Strike: మేము సైతం సమ్మెకు..
ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. సమ్మెకు అన్ని సంఘాల నుంచీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, వైద్య-ఆరోగ్య శాఖల ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యమానికి సంఘీభావంగా
సై అన్న ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖల ఉద్యోగులు
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన రిలే దీక్షలు
3న చలో విజయవాడ.. బీఆర్టీఎస్ రోడ్డులో సభ
ఈనాడు - అమరావతి
ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. సమ్మెకు అన్ని సంఘాల నుంచీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, వైద్య-ఆరోగ్య శాఖల ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యమానికి సంఘీభావంగా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 30 వరకు ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉద్యోగులు రిలే దీక్షలు చేశారు. కొన్ని జిల్లాల్లో పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నెల్లూరులో జరిగిన దీక్షలకు ఉద్యోగినులు భారీగా హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 3న నిర్వహించే ‘చలో విజయవాడ’ను విజయవంతం చేసేందుకు సాధన సమితి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో రాష్ట్రవ్యాప్తంగా వేల మందితో సభ నిర్వహించాలని పట్టుదలతో ఉన్నారు. ఇదేసమయంలో పాత జీతాలే చెల్లించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డీడీవోలకు ఉద్యోగులు లక్షల అభ్యర్థన పత్రాలను సమర్పించారు. ఎస్జీటీ ఉపాధ్యాయులు ఎంఈవోలకు, స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులకు పత్రాలను ఇచ్చారు.
గిరిజన గురుకులాల ఉపాధ్యాయుల మద్దతు
పీఆర్సీ సాధన సమతి ఉద్యమానికి తాము మద్దతు తెలియజేస్తున్నట్లు గిరిజన సంక్షేమ గురుకులాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, బోధనేతర, పొరుగు సేవల సిబ్బంది తెలిపారు.
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నం
ఏదోవిధంగా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదని తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రభుత్వానికి మూడు డిమాండ్లపై ఇప్పటికే స్పష్టంగా లేఖ ఇచ్చాం. ఐఆర్ను ఇచ్చినట్లు ఇచ్చే వెనక్కి తీసుకున్న చరిత్ర ప్రభుత్వానిది. ఇంత దారుణంగా ఉద్యోగ సంఘాలను అవమానపర్చడాన్ని ఎప్పుడూ చూడలేదు. జీతాలు చెల్లించకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అసహనం వచ్చి, ఉద్యమం నీరుగారుతుందని భావిస్తున్నారేమో.. అదేమీ ఉండదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాత జీతాలనే ఇవ్వాలి. మేం చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఎవరికీ లొంగలేదు. మా వెనుక ఉద్యోగులు తప్ప ఎవరూ లేరు.
-ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
మీరు మెట్లు దిగాల్సిన అవసరంలేదు
మీరు మెట్లు దిగాల్సిన అవసరం లేదు. మీ పీఠంపైనే కూర్చోండి. 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించుకోవాలంటే మూడు డిమాండ్లు అమలు చేసి, చర్చలకు పిలవండి. సినిమాటిక్, నాటకీయ ప్రకటనలు పక్కనపెట్టి, ఆచరణాత్మక పరిష్కారం చూడాలి. సర్కారు వేసిన కమిటీ సమస్యలను పరిష్కరించేది కాదు. కేవలం మాతో చర్చించి, ఆ విషయాలను సీఎంకు చెప్పే కమిటీ మాత్రమే. మా డిమాండ్లను సాకుగా చూపి జీతాలను ఆపేందుకు, ఆ డబ్బులను పథకాలకు మళ్లించుకునేందుకు ఇలా చేస్తోంది. రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. కాగితాలపై పుట్టుకొచ్చిన సంఘాలతో చర్చించి, న్యాయం చేసినా మంచిదే.
-ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
వైషమ్యాలు సృష్టించేందుకు కుట్ర
బండి శ్రీనివాసరావు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఉద్యోగ సంఘాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. నాలుగు ఐకాసలు, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను రెండో రోజైన శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ... ‘‘పీఆర్సీ అంటూ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నారు. నాలుగు సంఘాలు ఏకతాటిపై ఉన్నాయి. జీతాలు చెల్లించేందుకు కొందరు డీడీవోలు, కలెక్టర్లు ప్రయత్నిస్తున్నారు. పరిధి దాట్టొదు.. మీ ప్రవర్తనను అదుపులో పెట్టుకోవాలి. మాకు పాత జీతాలు ఇస్తే చాలు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలకు వస్తాం’ అని స్పష్టంచేశారు.
ఉద్దేశపూర్వకంగా కరపత్రాలు
మాకు, ప్రజలకు మధ్య యుద్ధం కల్పించాలనే ఉద్దేశంతో కరపత్రాలు ముద్రించారు. ఆర్టీసీ, వైద్యశాఖ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కొవిడ్ సమయంలో వైద్యం అందక ఎవరైనా చనిపోతే దానికి ప్రభుత్వానిదే బాధ్యత.
-ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి శివారెడ్డి
డీడీవోలపై చర్యలు తీసుకుంటే... ఆ క్షణం నుంచే సమ్మె
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వం సామరస్య పూర్వకంగా వ్యవహరించకుండా ఉద్యోగులను రెచ్చగొడుతోందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. చర్చల పేరిట కొన్ని సంఘాలను పిలిపించి మాట్లాడినంత మాత్రాన ఆ సంఘాలు ఉద్యమాన్ని ఆపుతాయా? అని ప్రశ్నించారు. కొత్త జీతాల బిల్లులు చేయాలని ఖజానా ఉద్యోగులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి వారిపై చర్యలు తీసుకుంటే... ఆ క్షణం నుంచే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈమేరకు ఏపీ సచివాలయంలో ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం భోజన విరామ సమయంలో... రివర్స్ పీఆర్సీని నిలిపేయాలని నినాదాలు చేస్తూ వెనక్కి నడిచారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... ‘‘కొత్త జీతంలో అయిదు డీఏలు కలపడంవల్ల కొంత జీతం పెరిగితే, ఉద్యోగులు నిరసన తెలపరని భావిస్తున్నట్లుంది. ఉద్యోగులు అమాయకులు కాదు. పీఆర్సీపై చర్చల పేరిట కొన్ని సంఘాలను ప్రభుత్వం వేసిన కమిటీ పిలిపించుకుని మాట్లాడింది. ఉద్యోగ సంఘాల్లో చీలిక తీసుకురావాలన్నదే వారి ఉద్దేశం. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నాం. ప్రతిరోజూ కనీసం వంద మంది పాల్గొంటారు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్