CM Jagan: సమాజంలో అందరూ సమానులే
భగవద్రామానుజాచార్యులు ప్రవచించిన విలువలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత సమాజంపై ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. సమాజంలో అందరూ సమానులే అనే సందేశాన్ని అందించేందుకు చినజీయర్స్వామి సమతామూర్తి విగ్రహాన్ని
ఆ సందేశాన్ని ముందుకు తీసుకుపోవలసింది మనమే
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు
ఈనాడు, హైదరాబాద్: భగవద్రామానుజాచార్యులు ప్రవచించిన విలువలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత సమాజంపై ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. సమాజంలో అందరూ సమానులే అనే సందేశాన్ని అందించేందుకు చినజీయర్స్వామి సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు సోమవారం ఆయన హాజరయ్యారు. పంచెకట్టు, నిలువుబొట్టులో పాల్గొన్నారు. దివ్యదేశాలను దర్శించుకుని సెల్ఫ్ గైడెడ్ టూల్ సాయంతో విశేషాలు తెలుసుకున్నారు. అనంతరం 3డీ లేజర్ షోను వీక్షించారు. శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
జగన్ది రామానుజాచార్యుల జన్మనక్షత్రమే
అవధానంలో భాగంగా జన్మ నక్షత్రాన్ని బట్టి శ్లోకాలు చెప్పే అంశం నడిచింది. ఈ నేపథ్యంలో జగన్ జన్మనక్షత్రం ఆరుద్ర అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పి ఏయే శ్లోకాలు చదవాలో వివరించాలని పిల్లలను కోరారు. అప్పుడు ఓ బాలుడు శ్లోకాలు చెప్పి జగన్ జన్మనక్షత్రం సాక్షాత్తూ రామానుజాచార్యుల జన్మనక్షత్రం ఒక్కటేనని చెప్పడంతో సభికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అవలీలగా శ్లోకాలు చెప్పిన చిన్నారులను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అసమానతలను రూపు మాపాలని వెయ్యేళ్ల కిందటే రామానుజాచార్యులు దృఢ విశ్వాసంతో ముందుకు సాగారన్నారు. తనకు పాపం కలుగుతుందని చెప్పినా.. సమాజానికి మేలు కలుగుతుందన్న సదాశయంతో తన గురువు ఉపదేశించిన అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిఒక్కరికి తెలియజేసిన గొప్ప మనిషి రామానుజాచార్యులని కొనియాడారు.
మహనీయుల విశేషాలతో హాల్ ఆఫ్ ఫేమ్
చినజీయర్స్వామి మాట్లాడుతూ సమతాస్ఫూర్తిని తెలియజేయాలనే ఉద్దేశంతోనే బృహన్మూర్తిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సామాజిక, లింగ సమానత్వం కోసం పోరాడిన అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్కింగ్, నెల్సన్ మండేలా వంటి మహనీయుల జీవిత విశేషాలతో కేంద్రంలో హాల్ ఆఫ్ ఫేమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి-స్వర్ణ దంపతులు, ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఉప సభాపతి కోన రఘుపతి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మైహోం సంస్థల ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు తదితరులు పాలొన్నారు.
నేడు అమిత్ షా రాక
ఉత్సవాలకు మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నయనమనోహరం..
గోవింద నామస్మరణలతో ముచ్చింతల్ మార్మోగింది. ఆరో రోజు.. వేలాది మంది రుత్విజుల వేదమంత్రోచ్చరణ మధ్య.. చినజీయర్స్వామి హస్తాల మీదుగా సమతామూర్తి కేంద్రంలో నిర్మించిన 108 దివ్యదేశాలలోని 32 ఆలయాలలో విగ్రహ ప్రతిష్ఠను అత్యంత వైభవంగా నిర్వహించారు. పండితులు మహా కుంభాభిషేకం నిర్వహించారు.
మరో మూడు రోజులలో...
వివిధ తేదీలలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10న 19 ఆలయాలు, 11న 36, 13న 21 ఆలయాలలో మూర్తుల ప్రాణప్రతిష్ఠ జరగనుంది. 13న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా స్వర్ణమూర్తి ఆవిష్కరణ జరగనుంది. వాస్తవంగా సోమవారం 33 ఆలయాలలో విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని ప్రకటించినా... రాహుకాలం దృష్ట్యా అయోధ్య ఆలయ విగ్రహ ప్రతిష్ఠను వాయిదా వేశారు.
పూర్తయ్యాకే భక్తులకు అనుమతి
సమతామూర్తిని దర్శించేందుకు సోమవారం సైతం భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అన్ని దివ్యదేశాలలో విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తికాకపోవడంతో భక్తులను అటువైపు అనుమతించడం లేదు. ప్రస్తుతం ఉజ్జీవన సోపానం మీదుగా నేరుగా బృహన్మూర్తిని దర్శించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని ఆలయాలలో ప్రతిష్ఠ ముగిశాకే దివ్యదేశాల సందర్శనకు భక్తులను అనుమతించనున్నట్లు చినజీయర్స్వామి ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. -
దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం
కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
సీపీఎస్ రద్దుపై మాట దాటేసిన బొత్స
భోగాపురం ఎయిర్ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. -
సుజనాచౌదరి రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతి
భాజపా నేత సుజనాచౌదరిపై రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ-హైదరాబాద్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
సీఎం తెచ్చిన నరకయాతన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్