AP PRC: ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం
మూడేళ్లుగా ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల పేరుతో మరోమారు మోసపోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఒకటో తేదీకి పాత జీతాలు వేయకపోతే
ఇక దేనికీ భయపడం.. వ్యవస్థను స్తంభింపజేస్తాం
ఒకటో తేదీకి పాతజీతాలు వేయకపోతే సహించం
పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు
ఈనాడు- అమరావతి, విశాఖపట్నం, న్యూస్టుడే- విజయనగరం, నెల్లూరు: మూడేళ్లుగా ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల పేరుతో మరోమారు మోసపోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఒకటో తేదీకి పాత జీతాలు వేయకపోతే ఆ తరువాత పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. విశాఖపట్నం, విజయనగరాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షల శిబిరాలను శనివారం ఆయన సందర్శించి మాట్లాడారు. ఫిబ్రవరి 3న లక్షల మందితో చలో విజయవాడను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రుల కమిటీ చర్చలకు పిలిచినా ఉద్యోగ సంఘాల నేతలు రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తొమ్మిది మంది ప్రతినిధుల బృందం చర్చలకు వెళ్లామని, నలుగురు నేతలు నిర్ణయించుకుని లిఖితపూర్వకంగా తమ డిమాండ్లను ఇచ్చామని చెప్పారు. వాటికి సమాధానం చెబితే తాము చర్చలకు సిద్ధమేనన్నారు. 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల నమ్మకాన్ని ఈ ప్రభుత్వం పోగొట్టుకుందని తెలిపారు. అశుతోష్ మిశ్ర నివేదికను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి భారంగా ఉన్న రూ.10 వేల కోట్లు తమకొద్దని, పాత జీతాలివ్వండి చాలని పేర్కొన్నారు. రూ.1800 కోట్ల సప్లిమెంటరీ బిల్లులు, రూ.2100 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. మా జీతాల్లో కోతలు వేసి, ప్రభుత్వం ఆ డబ్బులు మిగుల్చుకుంటోందని విమర్శించారు. పీఆర్సీ సమస్య పరిష్కారమైతే ఉద్యోగుల్లో ఆవేదన, ఆవేశం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తే అదంతా భ్రమేనన్నారు. ఎందుకంటే ఈ ఉద్యమం పీఆర్సీతోపాటు సీపీఎస్ రద్దు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొహిబిషన్ డిక్లరేషన్ వంటి ఇతర అంశాలపైనా చేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వమే తగిన మూల్యం చెల్లించుకోవాలి
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అశుతోష్ మిశ్ర రిపోర్టు ప్రకారం పీఆర్సీ ఇస్తామని.. ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని పీఆర్సీ సాధన సమితి నేత, ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం నెల్లూరులో కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల రిలే నిరాహార దీక్షను ప్రారంభించి మాట్లాడారు. సాక్షాత్తు మంత్రులే 12సార్లు సమావేశాలు నిర్వహించి తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అన్యాయం చేసేలా పీఆర్సీ రిపోర్టును ముఖ్యమంత్రి చదివి వెళ్లారన్నారు. ఈ ఉద్యమం ఉద్యోగుల గుండెల్లో నుంచి పుట్టిందని, తమకు నమ్మకం కలిగిస్తే చర్చలకు సిద్ధమన్నారు. మంత్రులు ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగులపై ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకు బజారున పడ్డామని, ఈ ఘనత ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. చర్చలకు కూడా తలుపులు మూసేశామని చెబుతున్న ఘనతా సర్కారుదేనన్నారు. తాము రాజకీయాలు చేయడం లేదని, తమకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. లక్షల మంది ఉద్యోగులతో ఫిబ్రవరి 3న చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. దేనికీ భయపడే ప్రసక్తే లేదని, సమ్మె చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సచివాలయంతో పాటు మొత్తం వ్యవస్థను స్తంభింపజేస్తామని, దీనికి తగిన మూల్యం ప్రభుత్వమే చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
* ఉద్యోగుల సమ్మెను పకడ్బందీగా నిర్వహించేందుకు పీఆర్సీ సాధన సమితి నాయకులు జిల్లాల పర్యటనలు చేపట్టారు. ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించగా.. ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు శనివారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రిలే దీక్షల్లో పాల్గొన్నారు. మిగతా నాయకులూ జిల్లాలకు వెళ్లి, ఫిబ్రవరి 3న చలో విజయవాడ, ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లడంపై ఉద్యోగులను సమాయత్తం చేస్తున్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా శనివారం రిలే దీక్షలు కొనసాగాయి. ప్రకాశంలో మహిళలు అధికంగా హాజరయ్యారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా ఉద్యోగులే దీక్ష చేశారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం పోలవరం జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిరసన తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్లోని ఒప్పంద, పొరుగుసేవల ఐకాస ఉద్యమానికి మద్దతు తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు దీక్షల్లో పాల్గొన్నారు. రిలే దీక్షలు ఆదివారంతో ముగియనున్నాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ.. పీఆర్సీ సాధన సమితిలో లేని ఇతర సంఘాలతో జరిపిన చర్చల్లో ఏం హామీ ఇచ్చారో బహిర్గతం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఫిట్మెంట్ పెంచుతామని చెప్పారా? హెచ్ఆర్ఏ పాత శ్లాబులు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఏ సంఘాలతో చర్చలు జరిపినా పర్వాలేదని, తమ డిమాండ్లు పరిష్కరిస్తే చాలని ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు వెల్లడించారు. పింఛన్లను కొత్త పీఆర్సీ ప్రకారం చేస్తున్నారని, వాటిని వెబ్సైట్లో పెట్టారని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుమూర్తి, పాండురంగ వరప్రసాద్ తెలిపారు. 2018 జులై తర్వాత పదవీవిరమణ పొందిన వారికి పాత పీఆర్సీ ప్రకారమే పింఛను చేసి, మధ్యంతర భృతి తొలగించారని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.