిల్లలు ఇబ్బందిపడకుండా 20 పడకల పీడియాట్రిక్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం’ అని వివరించారు.
ఫిబ్రవరి నాటికి 39 వేల నియామకాలు
రాష్ట్ర విభజనతో హైదరాబాద్ను కోల్పోయినందువల్ల రాష్ట్రంలో ఉన్నత వైద్య సంస్థలు లేకుండా పోయాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘ప్రత్యామ్నాయంగా వాలంటీర్లు, గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో భాగంగా ఏర్పాటు చేయబోతున్న వైఎస్సార్ క్లినిక్ భవన నిర్మాణాలు 80% పూర్తయ్యాయి. కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా నాలుగుచోట్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు తరపున చికిత్సలను రోగుల అవసరాలకు తగ్గట్లు విస్తరిస్తున్నాం. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి తొలి విడత వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. 80% మందికి రెండు డోసులు అందించాం. ఇప్పటివరకు 82% మంది టీనేజర్లకు వ్యాక్సిన్ ఇచ్చాం. కొవిడ్ పరిస్థితుల్లోనూ వ్యవసాయ, వైద్య రంగాలను అభివృద్ధి చేశాం. ఆసుపత్రుల్లో అవసరాల కోసం చేపట్టిన 39వేల నియామకాలు వచ్చే నెలాఖరుకు పూర్తవుతాయి. దేవుడి దయ, ప్రజల దీవెనలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని సీఎం చెప్పారు.
రూ.కోటి విరాళం
కరోనా నివారణ, వరద ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ తరఫున రూ.కోటి విరాళం చెక్కును తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్కు అందిస్తున్న విర్కో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఎం.మహావిష్ణు. పక్కన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.
- ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.