AP PRC: పీఆర్సీ చర్చలు విఫలం
పీఆర్సీపై మంత్రుల కమిటీతో మంగళవారం జరిగిన ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. సచివాలయంలో మంత్రుల కమిటీతో దాదాపు రెండు గంటలకుపైగా పీఆర్సీ సాధన సమితి సభ్యులు భేటీ అయ్యారు. జనవరికి
యథావిధిగా ఉద్యమ కార్యాచరణ
నేడు జీతాల స్లిప్పుల దహనం
ముందుగా నిర్ణయించిన మేరకే చలో విజయవాడ, సమ్మె
ఈనాడు, అమరావతి: పీఆర్సీపై మంత్రుల కమిటీతో మంగళవారం జరిగిన ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. సచివాలయంలో మంత్రుల కమిటీతో దాదాపు రెండు గంటలకుపైగా పీఆర్సీ సాధన సమితి సభ్యులు భేటీ అయ్యారు. జనవరికి పాత జీతాలు ఇవ్వాలని, పీఆర్సీ ఉత్తర్వులు నిలుపుదల చేయాలని, అశుతోష్మిశ్ర నివేదిక బహిర్గతం చేయాలనే మూడు డిమాండ్లను వినిపించారు. వీటిపై సమాధానం చెబితేనే చర్చలని స్పష్టం చేశారు. దీంతో సచివాలయంలోనే అందుబాటులో ఉండాలని మంత్రుల కమిటీ వారికి సూచించింది. సాయంత్రం అప్పటికప్పుడే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, జీఏడీ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్కుమార్ సచివాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జారీ అయిన జనవరి పేస్లిప్స్, గత నెల కంటే ఎంత జీతం పెరిగిందనే వివరాలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు. మరోవైపు పీఆర్సీ సాధన సమితి నేతలకు.. వారి డిమాండ్లు సాధ్యం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి సమాచారం వచ్చింది. దీంతో పీఆర్సీ సాధన సమితి నేతలు ఉద్యమం కొనసాగించాలని నిర్ణయించారు. 2న పే స్లిప్స్ దహనం, 3న చలో విజయవాడ, 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.
చర్చలకు పిలిచి అవమానించారు..
ఉద్యమాన్ని నీరు గార్చేందుకే చర్చలు అంటున్నారు.. చర్చలకు పిలిచి అవమానించారని ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అశుతోష్ మిశ్ర నివేదిక, పాత జీతాలు ఇవ్వలేమని, ఉత్తర్వులను నిలుపుదల చేయలేమని చెప్పారు. నివేదిక అడిగితే అది ముగిసిపోయిన అధ్యాయమని మంత్రుల కమిటీ అంటోంది. నివేదిక ఇవ్వకపోతే ఏ ఉద్యోగికి ఏ స్కేల్ ఇచ్చారో ఎలా తెలుస్తుంది? జీతాలు పెరిగాయని పే స్లిప్పులు పెడితే ఉద్యోగుల్లో ఆందోళన తగ్గిపోతుందని ప్రభుత్వం అనుకుంటోంది. ఉద్యోగులందరూ వాట్సప్ సందేశాలను పక్కనపెట్టి, 3న చలో విజయవాడకు లక్షల్లో తరలిరావాలి’ అని పిలుపునిచ్చారు. ‘కేంద్ర ప్రభుత్వం 16 ఏళ్ల క్రితం ఆరో పీఆర్సీలో ఇతర భత్యాలను పెంచి, అదనంగా రవాణా భత్యం ఇచ్చి.. సీసీఏను తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవేవీ ఇవ్వకుండానే ఇప్పుడు సీసీఏను తొలగించటం దారుణం’ అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. కొత్త పీఆర్సీ ప్రకారం వెబ్సైట్లో పే స్లిప్పులు పెట్టినా ఎవ్వరికీ వేతనాలు పడలేదన్నారు. ‘మా మూడు డిమాండ్లు అసందర్భమని, ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలని సమాచారం ఇచ్చారు’ అని పేర్కొన్నారు.
కలెక్టర్లు ప్రైవేటు క్లాసులు మానుకోవాలి
చర్చలు విఫలమైనట్లేనని, చలో విజయవాడకు లక్షలాదిగా తరలివచ్చి ఉనికి చాటాలని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారంటూ.. జిల్లాల్లో కలెక్టర్లు గుర్తింపు ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి ఉద్యమం చేయొద్దని, చలో విజయవాడకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఈ ప్రైవేటు క్లాసులు మానుకోవాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయొద్దు. మా డిమాండ్లపై చర్చించుకొని చెబుతామన్న మంత్రులు.. అవి సాధ్యపడవంటూ సాయంత్రం 5.30 గంటలకు ఉద్యోగనేత సూర్యనారాయణకు మెసేజ్ పంపారు’ అని చెప్పారు. ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏం కోరుకుంటున్నారో చెప్పాం’ అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు