AP News: రైతులకు, మీకు తేడా లేదా?
వెంటనే విధుల్లో చేరి ప్రభుత్వానికి మీపై ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకురావద్దని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర సచివాలయంలో సోమవారం వారితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు
వీధుల్లోకి రావడం మంచి పద్ధతి కాదు
చర్యలు ప్రారంభిస్తే మీరే నష్టపోతారు
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్
విధుల్లో చేరి నిరసనలు కొనసాగిస్తామన్న సంఘాల నేతలు
ఈనాడు, అమరావతి: వెంటనే విధుల్లో చేరి ప్రభుత్వానికి మీపై ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకురావద్దని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర సచివాలయంలో సోమవారం వారితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.‘ప్రభుత్వ ఉద్యోగులై ఉండీ వీధుల్లోకి రావడం సరైన పద్ధతి కాదు. రైతులకూ... మీకు తేడా లేదా? మీకు కొన్ని నియమాలు, నిబంధనలున్నాయి. ప్రభుత్వం అందరికీ ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించదు. రోడ్లపైకి వస్తే పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలొస్తాయని అనుకుంటున్నారేమో... ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే తర్వాత నష్టపోతారని గ్రహించండి. ఉద్యోగులు మీ మాట వినడం లేదని కొందరు అంటున్నారు. మీ మాట వారు వినడం లేదంటే మీరు నాయకులు కారన్న మాటే. అలాంటప్పుడు మిమ్మల్ని సమావేశానికి పిలిచి మాట్లాడాల్సిన పని లేదు. మీకు ఇదే చివరి సమావేశం. విధులు బహిష్కరించి రోడ్లపైకి రావడం క్షమార్హం కాదు. మీరు మూడు రోజులపాటు చేసిన కార్యక్రమాలతో రెండేళ్లపాటు కాపాడుకుంటూ వచ్చిన మంచితనం కోల్పోయారు. సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టి వాటిని ట్రోల్ చేస్తే మీకే నష్టం. మీపట్ల ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా ఉన్నారు’ అని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించారు.
ప్రొబేషన్ ఖరారే సమస్యకు పరిష్కారం
‘సచివాలయాల వ్యవస్థను సీఎం మానసపుత్రిక అని చెబుతున్నప్పుడు ప్రొబేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు. మా సహచర ఉద్యోగులు మేం చెబితే వినే పరిస్థితుల్లో లేరు. ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ఒక్కటే ప్రస్తుత సమస్యకు పరిష్కారం. వెంటనే ప్రక్రియ ప్రారంభించి సంక్రాంతి కానుకగా అందించాలి. మమ్మల్ని అవహేళన చేసి మాట్లాడుతున్న అధికారులను కట్టడి చేయాలి’ అని వార్డు, సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు.
జూన్ 30లోగా ప్రొబేషన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు
‘ఉద్యోగుల ప్రొబేషన్ జూన్ 30లోగా పూర్తి చేస్తామని అజయ్ జైన్ హామీ ఇచ్చారు. వెంటనే విధులకు తిరిగి హాజరు కావాలని ఉద్యోగులను కోరుతున్నాం. ఆందోళనల వెనుక కొన్ని శక్తులు పని చేస్తున్నాయి. సీఎం జగన్పై మాకు నమ్మకం ఉంది’
- అంజన్రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
వెంటనే పే స్కేల్ వర్తింపజేయాలి
‘వెంటనే విధుల్లో చేరాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించారు. వెంటనే పేస్కేల్ వర్తింపజేయాలని మేమూ కోరాం’
- రాజేశ్, షేక్ అబ్దుల్ రజాక్,గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
విధుల్లో చేరి పెన్డౌన్
‘ఉద్యోగులు మంగళవారం నుంచి విధులకు హాజరవుతారు. కానీ పెన్డౌన్ చేస్తాం. ప్రొబేషన్, కన్ఫర్మేషన్ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసేవరకు పనులు చేయం. ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేశాం’
- వి.శ్రీనివాసరావు, ఏపీ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..