Union Budget 2022: మళ్లీ దగా..
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటారు.. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు టీవీలకు కళ్లప్పగిస్తుంటారు.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తున్నామనో, విశాఖలో
ఆర్థిక మంత్రి ప్రసంగంలో వినపడని ఏపీ పేరు
ఏడేళ్లుగా నిర్లక్ష్యం
ఈనాడు, అమరావతి: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటారు.. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు టీవీలకు కళ్లప్పగిస్తుంటారు.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తున్నామనో, విశాఖలో రైల్వే జోన్ పెడుతున్నామనో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులిస్తున్నామనో ఆర్థిక మంత్రి ఈసారైనా ప్రకటిస్తారేమోనన్న ఆశ వారిలో మిణుకుమిణుకుమంటుంది. వారలా చూస్తుండగానే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి మళ్లీ మొండిచెయ్యే ఎదురవుతుంది..! మరోసారి దగాపడ్డామని ప్రజలకు అర్థమవుతుంది..! ఏళ్ల తరబడి సాగుతున్న ఈ తంతు ఈ ఏడాదీ కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీకి తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లవుతున్నా.. ఆ గాయాల నుంచి ఇంకా కోలుకోని ఆంధ్రప్రదేశ్పై కనీస కనికరమూ చూపలేదు. పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లేక, ఆర్థిక లోటుతో కునారిల్లుతున్న ఏపీపై మరోసారి అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించింది. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో, మాటమాత్రంగానైనా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రాలేదు. ప్రత్యేక హోదా, రామాయపట్నం ఓడరేవు, కడప ఉక్కు కర్మాగారం.. ఇలా విభజన హామీల్లో ఏ ఒక్కటీ ప్రకటించలేదు. బడ్జెట్ ప్రసంగంలో చెప్పకపోతే పోయారు.. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులేమైనా చేశారేమోనని బడ్జెట్ పత్రాలన్నీ దుర్భిణీ వేసి వెతికినా ఎక్కడా ఏమీ కనిపించలేదు. అరకొర కేటాయింపులు, మొక్కుబడి విదిలింపులూ తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. బడ్జెట్లో ప్రకటించకపోయినా, రైల్వే బోర్డు విడుదల చేసే ‘పింక్ బుక్’లోనైనా రైల్వే జోన్ ప్రస్తావన ఉంటుందేమోన్న ఆశ ఒక్కటే ఇక మిగిలింది. అదయినా నెరవేరుతుందో, నిట్టూర్పులే మిగులుతాయో చూడాలి.
ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు?
ఆర్థిక పరిపుష్ఠి, అన్ని వనరులూ ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక ప్రేమ కనబరుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు మాత్రం ప్రతి బడ్జెట్లోనూ మొండి చెయ్యే చూపుతోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, భాజపా పాలిత ప్రాంతాలపై ఎప్పటికప్పుడు వరాలు కురిపిస్తూ...ఏపీకి అన్యాయం చేస్తోంది. గత బడ్జెట్లో కూడా రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించిన కొత్త ప్రాజెక్టు ఒక్కటీ లేదు. గత బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఖరగ్పూర్- విజయవాడ, ఇటార్సీ - విజయవాడ మధ్య ప్రత్యేక రైలు రవాణా కారిడార్లు, చిత్తూరు-తాచ్చూరు జాతీయ రహదారి ప్రాజెక్టుల్ని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అవి ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళతాయి కాబట్టి ఏపీ గురించి ప్రస్తావించారు. ఈసారి కనీసం అలాంటి ప్రాజెక్టు కూడా లేకపోవడంతో ఆమె ప్రసంగంలో ఎక్కడా ఏపీ మాటే వినపడలేదు. గత బడ్జెట్లో ప్రకటించిన రెండు రైలు రవాణా కారిడార్ల పనులూ పట్టాలెక్కనేలేదు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల గురించి గానీ, రాష్ట్రంలోని విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని గానీ, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ప్రాజెక్టుల్ని నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటామని గానీ... ఏ చిన్న వరం కూడా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో దొర్లలేదు.
ఎనిమిదేళ్లలో ఏమిచ్చారు?
ఇంకో రెండేళ్లు గడిస్తే, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతుంది. ఒక రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో దశాబ్దమంటే తక్కువ సమయమేమీ కాదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఆర్థికంగా అండగా నిలిచే పెద్ద నగరాలేమీ లేకపోవడం, రాజధాని అమరావతి నిర్మాణం కూడా నిలిచిపోవడంతో.. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే బాగా వెనకబడింది. కేంద్రం చూపుతున్న అంతులేని నిర్లక్ష్యం రాష్ట్రాన్ని.. ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే రోజురోజుకీ మరింత వెనక్కిలాగుతోంది. ప్రత్యేక హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలకు, వెనుకబడిన రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహం కేటగిరీ కింద.. కేంద్ర, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీని పరిశ్రమలకు తిరిగి చెల్లించేందుకు 2022-23 బడ్జెట్లో కేంద్రం రూ.3,631 కోట్లు కేటాయించింది. ఇతర రాయితీల కిందా పలు కేటాయింపులు జరిపింది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఏపీకి కూడా అలాంటి ప్రోత్సాహకాల్లో కొన్నయినా వచ్చేవి. కనీసం రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు విభజన చట్టంలో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిధుల గురించి కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు.
మెట్రో రైలుకు రెడ్ సిగ్నలే!
ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం మరోసారి మొండిచెయ్యి చూపింది. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులూ జరపలేదు. కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో బెంగళూరు, చెన్నై, కోచితో పాటు, మహారాష్ట్రలో నాగపూర్, నాసిక్ మెట్రో రైలు ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు చేసింది. 2021-22 సవరించిన బడ్జెట్ అంచనాల్లోనూ మెట్రో ప్రాజెక్టులకు రూ.18,978 కోట్లు కేటాయించినట్లు చూపించింది. ప్రస్తుత బడ్జెట్లోనూ వివిధ మెట్రో ప్రాజెక్టులకు రూ.19,130 కోట్ల కేటాయించింది. కానీ విజయవాడ, విశాఖ మెట్రో రైళ్ల గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. మెట్రో రైళ్ల విషయంలోనూ రాష్ట్రానికి కేంద్రం మరోసారి అన్యాయం చేసింది.
పోలవరం ఎప్పటికి పూర్తయ్యేను?
విభజన హామీల్లో వేటినీ ప్రకటించకపోగా.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంపైనా కేంద్రం పాత వైఖరినే కనబరిచింది. కేంద్రం తీరు చూస్తుంటే మరో 20 ఏళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా? అన్న సందేహాలు రాష్ట్ర ప్రజల్లో కలుగుతున్నాయి. అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 2021-22 బడ్జెట్లో రూ.54.10 కోట్లు కేటాయించి, సవరించిన అంచనాల్లో రూ.14.11 కోట్లు మాత్రమే చూపింది. ఈ బడ్జెట్లో రూ.56.66 కోట్లు కేటాయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన విశ్వవిద్యాలయాలకు గత బడ్జెట్లో రూ.50.50 కోట్లు ప్రతిపాదించి, సవరించిన అంచనాల్లో దాన్ని 9.74 కోట్లుగా చూపింది. ఈ బడ్జెట్లో రూ.44 కోట్లు ప్రతిపాదించింది. అలాంటివి తప్ప, ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థను గానీ, విద్యా సంస్థను గానీ రాష్ట్రానికి కొత్తగా ప్రకటించలేదు. అంతేకాదు విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి ఇది వరకే మంజూరు చేసిన విద్యా సంస్థల్ని వేగంగా పూర్తి చేసేందుకు, పరిపుష్ఠం చేసేందుకు ఈ బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు కూడా లేకపోవడం ఆంధ్రప్రదేశ్పై కేంద్రం చూపుతున్న అంతులేని నిర్లక్ష్యానికి నిదర్శనం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు