Union Budget 2022: డిజిటల్ భారతం
ఆర్థిక చక్రం గాడితప్పకుండా.. ఈ పరిస్థితులు ఇలా సాగితే చాలన్న రక్షణాత్మక ధోరణిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రదర్శించారు. దేశాన్ని డిజిటల్ బాట పట్టించేందుకు పలు ప్రతిపాదనలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.39.45 లక్షల కోట్ల అంచనాతో కేంద్ర బడ్జెట్ను ఆమె మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. 35% వృద్ధితో రూ.7.5 లక్షల కోట్ల మూలధన వ్యయం చేస్తామని ప్రకటించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణం సమకూర్చనున్నట్లు భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది ఖర్చుచేయబోయే మొత్తంలో
స్పెక్ట్రం వేలంతో అందుబాటులోకి రానున్న 5జీ
వచ్చే ఏడాది నుంచి వర్చువల్ డిజిటల్ కరెన్సీ
క్రిప్టో లావాదేవీలపై 30% పన్ను
విద్యార్థులకు పాఠాల కోసం 200 టీవీ ఛానళ్లు
కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి లక్షన్నర తపాలా కార్యాలయాలు
దేశమంతటా ఏకీకృత రిజిస్ట్రేషన్ విధానం
వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల పిచికారీకి డ్రోన్లు
ఆర్థిక వ్యవస్థకు ఏడు చోదక శక్తులు
కొత్తగా 25 వేల కి.మీ. జాతీయ రహదారులు
మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు
వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన
వృద్ధిరేటు 8-8.5% మధ్య.. ద్రవ్యలోటు 6.4% అని అంచనా
నదుల అనుసంధానానికి అడుగులు
2022-23 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులేదు.. కొత్త పన్నులూ లేవు
ఈనాడు - దిల్లీ
ఆర్థిక చక్రం గాడితప్పకుండా.. ఈ పరిస్థితులు ఇలా సాగితే చాలన్న రక్షణాత్మక ధోరణిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రదర్శించారు. దేశాన్ని డిజిటల్ బాట పట్టించేందుకు పలు ప్రతిపాదనలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.39.45 లక్షల కోట్ల అంచనాతో కేంద్ర బడ్జెట్ను ఆమె మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. 35% వృద్ధితో రూ.7.5 లక్షల కోట్ల మూలధన వ్యయం చేస్తామని ప్రకటించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణం సమకూర్చనున్నట్లు భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది ఖర్చుచేయబోయే మొత్తంలో దాదాపు 42% మొత్తాన్ని అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి రావడంతో ఆచితూచి అడుగులేశారు. మోదీ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శల జడివాన కురుస్తుండటంతో విత్తమంత్రి తన ప్రసంగంలో 18 సార్లు ఉపాధి, ఉద్యోగాల కల్పన గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ పదే పదే చెబుతున్న మౌలిక వసతుల అంశాన్ని 28 సార్లు వల్లెవేశారు. ప్రభుత్వ ప్రధాన నినాదాలైన గతిశక్తి గురించి 13 సార్లు, ఆత్మనిర్భరత గురించి 5 సార్లు ప్రస్తావించి తమ ప్రాధాన్యాలేంటో చెప్పకనే చెప్పారు. రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. రూ.5.25 లక్షల కోట్లు (పింఛన్లతో కలిపి) కేటాయించారు. గత సంవత్సరం కేటాయింపు కంటే ఇది దాదాపు 10% అదనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.2% ఉంటుందని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది కొంత తగ్గి 8-8.5% మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. ద్రవ్యలోటు జీడీపీలో 6.9% ఉంది. దాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.4%కు, 2025-26 నాటికి 4.5%కు తెస్తామని చెప్పారు. మొత్తమ్మీద ద్రవ్య స్థిరీకరణ కంటే ఆర్థికవ్యవస్థ విస్తరణకే ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చిందన్నది ఆర్థిక నిపుణుల విశ్లేషణ.
అన్ని రంగాలూ డిజిటల్ దారిలోనే.. డిజిటలీకరణకు ఆర్థికమంత్రి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. విద్య, వైద్యం, ఆర్థికం, వ్యవసాయం... ఇలా అన్ని రంగాలనూ డిజిటల్ సాంకేతికత దారిలోకి తీసుకెళ్లనున్నట్లు సంకేతమిచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వర్చువల్ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెస్తామన్నారు. దేశంలో క్రిప్టో మార్కెట్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలు, ఎన్ఎఫ్టీ (నాన్ ఫంజిబుల్ టోకెన్లు) లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి 30% పన్ను విధిస్తామన్నారు. అంకుర సంస్థలకు పన్ను విరామం 2023 మార్చి 31 వరకు కొనసాగిస్తామన్నారు. త్వరలో ఈ-పాస్పోర్టు విధానం అమలులోకి రానుంది. దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి వీలుగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకం అమలుచేస్తామని ప్రకటించారు. వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల పిచికారీకి డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇంటి వద్దే నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు పాఠాల కోసం 200 టీవీ ఛానళ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోనే దేశంలో 5జీ టెలికాం సర్వీసులకు శ్రీకారం చుట్టేలా అవసరమైన స్పెక్ట్రం వేలం వేయబోతున్నట్లు వెల్లడించారు. ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాల వల్ల వచ్చే అయిదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు, రూ.30 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందన్న ఆశలు రేపారు. కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఇన్నాళ్లూ భావించిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రస్తావన ఈ బడ్జెట్లో లేకపోవడం ప్రస్తావనార్హం.
ఏడు చోదక శక్తులు
ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించేందుకు ఏడు చోదకశక్తుల్ని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అవి..1.రహదారులు, 2.రైల్వే, 3.విమానాశ్రయాలు, 4.ఓడరేవులు, 5.ప్రజారవాణా, 6.జలమార్గాలు, 7.రవాణా మౌలిక సదుపాయాలు. వీటితో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే ప్రాధాన్య అంశాల్ని ప్రస్తావించారు. 5జీ స్పెక్ట్రం వేలం, నదుల అనుసంధానం, మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్ల తయారీ వంటివాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిందని.., వందేళ్ల దిశగా వెళ్లేందుకు ఈ బడ్జెట్ బాటలు వేస్తుందని చెప్పారు.
దేశ ‘గతి’ మార్చే ‘శక్తి’
దేశ ఆర్థికవృద్ధి, సమీకృత అభివృద్ధి తీరును ‘పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ప్లాన్’ సమూలంగా మార్చేస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఏడు చోదక శక్తులూ దేశ ఆర్థికవ్యవస్థను ఏక రీతిలో ముందుకు తీసుకెళ్తాయని తెలిపారు. వీటికి విద్యుత్ సరఫరా, ఐటీ కమ్యూనికేషన్, నీటిసరఫరా - మురుగునీటి పారుదల, సామాజిక మౌలిక వసతులు మద్దతుగా ఉంటాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13,327 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించగా, 2022-23లో 25వేల కిలోమీటర్ల మేర విస్తరిస్తామన్నారు. యువతకు ఉద్యోగ, వాణిజ్య అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కలిసే ఉంటాయన్నారు.
కొత్త పన్నులు వేయలేదుగా...
పన్నుల్లో మినహాయింపులు ఇస్తారని చూసిన వేతన జీవులకు నిరాశే మిగిలింది. ఆదాయపు పన్ను శ్లాబులను యథాతథంగా ఉంచారు. ఇదే విషయాన్ని విత్తమంత్రి వద్ద విలేకర్లు ప్రస్తావించినప్పుడు, గత సంవత్సరం కంటే పన్నులేవీ పెంచలేదని గుర్తుచేశారు. మహమ్మారి సమయంలో ప్రజల మీద పన్నుల భారం వేసి ఆదాయం పెంచుకోవాలనుకోలేదని చెప్పుకొచ్చారు.
ఎన్నికల రంగు
ఉత్తర్ప్రదేశ్తో ముడిపడిన కెన్-బెత్వా నదుల అనుసంధాన పథకాన్ని రూ.44 వేల కోట్లతో చేపట్టబోతున్నట్లు ప్రకటించి బడ్జెట్కు కాస్త ఎన్నికల రంగు పులిమారు. ఇదే తరహాలో మరో అయిదు నదుల అనుసంధాన పథకాలకు ముసాయిదా డీపీఆర్లు ఖరారయ్యాయని చెబుతూనే.. వాటికి ఆయా రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తప్పనిసరి అని చెప్పారు. గుజరాత్లోని గిఫ్ట్సిటీకి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కేటాయించారు. ప్రపంచస్థాయి యూనివర్సిటీలు అక్కడికొచ్చి ఆర్థశాస్త్ర కోర్సులు నిర్వహించుకోవడానికి అనుమతిస్తామని చెప్పారు. ఆర్థికమంత్రి నోట తెలుగు రాష్ట్రాలకు ఒక్క వరమూ జాలువారలేదు. నిర్లక్ష్యాన్ని వీడి, ధర్మబద్ధంగా పాలిస్తూ, ధర్మానికి అనుగుణంగా పన్నులు వసూలుచేస్తూ రాజు ప్రజల యోగక్షేమాలను చూసుకోవాలన్న మహాభారతం శాంతిపర్వంలోని శ్లోకాన్ని చెప్పి... ప్రజల పట్ల తమ ప్రభుత్వానికున్న ఉద్దేశాన్ని చాటుకున్నారు. ఆర్థికమంత్రి ఎలాంటి అలజడుల జోలికి పోలేదు కాబట్టే బడ్జెట్ తర్వాత స్టాక్మార్కెట్లు పురోగమించాయన్న ఆర్థిక నిపుణుల విశ్లేషణను చూస్తే ఈ కాలం ఇలా గడిచిపోనీ అన్న భావనతో కేంద్రం ముందడుగు వేసినట్లు తేటతెల్లమవుతోంది.
ప్రజాహితం.. ప్రగతిశీలం..!
ఇది ప్రజానుకూల, ప్రగతిశీల బడ్జెట్. వందేళ్లలో కనీవినీ ఎరుగని విపత్తు కోరల్లో దేశం చిక్కుకొని ఉన్న తరుణంలో వృద్ధిని ప్రోది చేసేలా ఇది కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. మరిన్ని మౌలిక వసతుల కల్పనకు, పెట్టుబడులు, వృద్ధి, ఉద్యోగ కల్పనకు ఈ బడ్జెట్ బాటలు పరుస్తోంది. దీనివల్ల అనేక రంగాలకు లబ్ధి చేకూరుతుంది.
- ప్రధాని నరేంద్ర మోదీ
ప్రయోజనం సున్నా
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీరో బడ్జెట్ ఇది. వేతన జీవులు, పేదలు, మధ్య తరగతి ప్రజలు, అణగారిన వర్గాలకు ఏమీ లేదు. యువత, రైతులు, చిన్నతరహా పరిశ్రమలకు ఎలాంటి ప్రయోజనం లేదు. అందరికీ మొండిచెయ్యి చూపింది.
- రాహుల్ గాంధీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్