Pegasus:మళ్లీ పెగాబుస్!
దేశాన్ని కుదిపేసిన ‘పెగాసస్’ గూఢచౌర్య సాఫ్ట్వేర్ విషయంలో... ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తాజాగా మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టింది! భారత్-ఇజ్రాయెల్ మధ్య 2017లో కుదిరిన రూ.15 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందంలో పెగాసస్
పెగాసస్ను 2017లోనే కొన్నారు
భారత్-ఇజ్రాయెల్ రక్షణ ఒప్పందంలో ఇది భాగమే...
న్యూయార్క్ టైమ్స్ తాజా నివేదిక భగ్గుమన్న విపక్షాలు
బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామని హెచ్చరిక
మోదీ సర్కారు దేశద్రోహానికి పాల్పడిందన్న రాహుల్ గాంధీ
న్యూయార్క్, దిల్లీ: దేశాన్ని కుదిపేసిన ‘పెగాసస్’ గూఢచౌర్య సాఫ్ట్వేర్ విషయంలో... ప్రముఖ అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తాజాగా మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టింది! భారత్-ఇజ్రాయెల్ మధ్య 2017లో కుదిరిన రూ.15 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందంలో పెగాసస్ కూడా ముఖ్య భాగమేనని పేర్కొంది. ఈ మేరకు ‘ప్రపంచపు అత్యంత శక్తిమంతమైన సైబర్ ఆయుధం కోసం పోరాటం’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్వో అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ను ఉపయోగించి... భారత్ సహా పలుదేశాల ప్రభుత్వాలు విపక్ష నేతలపైనా, పాత్రికేయులపైనా, హక్కుల నేతలపైనా, న్యాయమూర్తులపైనా నిఘా ఉంచినట్టు గత ఏడాది అంతర్జాతీయ మీడియా వెల్లడించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరిన్ని వివరాలు బయటకురావడం తేనెతుట్టెను కదిపినట్టయింది.
కథనంలో ఏముంది?
‘‘ఎన్ఎస్వో సంస్థ 2011 నుంచే పెగాసస్ స్పైవేర్ను ప్రపంచ వ్యాప్తంగా నిఘా సంస్థలకు విక్రయిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలేవీ తమలాంటి సాఫ్ట్వేర్ను ఇవ్వలేవని... ఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోని ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను కూడా తమ స్పైవేర్ అత్యంత సమర్థంగా వెల్లడించగలదని బల్ల గుద్ది చెబుతోంది.
భారత్... దశాబ్దాల తరబడి పాలస్తీనా పట్ల సానుకూల వైఖరితో ఉండేది. ఇజ్రాయెల్తో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ 2017 జులైలో ఇజ్రాయెల్లో పర్యటించారు. నాటి ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అత్యంత స్నేహపూర్వకంగా మెలిగారు. ఇద్దరూ చెప్పుల్లేకుండా అక్కడి సముద్రతీరాన వాహ్యాళికి కూడా వెళ్లారు. వారి మధ్య అంత సుహృద్భావ వాతావరణం ఉండటానికి కారణం- రక్షణ ఒప్పందం! దీని విలువ సుమారు రూ.15 వేల కోట్లు (2 బిలియన్ డాలర్లు). మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టేందుకు దోహదపడే పెగాసస్ స్పైవేర్, అత్యాధునిక క్షిపణి వ్యవస్థలే ప్రధానంగా రెండు దేశాలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తర్వాత కొన్ని మాసాలకు నెతన్యాహు కూడా భారత్ విచ్చేశారు. ఈ క్రమంలోనే, పాలస్తీనా మానవ హక్కుల సంస్థకు పరిశీలక హోదాను నిరాకరించాలంటూ ఇజ్రాయెల్ 2019 జూన్లో ఐరాస ఆర్థిక-సామాజిక మండలిలో ప్రతిపాదించింది. దీనికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది!
ఎఫ్బీఐదీ అదేదారి.. కానీ..
అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) కూడా పెగాసస్ను సమకూర్చుకుంది. అయితే, ఫర్బిడెన్ స్టోరీస్ అనే వార్తా సంస్థల కన్సార్షియం...ఈ స్పైవేర్ను పాత్రికేయులపైనా, విపక్ష నేతలపైనా ఎలా ప్రయోగిస్తున్నారన్న విషయాలను వెలుగులోకి తెచ్చింది. దీంతో ఈ సైబర్ ఆయుధాన్ని వినియోగించకూడదని ఎఫ్బీఐ నిర్ణయం తీసుకొంది. ఐరోపా నిఘా అధికారులు మొదట్లో పెగాసస్ సాయంతో నేరస్థులు, ఉగ్రవాదుల కమ్యూనికేషన్ను ఛేదించారు. కాలక్రమంలో దీన్ని దుర్వినియోగం చేయడం పెరిగింది. మెక్సికో, యూఏఈ, సౌదీఅరేబియా తదితర చోట్ల ఇదే జరిగింది’’ అని న్యూయార్క్ టైమ్స్ వివరించింది. కాగా- విదేశాల్లో పనిచేస్తున్న తమ దౌత్య అధికారుల ఫోన్లను పెగాసస్ సాయంతో హ్యాక్ చేశారని ఫిన్లాండ్ విదేశాంగశాఖ శనివారం వెల్లడించింది.
దుమారం మొదలైంది ఇలా...
కొన్నిదేశాలు పెగాసస్ను ఉపయోగించి రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్టు అంతర్జాతీయ మీడియా గత ఏడాది వెల్లడించడం తీవ్ర అలజడికి దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.. ఇలా సుమారు 300 మంది ఫోన్లను స్పైవేర్తో హ్యాక్ చేసినట్టు అప్పట్లో ‘ది వైర్’ పేర్కొంది. దీంతో ఈ అంశం పార్లమెంటునూ కుదిపేసింది. ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది. ఆ వార్తల్లో నిజంలేదని చెప్పుకొచ్చింది. చివరికి ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరగా... పెగసస్ను వినియోగించారా? లేదా? అన్న విషయమై విచారణ జరిపేందుకు జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వాన విచారణ కమిటీని ఏర్పాటుచేసింది. ఎన్ఎస్వోకు, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదని కేంద్రం చెబుతున్న క్రమంలో... న్యూయార్క్ టైమ్స్ తాజా కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రభుత్వాలకే విక్రయిస్తున్నాం: ఎన్ఎస్వో
ఉగ్రవాదాన్ని, నేరాలను నియంత్రించడం కోసం పెగాసస్ను కేవలం ప్రభుత్వాలకే విక్రయిస్తున్నామని ఎన్ఎస్వో సంస్థ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ రక్షణశాఖ ఆమోదం తెలిపిన తర్వాతే దీన్ని అందిస్తున్నట్టు వెల్లడించింది. ఫోన్లోని డేటాపై దీనికి నియంత్రణ ఉండదని పేర్కొంది. పెగాసస్ను దుర్వినియోగం చేసినట్టు తెలియడంతో కొన్ని కాంట్రాక్టులను రద్దుచేసుకున్నట్టు వివరించింది.
అది సుపారీ మీడియా: జనరల్ వీకే సింగ్
న్యూయార్క్ టైమ్స్ కథనంపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ మండిపడ్డారు. ‘‘అది పూర్తిగా నిరాధార కథనం. ఆ సంస్థను నమ్ముతున్నారా? అదొక సుపారీ మీడియా’’ అంటూ ట్వీట్ చేశారు. పెగాసస్ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ దర్యాప్తు చేస్తోందని, నివేదిక ఇంకా రావాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్కు అనుకూలంగా ఐరాస ఆర్థిక-సామాజిక మండలిలో భారత్ ఓటు వేయడాన్ని వక్రీకరించడం చెత్త వ్యవహారమని ఐరాసలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలపై నిఘా పెట్టారు
మన ప్రాథమిక ప్రజాస్వామ్య వ్యవస్థలపైనా, విపక్ష నేతలపైనా, ప్రభుత్వ అధికారులపైనా, న్యాయాధికారులపైనా, సాయుధ దళాలపైనా నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెగాసస్ను కొనుగోలు చేసింది. అందరి ఫోన్లనూ ట్యాప్ చేశారు. మోదీ సర్కారు దేశద్రోహానికి పాల్పడింది.
- రాహుల్ గాంధీ
* పెగాసస్ విషయంలో ప్రభుత్వం పార్లమెంటును మోసగించింది. సుప్రీంకోర్టునూ తప్పుదోవ పట్టించింది. ఉద్దేశపూర్వకంగా మోసగించడంపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ చేపట్టాలి.
- రణ్దీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి
* ప్రభుత్వానికి ధైర్యముంటే.. న్యూయార్క్ టైమ్స్పై పరువునష్టం కేసు వేయాలి.
- మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో విపక్ష నేత
* ప్రతిపక్ష నేతలపైనా, పాత్రికేయులపైనా నిఘా పెట్టడానికి పెగాసస్ను ఉపయోగించారు.భాజపాతోనే అది సాధ్యం. వారు దేశాన్ని బిగ్బాస్ షోగా మార్చేశారు.
- శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది
* సైబర్ ఆయుధాన్ని ఎందుకు కొన్నారు? దాన్ని ఉపయోగించడానికి ఎవరు అనుమతిచ్చారు? కొందరిని ఎందుకు లక్ష్యంగా చేసుకుని దీన్ని ఉపయోగించారు? అన్నది ప్రభుత్వం వెల్లడించాలి. మౌనం వహించడమంటే నేరాన్ని అంగీకరించడమే.
-సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి
* పార్లమెంటు సమావేశాలప్పుడు పెగాసస్కు సంబంధించి ప్రభుత్వం నిజాలు దాచిపెట్టింది. అవి ఇప్పుడు బయటకు వచ్చాయి. ప్రభుత్వం వీటికి సమాధానాలు చెప్పాలి.
-డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్