AP PRC: వేలగొంతులు ఒక్కటై..
నిర్బంధాల్ని ఛేదించి.. నిలువరింతల్ని దాటి.. అడ్డంకుల్ని అధిగమించి.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉప్పెనలా తరలివచ్చారు. చినుకు చినుకు కలిసి కుంభవృష్టిగా మారినట్లు.. ఒక్కొక్కరిగా మొదలై వందలు, వేల సంఖ్యలో పోటెత్తారు. ప్రభుత్వం హెచ్చరించేకొద్దీ..
పిక్కటిల్లిన ఉద్యోగ గర్జన
పోలీసు నిర్బంధాల్ని ఛేదించి అడ్డంకుల్ని అధిగమించి..
ఒక్కొక్కరిగా మొదలై.. ఉప్పెనలా తరలివచ్చిన ఉద్యోగులు
జనసంద్రమైన విజయవాడ
నాలుగు కి.మీ. మేర ఎటు చూసినా వారే
ఈనాడు, అమరావతి: నిర్బంధాల్ని ఛేదించి.. నిలువరింతల్ని దాటి.. అడ్డంకుల్ని అధిగమించి.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉప్పెనలా తరలివచ్చారు. చినుకు చినుకు కలిసి కుంభవృష్టిగా మారినట్లు.. ఒక్కొక్కరిగా మొదలై వందలు, వేల సంఖ్యలో పోటెత్తారు. ప్రభుత్వం హెచ్చరించేకొద్దీ.. పోలీసులు నిలువరించేకొద్దీ.. రెట్టించిన పోరాట స్ఫూర్తితో దూసుకొచ్చారు. తమ ఉద్యమ ఆకాంక్షను అణగదొక్కలేరని నిరూపిస్తూ జనసంద్రమై ఎగిశారు. సమూహశక్తిని, పోరాట స్ఫూర్తిని ప్రభుత్వానికి చాటిచెబుతూ ఉద్యమాల పురిటిగడ్డ బెజవాడకు వెల్లువెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాలు గురువారం నిర్వహించిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న బీఆర్టీఎస్ రహదారి మొత్తం వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులతో కిక్కిరిసిపోయింది. లక్ష మందికి పైగా ఉద్యోగులు తరలివచ్చారని నాయకులు ప్రకటించారు. గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకూ విజయవాడలోని బీఆర్టీఎస్ ఉద్యమ నినాదాలతో హోరెత్తింది. ‘మాయదారి పీఆర్సీ మాకొద్దు.. రివర్స్ పీఆర్సీ మాకొద్దు. చీకటి పీఆర్సీ జీవోలు రద్దు చేయాలి’ అంటూ ఉద్యోగుల గర్జనతో అట్టుడికింది.
పీఆర్సీ సాధన సమితి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జెండాలు చేతబూనిన ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం కదం తొక్కింది. వేతనాలు తగ్గించి ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతోందంటూ మండిపడింది. ఉద్యమ గేయాలు, గీతాలు ఆలపిస్తూ ప్రభుత్వ తీరుపై గళమెత్తింది. వినూత్న రీతిలో ప్రదర్శనలతో నిరసన తెలిపింది. ప్రసంగాలతో ఉద్యమ స్ఫూర్తి నింపింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే.. సమ్మెతో సత్తా చాటుతామని పునరుద్ఘాటించింది.
అడ్డంకుల్ని అధిగమించి చేరుకున్నారిలా..
జిల్లాలు, మండలాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులను పోలీసులు గృహనిర్బంధం చేసినా కొంతమంది ఎలాగోలా తప్పించుకుని విజయవాడకు చేరుకున్నారు. ఇంకొందరైతే రెండు, మూడు రోజుల ముందే ఇక్కడికి వచ్చేశారు. రైళ్లు, బస్సుల్లో అణువణువూ పోలీసులు తనిఖీలు చేస్తుంటే వారికి చిక్కకుండా ఉండేందుకు రోగులు, కూలీలు, భక్తుల మాదిరి మారువేషాలు వేసుకుని మరీ పలువురు చేరుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బెజవాడ వైపు వచ్చే అన్ని మార్గాల్లోనూ చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు అడుగడుగునా అడ్డగిస్తే వాటిని దాటుకుంటూ వేల మంది గమ్యస్థానం వైపు కదిలారు. ఇక్కడికి చేరిన తర్వాత నగరంలోని హోటళ్లలో తలదాచుకుంటే పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో పరిచయస్తులు, బంధుమిత్రుల ఇళ్లలో కొంతమంది బస చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గురువారం ఉదయం విజయవాడకు చేరుకున్నవారు, నగరంలో బృందాలుగా తిరుగుతున్న ఉద్యోగుల్ని ఉదయం 9.30 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప స్టేషన్లకు తరలించారు. అయినా మిగతావారు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగారు. ఇలా ప్రతి ఒక్కరూ ఎలాగైనా సరే ‘చలో విజయవాడ’లో పాల్గొనటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగారు.
పుట్ట పగిలి బయటకొచ్చిన చీమలదండులా..
చలో విజయవాడను అడ్డుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని గుర్తించిన ఉద్యోగులు.. తాము బృందాలుగా ఉంటే పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ఎవరికివారు విడిపోయి, ప్రజల్లో కలిసిపోయారు. గురువారం ఉదయం 8.30- 9 గంటల వరకూ ప్రధాన కూడళ్లలో ఒంటరిగా తిరిగారు. చలో విజయవాడ కార్యక్రమానికి సమయం ఆసన్నమయ్యేసరికి ఉదయం 9.30 గంటలకంతా ఎక్కడెక్కడో ఉన్నవారంతా పుట్టల్లో నుంచి చీమల దండు వచ్చినట్లు ఒక్కసారిగా వీధులు, సందులు, కూడళ్లు, వివిధ భవనాల్లో నుంచి బయటకొచ్చారు. క్షణాల్లో వేల మంది సంఘటితమయ్యారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నుంచి కొన్ని బృందాలు, ఇతర ప్రాంతాల నుంచి మరికొన్ని బృందాలు బీఆర్టీఎస్ రోడ్డు వైపు ప్రదర్శనగా బయల్దేరాయి. బీఆర్టీఎస్ రోడ్డులోని మీసాల రాజేశ్వరరావు వంతెన వద్దకు చేరుకునేసరికి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వేల మంది ఉద్యోగులు జనసంద్రాన్ని తలపించారు. ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్ని చూసిన పోలీసులు.. వారిని అడ్డుకుంటే మరింత ఇబ్బంది అవుతుందేమోనన్న ఉద్దేశంతో వదిలేశారు. దీంతో బీఆర్టీఎస్ రోడ్డులోని పడవలరేవు కూడలి వరకూ దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు కాలినడకన ప్రదర్శనగా తరలివెళ్లారు. పీఆర్సీ సాధన సమితి జెండాలు చేతబట్టి ఉద్యమ నినాదాలతో హోరెత్తించారు. పడవలరేవు కూడలి సమీపానికి చేరుకున్న తర్వాత అంతా బీఆర్టీఎస్ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఆ సమయంలో మొత్తం బీఆర్టీఎస్ రహదారి నాలుగు కిలోమీటర్లు ఉద్యోగ, ఉపాధ్యాయులతో కిక్కిరిసిపోయింది. ఉదయం 10 గంటలకంతా బీఆర్టీఎస్ రోడ్డుతోపాటు దాన్ని ఆనుకుని ఉన్న సందులు, వీధుల్లో ఎటు చూసినా ఉద్యోగులు, ఉపాధ్యాయులే కనిపించారు. కొందరైతే సమీపంలోని భవనాలపైకి ఎక్కి వాటిని సెల్ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు.
వాహనమే వేదికగా ప్రసంగాలు
దాదాపు లక్ష మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు బీఆర్టీఎస్ రోడ్డుపైకి చేరుకుని అక్కడ బైఠాయించిన తర్వాత 11.30 గంటల సమయంలో పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.వెంకట్రామిరెడ్డి, కె.సూర్యనారాయణ, సుధీర్బాబు, హృదయరాజు తదితరులు ర్యాలీగా అక్కడికి వచ్చారు. పడవలరేవు కూడలి వద్ద వేదిక ఏర్పాటు చేయాలని ఉద్యమ నాయకులు ముందుగానే భావించినా పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో అప్పటికప్పుడు ఓ వాహనానికి మైకులు అమర్చి దానిపై నుంచే ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. వారి ప్రసంగాలు సాగుతున్నంతసేపు ఉద్యోగులు వారికి మద్దతుగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1.30 గంట వరకూ ఈ సభ కొనసాగింది. తర్వాత ఉద్యోగులంతా అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు.
తొలుత నిర్బంధాలు.. ఆ తర్వాత
చలో విజయవాడ కార్యక్రమాన్ని జరగనీయకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎవర్నీ రానీయకుండా అడ్డుకునేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నించారు. గురువారం ఉదయం 9.30 గంటల వరకూ కూడా వారి నిర్బంధాలు, అడ్డగింతలు కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకున్న ఉద్యోగుల్ని గవర్నర్పేట, కృష్ణలంక తదితర పోలీసుస్టేషన్లకు తరలించారు. మరికొందరు ఉద్యోగుల్ని ఆటోనగర్లోని ఆటోమొబైల్ టెక్నికల్ అసోసియేషన్ హాల్లో నిర్బంధించారు. అయితే వాటన్నింటినీ అధిగమించి ఒక్కసారిగా వేల మంది ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్డులోకి తరలిరావటంతో వారిని అదుపు చేయటం కష్టమని భావించిన పోలీసులు ఒక వ్యూహం ప్రకారం.. ఎవర్నీ అడ్డుకోకుండా వదిలేశారు. పోలీసుల చేతుల్లో లాఠీలు కనిపించలేదు. కానీ వందల మంది మోహరించారు. అంతకు ముందు నిర్బంధించిన ఉద్యోగుల్ని మధ్యాహ్నం తర్వాత పోలీసులు విడిచిపెట్టారు.
అంధులు సైతం కదిలొచ్చారు..
ప్రభుత్వ తీరును ఎండగడుతూ చేపట్టిన ఉద్యమంలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి దివ్యాంగులు, అంధులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడా తరలివచ్చారు. వారు ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వ్యంగ్యంగా గేయాలు ఆలపించి నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో సీపీఎస్ ఉద్యోగులు, కొంతమంది పింఛనుదారులు కూడా వచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు. తమకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. మహిళా ఉద్యోగులూ వేల సంఖ్యలో వచ్చారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధిక శాతం మంది ఉపాధ్యాయులే ఉన్నారు. యూటీఎఫ్, ఏపీటీఎఫ్ తదితర సంఘాల నుంచి వేల మంది తరలివచ్చి జెండాలు ప్రదర్శించారు. పోలీసులూ ఉద్యోగులేనని వారూ ఉద్యమానికి సహకరించాలంటూ ఆందోళనల్లో పాల్గొన్న వారు నినాదాలు చేశారు. కొంతమంది ఉద్యోగులు శీర్షాసనం వేసి ‘రివర్స్ పీఆర్సీ’ అంటూ ఎద్దేవా చేశారు. మరికొందరు యాచన చేసి, ఇంకొందరు మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
మంచినీళ్లు, మజ్జిగ ఇచ్చి.. మద్దతు పలికిన జనం
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన కనిపించింది. బీఆర్టీఎస్ రహదారి పొడవున నివాసితులు వారి ఇళ్ల ముందు మంచినీళ్లు, మజ్జిగ బిందెల్లో ఉంచి అందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. కూర్చోవటానికి కుర్చీలు ఇచ్చి సహకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM