Samatha Spoorthi: మహిమాన్విత మూర్తి.. సమతాస్ఫూర్తి
మహాద్భుతం ఆవిష్కృతమైంది.. వెయ్యేళ్ల కిందట అవతరించిన మహిమాన్విత మానవతా సమతామూర్తి శ్రీరామానుజాచార్యులు నడయాడిన భరతఖండం పునీతమైంది. ఆ ఆదర్శమూర్తి నింపిన స్ఫూర్తిని
ప్రధాని చేతుల మీదుగా శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణ
దేశఖ్యాతిని తెలుగు ఇనుమడింపజేస్తోందని మోదీ ప్రశంసలు
మహాద్భుతం ఆవిష్కృతమైంది.. వెయ్యేళ్ల కిందట అవతరించిన మహిమాన్విత మానవతా సమతామూర్తి శ్రీరామానుజాచార్యులు నడయాడిన భరతఖండం పునీతమైంది. ఆ ఆదర్శమూర్తి నింపిన స్ఫూర్తిని దిగంతాలకు పరిమళింపజేసే మహాఘట్టం సాక్షాత్కారమైంది. భాగ్యనగర సిగలో అద్భుతఘట్టం చేరింది. భారత ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ముచ్చింతల్లో రామానుజాచార్యుల మూర్తి విగ్రహం ఆవిష్కృతమైంది. తొలుత విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన విష్వక్సేన యాగంలో ప్రధాని పాల్గొన్నారు. ఆ తరువాత విగ్రహం చుట్టూ ఉన్న దివ్యదేశాలను సందర్శించారు. అనంతరం సమతామూర్తిని జాతికి అంకితం చేశారు.
ఆద్యంతం ఆధ్యాత్మికతను పంచుతూ.. విశిష్టాద్వైతాన్ని దశదిశలా వినిపించేలా సాగుతున్నాయి రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు. విగ్రహావిష్కరణ కోసం విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీ సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్కు చేరుకున్నారు. హెలికాప్టర్లో సమతామూర్తి కేంద్రం చుట్టూ తిరిగి విహంగ వీక్షణం చేశారు. అనంతరం ప్రధాని యాగశాల ప్రాంతానికి చేరుకున్నారు. మోదీ వెంట గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మైహోం సంస్థల ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. సమతామూర్తి కేంద్రం విశేషాలను ప్రధానికి చినజీయర్స్వామి వివరించారు.
విజయాన్ని కాంక్షిస్తూ విష్వక్సేనేష్టి
వసంత పంచమి పర్వదినం.. ప్రధాని మోదీ రాక సందర్భంగా క్షేత్రంలో ప్రత్యేకంగా విష్వక్సేనేష్ఠిని నిర్వహించారు. ప్రధాని చేపట్టే అన్ని కార్యక్రమాల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో యాగం నిర్వహించారు. నరేంద్రమోదీ హాజరై విష్వక్సేన పూజలో పాల్గొన్నారు. చినజీయర్స్వామి మోదీకి స్వర్ణకంకణధారణ చేశారు. అనంతరం విష్వక్సేనేష్టి పూర్ణాహుతిలో మోదీ పాల్గొని క్రతువును పూర్తి చేశారు. యాగశాలల నుంచి నేరుగా సమతామూర్తి కేంద్రానికి విచ్చేసిన మోదీ.. విగ్రహం చుట్టూ ఉన్న దివ్యదేశాలను సందర్శించారు.
సమతామూర్తి ఆవిష్కరణ
దివ్యదేశాల నుంచి సమతామూర్తి కేంద్రానికి ప్రధాని చేరుకున్నారు. భద్రవేదిలోని కింది అంతస్తులో శ్రీరామానుజాచార్యుల జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన మండపంలో కలియతిరిగి అక్కడి విశేషాలు తెలుసుకున్నారు. తర్వాత మొదటి అంతస్తులోని స్వర్ణమూర్తి వద్దకు చేరుకోగా.. అక్కడి విశిష్టతలను చినజీయర్స్వామి వివరించారు. దీన్ని ఈ నెల 13న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారని, రామానుజాచార్యులు 120 ఏళ్లు జీవించిన సందర్భంగా 120 కిలోల బంగారంతో మూర్తిని నిర్మించినట్లు చెప్పారు. రెండో అంతస్తుకు చేరాక అక్కడ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నామని, దాని విశేషాలను వివరించారు. అనంతరం భద్రవేదిపైన రామానుజాచార్యుల భారీ విగ్రహం కొలువు దీరిన పద్మపీఠం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం లేజర్ దీపాల కాంతుల్లో రామానుజాచార్యుల భారీ విగ్రహానికి తిలకం పెట్టడంతో 3డీ టెక్నాలజీలో తెరపైకి తీసి.. సమతామూర్తిని జాతికి అంకితం చేశారు. అనంతరం ఉజ్జీవన సోపానంపైన ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుని ఆవిష్కరణలో పాల్గొన్నారు. 3డీ మ్యాపింగ్ టెక్నాలజీతో రూపొందించిన లేజర్ షో అలరించింది. మోదీ సహా ముఖ్యులు విజయస్తూపం వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకుని ఈ ప్రదర్శనను వీక్షించారు. రామానుజాచార్యుల విశిష్టత, సమతా సిద్ధాంతాన్ని చాటిన తీరు.. ఇలా అన్ని అంశాలను స్పృశిస్తూ ప్రదర్శన రూపొందించారు. తర్వాత మోదీ మళ్లీ యాగశాలకు చేరుకుని, శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతిలో పాల్గొన్నారు.
సమాజంలో చెడు విస్తృతమైనపుడు మహాపురుషులు పుట్టుకువస్తారు. ఎన్నికలు ఉండొచ్చు.. లేకపోవచ్చు. సమస్యలు రావచ్చు, పోవచ్చు. సమాజంలో చెడుపై పోరాటం చేసేందుకు తన శక్తి మొత్తాన్ని ఉపయోగించినప్పుడే సన్మానం, ఆదరణ లభిస్తుంది
- ప్రధాని మోదీ
నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ప్రపంచంలో భారతదేశాన్ని తలెత్తుకునేలా చేశారు. శ్రీరాముడిలా మోదీ కూడా ఎల్లవేళలా రాజధర్మాన్ని ఆచరిస్తున్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కంకణబద్ధులై పనిచేస్తున్నారు.
- చినజీయర్ స్వామి
బంగారు వర్ణపు పంచెలో.. మెరిసిన మోదీ
ఈనాడు, హైదరాబాద్ : సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఆహార్యం చూపరుల్ని విశేషంగా ఆకర్షించింది. తొలుత అతిథిగృహానికి చేరుకుని యాగంలో పాల్గొనేందుకు వీలుగా వస్త్రధారణతో.. విష్ణునామాలు పెట్టుకుని విచ్చేశారు. బంగారు వర్ణపు పంచె ధరించి విష్వక్సేనేష్టి యాగానికి హాజరయ్యారు. భక్తితో నమస్కరిస్తూ ముందుకుసాగారు. చినజీయర్స్వామి చెప్పే విషయాన్ని వింటూ దివ్యదేశాల విశిష్టత, సమతామూర్తి ప్రాజెక్టు విశేషాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
108 మెట్లు దిగి.. కార్యక్రమ ఆరంభం నుంచి చివరి వరకు నియమనిష్టలతో మోదీ వ్యవహరించారు. ప్రసంగం ముగించుకున్నాక ఉజ్జీవన సోపాన వేదిక నుంచి లేజర్ షో వీక్షించే వేదిక వరకు నడుచుకుంటూ వచ్చారు. ముందుగా డైనమిక్ ఫౌంటెన్ వద్ద ప్రత్యేకంగా వాహనాలు ఉంచినా.. వాటిలో ఎక్కలేదు. సభ ముగిశాక ఉజ్జీవన సోపానంపై నుంచి 108 మెట్లు దిగి కిందికి వచ్చారు.
ప్రధానికి ఘనస్వాగతం
ఈనాడు, హైదరాబాద్, శంషాబాద్, న్యూస్టుడే: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు, రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఘనస్వాగతం లభించింది. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఇక్కడకు చేరుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, భాజపా నేతలు ప్రధానికి స్వాగతం పలికారు. తనకు అభివాదం చేస్తున్న నాయకులందరినీ వరుసగా పలకరిస్తూ మోదీ ముందుకు సాగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు