APSRTC: ఏ క్షణమైనా ఆర్టీసీ రథచక్రాలు నిలిపేస్తాం
‘ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే కొత్త సౌకర్యాలు, కొత్త పింఛను, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు వస్తాయని ఆశ పడ్డాం. ఏవీ నెరవేరడం లేదు. అసలు విలీనం
విలీనం ఎందుకు కోరుకున్నామని బాధపడే పరిస్థితి
పాత పింఛను లేని విలీనం ఎందుకు?
ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు
ఈనాడు, అమరావతి: ‘ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే కొత్త సౌకర్యాలు, కొత్త పింఛను, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు వస్తాయని ఆశ పడ్డాం. ఏవీ నెరవేరడం లేదు. అసలు విలీనం ఎందుకు కోరుకున్నామా? అని బాధపడే పరిస్థితి నెలకొంది. పీఆర్సీ సాధన సమితి పిలుపునిస్తే ఏక్షణమైనా ఎక్కడికక్కడ ఆర్టీసీ రథచక్రాలు నిలిపేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగసంఘాల ఐక్యవేదిక నేతలు తెలిపారు. ఉద్యమానికి మద్దతు తెలిపి, సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలన్నీ ఐక్యవేదికగా ఏర్పడి శుక్రవారం విజయవాడలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడారు. ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, దామోదరరావు మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పటికే చాలీచాలని జీతాలు ఉన్నాయి. ప్రభుత్వ రివర్స్ పీఆర్సీ వల్ల ఆర్టీసీ ఉద్యోగులు మరింత నష్టపోతారు. ఆర్టీసీలో నాలుగేళ్లకు పీఆర్సీ ఉండేది. ఇపుడు ప్రభుత్వంలో పదేళ్లకు చేశారు. రెండు పీఆర్సీలను ఆర్టీసీ ఉద్యోగులు కోల్పోయినట్లే. ఉద్యోగుల సెటిల్మెంట్లు ఆగిపోయాయి. 2017లో 25% ఫిట్మెంట్తో మాకు పీఆర్సీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మాకంటే 2% తక్కువ ఫిట్మెంట్ ఇచ్చారు. ఉద్యోగుల పట్ల సీఎం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది’ అని తెలిపారు. ఎన్ఎంయూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఉద్యోగులకు 2004కు ముందున్న పాత పింఛను వస్తుందని ఆర్టీసీ ఉద్యోగులు విలీనం కోరుకున్నారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. 32వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతినెలా సాయం అందించే ఎస్ఆర్బీఎస్ను రద్దుచేశారు. రివర్స్ పీఆర్సీతో ఆర్టీసీ ఉద్యోగులకు నష్టం కలుగుతోంది. సమ్మెలోకి వెళ్లేలా ఏకగ్రీవ తీర్మానం చేశాం’ అన్నారు. ఎస్డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ ‘16 రాష్ట్రాల్లో ఆర్టీసీలను ప్రభుత్వం నడుపుతోంది. అక్కడ వారికి పింఛను ఇస్తున్నారు. అయిదు డీఏలు కోల్పోయాం. విలీనం అనంతరం వైద్యసేవలూ నిలిపేశారు’ తెలిపారు. పాత పింఛను మంజూరు మన ప్రధాన డిమాండ్ కావాలని కార్మికపరిషత్ నేత శ్రీనివాసరావు కోరారు. ఈ ఉద్యమ ఆవశ్యకతను ప్రతిఉద్యోగికి తెలియజేయాలని సూపర్వైజర్ల సంఘం నేత విష్ణారెడ్డి తెలిపారు. ఓస్వా నేత థామస్ మాట్లాడుతూ పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని చెప్పారు. తమకు చాలీచాలని పింఛను ఉందని, కనీసం తెల్లరేషన్ కార్డులు మంజూరు అయ్యేలా చూడాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత ఆంజనేయులు కోరారు.
ఆర్టీసీ ఐకాస ఏర్పాటు: ఈ సమావేశంలో ఆర్టీసీ సంఘాలతో ఐకాస ఏర్పాటుచేశారు. దీనికి కన్వీనర్లుగా వై.శ్రీనివాసరావు, దామోదరరావులను నియమించారు. సీఎస్కు, ఆర్టీసీ ఎండీకి వేర్వేరుగా సోమవారం మెమోరాండం ఇవ్వాలని, ఫిబ్రవరి 5, 6 తేదీల్లో అన్ని డిపోల వద్ద గేట్ మీటింగ్లు పెట్టి ఉద్యోగులను సమ్మెకు కార్యోన్ముఖులను చేయాలని నిర్ణయించారు.సమావేశంలో పీఆర్సీ సాధన సమితి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, శివారెడ్డి హాజరై మాట్లాడారు.
ఏపీ ఐకాస అమరావతికి వీఆర్ఏల మద్దతు
విజయవాడ సబ్కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఏపీ ఐకాస అమరావతి సంఘం చేపట్టిన ఉద్యమానికి, గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏల) రాష్ట్ర సంఘం నాయకులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈమేరకు విజయవాడలోని రెవెన్యూ భవన్లో శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొందిపల్లి జయరాజు, ప్రధాన కార్యదర్శి బళ్ల వెంకట్రావు, ఉపాధ్యక్షుడు వై.అప్పలస్వామి, 13 జిల్లాల ప్రతినిధులు సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఏపీ ఐకాస అమరావతి సంఘానికి తమ మద్దతు తెలియజేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి