Ramanujacharyulu: దేశ ఐక్యతకు రామానుజులే ప్రేరణ
భారతదేశ ఐక్యత, సమగ్రతకు జగద్గురువు రామానుజాచార్య ప్రేరణ అని, ఆయన బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. సద్గుణాలతోనే లోక
ఈనాడు, హైదరాబాద్: భారతదేశ ఐక్యత, సమగ్రతకు జగద్గురువు రామానుజాచార్య ప్రేరణ అని, ఆయన బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. సద్గుణాలతోనే లోక కల్యాణం జరుగుతుందని, జాతులతో కాదని పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరూ అభివృద్ధి చెందాలని, భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం పొందాలన్నారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ మంత్రంతో కొత్త భవిష్యత్తుకు పునాదులు పడతాయని, శతాబ్దాలుగా వేధింపులకు గురవుతున్న వారంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రామానుజుల విగ్రహంతో భారతదేశం మానవశక్తిని, స్ఫూర్తిని పొందుతుందని, జ్ఞానం, వైరాగ్యం, ఆదర్శాలకు ఈ విగ్రహం చిహ్నమని పేర్కొన్నారు. దేశంలో అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో దళిత, గిరిజన, బహుజన, మహిళలు, ఇతర అసహాయులందరికీ న్యాయం జరుగుతోందని వివరించారు. ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో పర్యటించిన ప్రధాని అక్కడ సభలో ప్రసంగించారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మైహోం రామేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
వసంత పంచమి పర్వదినం..
మోదీ ప్రసంగిస్తూ, ‘సరస్వతీదేవిని పూజించే పవిత్రమైన పండగ వసంత పంచమి. ఈ సందర్భంగా శ్రీరామానుజాచార్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటున్నాం. జ్ఞానానికి మూలం గురువు. జగద్గురు విగ్రహం, ఆయన బోధనలు అందరికీ ఆదర్శం. సమతామూర్తి భవిష్యత్తు తరాలకే కాదు.. భారత ప్రాచీన గుర్తింపును మరింత పటిష్ఠం చేస్తుంది. ఇక్కడి 108 దివ్యదేశ మందిరాల దర్శనం చేసుకున్నా. ఒకేసారి భారత్ మొత్తం తిరిగినంత దర్శన ఫలం రామానుజాచార్య కృపతో ఇక్కడే లభించింది. రామానుజులు భక్తి మార్గానికి పితామహుడు. గీత వ్యాఖ్యానం, కర్మ ప్రాముఖ్యత చెప్పేవారు. తన జీవితాన్ని కర్మకే అంకితం చేశారు. ఆయన సంస్కృతంలో రచనలు చేశారు. తమిళభాషకు భక్తి మార్గంలో మహత్వమిచ్చారు.
అంధ విశ్వాసాలను దూరం చేశారు..
రామానుజాచార్య జీవితాన్ని తరచి చూస్తే, ప్రగతిశీలతకు, ప్రాచీనతకు మధ్య ఎటువంటి వైరుధ్యం లేదని తెలుస్తుంది. అభివృద్ధి కోసం మూలాలకు దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. మన మూలాలతో అనుసంధానం కావడం, మన నిజమైన శక్తిని తెలుసుకోవడం ముఖ్యం. వెయ్యేళ్ల క్రితం అంధవిశ్వాసాలు ఎక్కువగా ఉండేవి. ఆ సమయంలో సమాజాన్ని ఆయన సరైన మార్గంలో నడిపించారు. భారతదేశానికి ముందున్న సవాళ్లను చూపించారు. దళిత, గిరిజన, బహుజనులను చేరదీసి, వారికి గౌరవం కల్పించారు. యాదవగిరిపై నారాయణ మందిరాన్ని నిర్మించి, అందులో దళితులకు దర్శన, పూజాధికారాలు కల్పించారు.
అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం
జాతి పేరిట కొందరిపై సమాజం భేదభావం చూపిస్తున్నప్పుడు వారికి లక్ష్మీకులంలో జన్మించిన వారని పేరిచ్చేవారు. తాను స్వయంగా స్నానం చేసిన వెంటనే వారిని తాకడం ద్వారా, అంటరానితనాన్ని దూరం చేసేందుకు సందేశాలిచ్చారు. ఒకసారి వేరే జాతికి చెందిన తన మిత్రుడికి అంతిమ సంస్కారాలు చేశారు. ఈ సమయంలో ఆయన శ్రీరాముడిని గుర్తుచేశారు. రాముడు తన చేతులతో జటాయువుకు అంతిమ సంస్కారం చేసినప్పుడు భేదభావం ధర్మం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇది మనకో పెద్ద సందేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా రామానుజుల మార్గంలోనే నడిచారు. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు కృషి చేశారు.
అందరికీ ప్రధాన గురువు..
జీవాలన్నీ సమానం. బ్రహ్మ, జీవం ఒకటే అని ప్రబోధించారు రామానుజాచార్య. తన గురువు ఉపదేశించిన మంత్రాన్ని ఎవరికీ చెప్పవద్దన్నా.. తానొక్కరూ నరకానికి వెళ్లినా.. ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశంతో దేవాలయంపైకి ఎక్కి అందరికీ మంత్రాన్ని వినిపించారు. ఆయన దక్షిణాదిన జన్మించారు. కానీ ఆయన ప్రభావం భారతదేశం మొత్తంపై ఉంది. రామానుజుల ఔన్నత్యాన్ని అన్నమాచార్య తెలుగులో ప్రశంసిస్తే, కనక్దాస్ కన్నడంలో పాడారు. గోదాస్, తులసీదాస్ నుంచి కబీర్దాస్ వరకు అందరికీ రామానుజాచార్య ప్రధాన గురువు.
ఐక్యతా సూత్రాన్ని నేర్చుకున్నాం...
భారత్ ఐక్యతా సూత్రాన్ని రామానుజుల జీవనం నుంచి నేర్చుకున్నాం. ఆయన బోధనలు దేశాన్ని జాగృతం చేశాయి. ఆయన విగ్రహావిష్కరణ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సమయంలో జరుగుతోంది. రామానుజాచార్యులు ప్రబోధించిన భక్తిమార్గంలోనే గాంధీజీ నేతృత్వంలో సాగించిన స్వాతంత్య్ర పోరాటంతో భారతదేశం సంప్రదాయ విజయం సాధించింది’ అని మోదీ పేర్కొన్నారు.
తెలుగు సంస్కృతి విశ్వవ్యాప్తం
హైదరాబాద్ అంటే.. సర్దార్పటేల్ను గుర్తుచేసుకుంటాం. ఒకవైపు సర్దార్పటేల్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ దేశంలో ఐక్యతా ప్రమాణాన్ని పునరావృతం చేస్తుంటే, రామానుజాచార్యుల స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమానత్వ సందేశాన్ని చాటుతోంది. తెలుగు సంస్కృతి మూలాలు ఏళ్ల నుంచీ ఉన్నాయి. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధినేతలు తెలుగు సంస్కృతిని సమృద్ధి చేశారు. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రుద్రేశ్వరుడు నిర్మించిన రామప్ప ఆలయాన్ని గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. యూఎన్డబ్ల్యూటీవో పోచంపల్లిని భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక గ్రామంగా పేర్కొంది. తెలుగు పరిశ్రమ దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విశ్వవ్యాప్తమైంది. తెలుగుకళలు, సంస్కృతి అందరికీ ప్రేరణ.
మోదీ.. శ్రీరాముడిలా సద్గుణ సంపన్నుడు
నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ప్రపంచంలో భారతదేశాన్ని తలెత్తుకునేలా చేశారని, దేశ ప్రజలు తలెత్తుకొని జీవిస్తున్నారని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. శ్రీరాముడిలా మోదీ కూడా ఎల్లవేళలా రాజధర్మాన్ని ఆచరిస్తున్నారని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కంకణబద్ధులై పనిచేస్తున్నారని తెలిపారు. రామానుజాచార్య విగ్రహావిష్కరణ అనంతరం చినజీయర్ ప్రసంగించారు. ‘రామానుజాచార్యులు.. భగవంతుని ముందు అంతా సమానమేనని భావించిన సమతామూర్తి. వివక్ష నుంచి విముక్తి చేసిన సమసమాజ రక్షకుడు. వ్యక్తి కన్నా సమాజ శ్రేయస్సే ముఖ్యమన్న మావనవతావాది. రామానుజాచార్యులంతటి సుగుణాలు కలిగిన వ్యక్తి మోదీ. శ్రీరాముడు వ్రత సంపన్నుడు. మోదీ కూడా శ్రీరాముడిలా గుణ సంపన్నుడు. వ్రతబద్ధుడు. ధర్మాన్ని పాటిస్తారు. ధరిత్రి ఆశించిన పరిపూర్ణ పాలకుడు. దసరా సమయంలో అమెరికా వెళ్లినా నియమాలను పాటించారు. పది రోజులు కేవలం జలప్రసాదంతో గడిపారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిచేందుకు ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏం చేయాలో అది చేస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. భరతమాత తలెత్తుకుని చిరునవ్వులు చిందిస్తోంది. కశ్మీర్ భారత చిత్రపటంపై నవ్వుతూ కనిపిస్తోంది. రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి దేశ ఔన్నత్యాన్ని చాటారు. ఎంతో ప్రేమతో కష్టపడి మోదీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు’ అని చినజీయర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ