AP High Court Judges: ఏపీ హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు, ఒడిశా హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసింది. వీరంతా న్యాయవాదులే కావడం విశేషం. మధ్యప్రదేశ్ హైకోర్టుకు న్యాయవాదుల నుంచి ముగ్గురు, జ్యుడీషియల్ అధికారుల నుంచి
సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
ఈనాడు-దిల్లీ, అమరావతి: ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు, ఒడిశా హైకోర్టుకు నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేసింది. వీరంతా న్యాయవాదులే కావడం విశేషం. మధ్యప్రదేశ్ హైకోర్టుకు న్యాయవాదుల నుంచి ముగ్గురు, జ్యుడీషియల్ అధికారుల నుంచి ముగ్గుర్ని న్యాయమూర్తులుగా నియమించాలనీ ప్రతిపాదించింది. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మునీశ్వర్ భండారీకి పదోన్నతి కల్పించి అక్కడే శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. జనవరి 29న సమావేశమైన కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఏపీ హైకోర్టు కొలీజియం.. న్యాయమూర్తుల నియామకానికి గతేడాది న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. ఇందులో ఏడుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు పంపింది. వీరిలో న్యాయవాదులు కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, తర్లాడ రాజశేఖర్రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీమలపాటి, వడ్డిబోయిన సుజాత ఉన్నారు. నిరుడు నవంబర్ 11న హైకోర్టుకు అడ్వొకేట్ విభాగం నుంచి కె.మన్మథరావు, జ్యుడీషియల్ ఆఫీసర్ల నుంచి బీఎస్ భానుమతి పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం ఇప్పుడు ఒకేసారి ఏడుగురు కొత్త న్యాయమూర్తుల నియామకాలకు పచ్చజెండా ఊపడం విశేషం. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. తాజా సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఆ సంఖ్య 27కి చేరుతుంది.
కొనకంటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్లో 1966 జూన్ 3న జన్మించారు. తల్లిదండ్రులు రామలక్ష్మి, లక్ష్మిరెడ్డి. శ్రీనివాసరెడ్డి పాఠశాల విద్యాభ్యాసం హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో సాగింది. హైదరాబాద్లోని నాగార్జున జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1991 ఆగస్టు 11న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ప్రముఖ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి వద్ద జూనియర్గా చేరి న్యాయవాద వృత్తిలో, ముఖ్యంగా క్రిమినల్ విభాగంలో మెలకువలు నేర్చుకున్నారు. తర్వాత పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. ప్రస్తుతం హైకోర్టులో రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా పనిచేస్తున్నారు.
తర్లాడ రాజశేఖరరావు
1967 ఆగస్టు 3న శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం, మూలసవలాపురంలో కల్యాణి, సురన్నాయుడు దంపతులకు జన్మించారు. ఎన్బీఎం కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1993 ఆగస్టు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వీవీఎస్ రావు న్యాయవాదిగా ఉన్న సమయంలో ఆయన వద్ద జూనియర్గా చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు, ప్రస్తుతం ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ప్రజాహిత వ్యాజ్యాలతో పాటు క్రిమినల్, సివిల్ కేసులు వాదించిన అనుభవం ఉంది. దివంగత జస్టిస్ టీసీహెచ్ సూర్యారావు.. రాజశేఖరరావుకు బంధువు.
చీమలపాటి రవి
విశాఖపట్నంలో 1967 డిసెంబర్ 4న జన్మించారు. బీకాం, బీఎల్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. 1995లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. విశాఖ జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న తండ్రి శ్రీరామమూర్తితో కలిసి అక్కడే వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. సోదరుడూ న్యాయవాదే. ఏడాదిన్నర తర్వాత హైదరాబాద్లోని ఉమ్మడి హైకోర్టుకు ప్రాక్టీసు మార్చుకున్నారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, రాజ్యాంగ సంబంధ వ్యాజ్యాల్లో న్యాయవాదిగా పేరుగడించారు. మూడేళ్లపాటు పంచాయతీరాజ్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2019లో ఏపీ హైకోర్టుకు ప్రాక్టీసు మార్చారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేస్తున్నారు. న్యాయవాదిగా పాతికేళ్లకు పైగా అనుభవంతో వివిధ చట్టాలపై అపార అనుభవం సాధించారు.
నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలో అంజమ్మ, రామకృష్ణారావు దంపతులకు 1967 జులై 1న జన్మించారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి బీకాం చదివారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎల్ పూర్తి చేశారు. 1992 జూన్ 30న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు, అమరావతి హైకోర్టులో న్యాయవాదిగా మొత్తం 26 ఏళ్ల అనుభవం గడించారు. సివిల్, క్రిమినల్, సర్వీసు సంబంధ తదితర విభాగాలకు సంబంధించిన కేసుల్లో కీలక వాదనలు వినిపించారు. 2014 డిసెంబర్ నుంచి 2019 జూన్ వరకు ఆంధ్రా ప్రాంత మున్సిపాలిటీలకు స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు. 2015-16లో భారత వైద్యమండలికి స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు.
సత్తి సుబ్బారెడ్డి
పశ్చిమగోదావరి జిల్లా ఆరవల్లిలో 1970లో సుబ్బారెడ్డి జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 1986-89లో బీఏ చదివారు. అక్కడి నుంచే 1993లో ఎల్ఎల్బీ పూర్తి చేసి పట్టా అందుకున్నారు. ఐఆర్పీఎంలో పీజీ డిప్లొమా పొందారు. 1994 జూన్ 22న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1997 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం న్యాయస్థానంలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. సీనియర్ న్యాయవాది వీఎల్ఎన్ గోపాలకృష్ణమూర్తి వద్ద జూనియర్గా పనిచేశారు. హైకోర్టులో క్రిమినల్, రాజ్యాంగ, సర్వీసు సంబంధ కేసులతోపాటు ముఖ్యంగా సివిల్ కేసుల్లో అనుభవం గడించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథార్టీకి స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు.
వడ్డిబోయిన సుజాత
1966 సెప్టెంబర్ 10న సుజాత జన్మించారు. స్వస్థలం గుంటూరు. తండ్రి వాయుసేన ఉద్యోగి కావడంతో దిల్లీ కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఎంఏ, ఎల్ఎల్ఎం విద్యార్హతలు సాధించారు. 1998లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాదులు ఏవీ శివయ్య, భాస్కరలక్ష్మి వద్ద జూనియర్గా పనిచేశారు. రాజ్యాంగ సంబంధ కేసుల్లో పేరుగడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్యానల్ న్యాయవాదిగా పనిచేశారు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథార్టీకి న్యాయవాదిగా వ్యవహరించారు. ఏపీ హైకోర్టులో ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా పనిచేస్తున్నారు.
గన్నమనేని రామకృష్ణ ప్రసాద్
ప్రకాశం జిల్లా పూనూరులో విజయలక్ష్మి, గాంధీ చౌదరి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గుంటూరు నల్లపాడు లయోలా పబ్లిక్స్కూల్లో జరిగింది. బీకాం చదివి, గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో ఎల్ఎల్బీ, నాగార్జున యూనివర్శిటీలో ఎల్ఎల్ఎం చేశారు. 1991 ఆగస్టు 27న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1996 నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 2000లో సుప్రీంకోర్టులో అడ్వొకేట్ ఆన్ రికార్డ్ హోదా పొందారు. 2017 నుంచి సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టుల్లో రాజ్యసభ సెక్రటేరియట్, రాజ్యసభ టీవీ స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందిస్తున్నారు. వివిధ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరఫున సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిషియల్ లిక్విడేటర్గానూ వ్యవహరించారు. నాగాలాండ్- అసోంల సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో నాగాలాండ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సేవలందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?