Tirupati: తిరుపతిలో మోహన్బాబు సినీ అకాడమీ
తిరుపతిలో ఈ ఏడాది మోహన్బాబు యూనివర్సిటీ ప్రారంభంకానుంది. ఇందులో మోహన్ బాబు సినీ అకాడమీ కూడా ఉంటుందని, ఇక్కడ సినిమా రంగంలోని అన్ని విభాగాల స్థానికులకు శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తామని మా అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణు తెలిపారు.
మా అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడి
తిరుపతి(విద్య), న్యూస్టుడే: తిరుపతిలో ఈ ఏడాది మోహన్బాబు యూనివర్సిటీ ప్రారంభంకానుంది. ఇందులో మోహన్ బాబు సినీ అకాడమీ కూడా ఉంటుందని, ఇక్కడ సినిమా రంగంలోని అన్ని విభాగాల స్థానికులకు శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తామని మా అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణు తెలిపారు. తిరుపతిలో సోమవారం మన్యంరాజు సినిమా పోస్టర్ ఆవిష్కరణకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సినీ పరిశ్రమలో 20శాతం మంది చిత్తూరు జిల్లాకు చెందిన వారున్నారు. ఇది గర్వించదగ్గ విషయం. సినిమా టికెట్ల ధరలు తెలంగాణలో పెంచారు. ఆంధ్రప్రదేశ్లో తగ్గించారు. దీనిపై రెండు చోట్ల కోర్టుకు వెళ్లారు. ఇది పెద్ద అంశం. పరిశ్రమ మొత్తం ఏకాభిప్రాయంతో మాట్లాడాలి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. ఈ అంశంపై అందరం చర్చిస్తున్నాం. పరిశ్రమ ప్రతి ఒక్కరిది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయానికి పరిశ్రమ కట్టుబడి ఉంటుంది. ఎన్ని ఉన్నా వ్యక్తిగతంగా మాట్లాడను. రెండు రాష్ట్రాల్లో టికెట్ల అంశంపై స్వలాభం కోసం ఒకరిద్దరు మాట్లాడటం మంచిది కాదు. రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాయి. మాకు కావాల్సిందేంటో వారితో చెప్పి చేసుకుంటాం. సమస్య ఉంటే పరిశ్రమకు చెందిన పెద్దలు కలిసి నిర్ణయం తీసుకుంటారు. మా అసోసియేషన్ వంద రోజుల ప్రగతిపై త్వరలో మీడియాతో మాట్లాడతా’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?