Re-survey: వచ్చే ఏడాదిలోగా రీ-సర్వే పూర్తి
వచ్చే ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూముల రీ-సర్వేను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే
భూ యజమానులకు భరోసా
అన్ని వివాదాలకూ పరిష్కారం
ముఖ్యమంత్రి జగన్ వెల్లడి
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం ప్రారంభం
ఈనాడు, అమరావతి: వచ్చే ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూముల రీ-సర్వేను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని దశల వారీగా ప్రారంభిస్తామన్నారు. ‘సింగిల్విండో విధానంలో కూడా ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దీని వల్ల భూముల సమాచారాన్ని ఎప్పుడైనా, ఎక్కడ నుంచైనా పొందే అవకాశం లభిస్తుంది. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరి భూమి హద్దులను ఆధునిక పద్ధతుల్లో గుర్తించి, యూనిక్ ఐడీని క్రియేట్ చేస్తాం. సబ్ డివిజన్ల వారీగా వివరాలు క్రోడీకరించి, యజమానులకు పట్టాలు అందజేస్తాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.1,000 కోట్ల ఖర్చుతో 2020 డిసెంబరు 21న భూముల రీ సర్వేను ప్రారంభించాం. కార్స్, డ్రోన్స్ టెక్నాలజీని రీ-సర్వేకు ఉపయోగిస్తున్నాం...’ అని ఆయన పేర్కొన్నారు.
51 గ్రామాల భూ రికార్డులు ప్రజలకు అంకితం
వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంలో భాగంగా తొలిదశ కింద 51 గ్రామాల్లో పూర్తి చేసిన భూముల రీ-సర్వే రికార్డులను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. ఇందులో 37 గ్రామాల్లో భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ‘నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలు భూ వివాదాలను నా దృష్టికి తెచ్చారు. రికార్డుల్లో ఉన్న భూమికి, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య తేడాలు ఉన్నాయి. ఒక సర్వే నెంబరులో అమ్మకాలు జరుగుతున్నా సబ్డివిజన్ జరిగి ఉండదు. పట్టాదారు పాస్బుక్ ఏర్పాటు వల్ల ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదు. రికార్డుల్లో తమ భూముల వివరాలు తారుమారయ్యాయనే ఫిర్యాదులు విపరీతంగా పెరుగుతున్నాయి. 80% నుంచి 90% సివిల్ కేసులు ఉన్నాయి. రీ-సర్వే ద్వారా ఇవన్నీ పరిష్కారమవుతాయి...’ అని వివరించారు.
3 వారాల్లోగా మిగిలిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు
ప్రస్తుతానికి 37 గ్రామాల్లోని సచివాలయాల్లోనే భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం నుంచి ప్రారంభించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. మిగిలిన 14 గ్రామాల సచివాలయాల్లోనూ మరో మూడు వారాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమవుతాయన్నారు. సబ్డివిజన్ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ‘గ్రామాల్లోనే ఆస్తుల లావాదేవీలు కనిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీని వల్ల యజమానులకు తెలియకుండా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇదోక పెద్ద సంస్కరణ. ప్రతి ఒక్క కమతాన్ని డిజిటల్గా నిర్ణయించి, క్యూఆర్ కోడ్తో ల్యాండ్ మ్యాప్ను ఇస్తున్నాం. భూముల హద్దులను గుర్తించి, అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా మార్కింగ్ చేస్తాం. ప్రతి ఒక్క కమతానికి నిర్దిష్టంగా ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ కూడా ఇస్తున్నాం. ఈ శాశ్వత భూ హక్కు పథకం అమలు వల్ల నకిలీ పత్రాలకు తావుండదు. ఆస్తులు అమ్ముకున్నా సబ్డివిజన్ వెంటనే చేసిన తర్వాతనే ఆ లావాదేవీలు ఆధారంగా మాత్రమే భూ రికార్డుల్లో మార్పులు జరుగుతాయి. గ్రామ సర్వేయర్ల ద్వారా ఫీల్డ్ లైన్ దరఖాస్తులను 15 రోజుల్లోనూ, పట్టా సబ్డివిజన్ దరఖాస్తులను 30 రోజుల్లోనూ పరిష్కరించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించాం...’ అని సీఎం జగన్ వివరించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘రీ-సర్వే’ జరిగిన గ్రామాల్లోని పలువురితో వర్చువల్ విధానంలో సీఎం జగన్ మాట్లాడారు.
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలుగా 37 సచివాలయాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 37 గ్రామ/వార్డు సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సచివాలయాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులను సబ్-రిజిస్ట్రార్లుగా కూడా నియమిస్తున్నట్లు తెలిపింది. భూముల రీ-సర్వే ఇప్పటివరకు 51 గ్రామాల్లో పూర్తయింది. తొలివిడత కింద వీటిలో 37 గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను మంగళవారం నుంచి ప్రారంభించారు.ఓటీఎస్ రుణాన్ని చెల్లించేందుకు డ్వాక్రా సభ్యులతో అప్పు చేయిస్తున్నారు. రుణం చెల్లించేందుకు నగదు లేదంటున్న డ్వాక్రా సభ్యులకు బ్యాంకు లింకేజీ, పొదుపు నుంచి రుణం ఇప్పిస్తున్నారు. బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటే 9% వడ్డీతో తిరిగి చెల్లించాలి. అదే పొదుపు ద్వారా అయితే రూపాయి వడ్డీ (12%) కట్టాలి. వాస్తవానికి డ్వాక్రా రుణాలను వారి జీవనోపాధికి వినియోగించుకోవాలి. కాని ప్రభుత్వం ఇలా అప్పులకు వినియోగించుకోవడం విమర్శల పాలవుతోంది. ఓటీఎస్ మొత్తాన్ని కట్టేందుకు పొదుపు ద్వారా రూ.10వేలు తీసుకుంటే ఆ రుణాన్ని 10 నెలల్లో నెలకు రూ.1,100 చెల్లించాలని విశాఖ జిల్లా నక్కపల్లిలో వెలుగు అధికారులు లబ్ధిదారులకు చెబుతున్నారు. అంటే 10 నెలల్లో అదనంగా రూ.1000 చెల్లించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు