AP PRC: పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామాలు
పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తున్నామని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) అధ్యక్షుడు సుధీర్బాబు, ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్) ప్రధాన కార్యదర్శి
లేఖలు పంపిన ఉపాధ్యాయ సంఘాల నేతలు
పెద్దఎత్తున ఉద్యమిస్తామని వెల్లడి
ఈనాడు, అమరావతి: పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తున్నామని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) అధ్యక్షుడు సుధీర్బాబు, ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య(యూటీఎఫ్) ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్)-1938 అధ్యక్షుడు హృదయరాజు ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను సాధన సమితి స్టీరింగ్ కమిటీ కాపాడలేకపోయిందన్నారు. తమ రాజీనామాలను ఐకాస ఛైర్మన్లకు పంపించామని వెల్లడించారు. పీఆర్సీ ఫిట్మెంట్, ఇతర ప్రయోజనాల సాధనకు పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు. విజయవాడలో మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. స్టీరింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మంత్రుల కమిటీతో చర్చలు జరగలేదని, ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, గ్రాట్యుటీ, అదనపు క్వాంటం పింఛన్, సీపీఎస్ రద్దులాంటి ముఖ్యమైన అంశాలపై సాధన సమితి నాయకత్వం పట్టుబట్టలేదని ఆరోపించారు. ముఖ్యమైన అంశాలలో స్పష్టమైన నిర్ణయాలు రాబట్టలేకపోయామని తెలిపారు. ‘చలో విజయవాడ’ను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు విజయవంతం చేశారని, సాధన సమితి నేతలు మాత్రం నమ్మకాన్ని నిలబెడతామని చెప్పి, ప్రభుత్వం వద్ద అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. మంత్రుల కమిటీ చర్చలకు హాజరైనట్లు సంతకాలు చేసిన కాగితాన్ని చూపించి, ఒప్పందాన్ని అంగీకరించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సరికాదన్నారు. ఇది ప్రభుత్వ విశ్వసనీయతకే నష్టమని వెల్లడించారు. కలిసొచ్చే సంఘాలతో పీఆర్సీపై ప్రత్యేక ఉద్యమం చేపట్టనున్నామని చెప్పారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం, ఇతర సంఘాల వారు ఇప్పటికే మద్దతు తెలిపారని గుర్తు చేశారు.
ఫిట్మెంట్ను సాధన సమితి పట్టించుకోలేదు
- ఎస్టీయూ అధ్యక్షుడు సుధీర్బాబు
‘ఫిట్మెంట్ అంశాన్ని పీఆర్సీ సాధన సమితి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సాధన సమితి స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తున్నాం. ఐకాస ఛైర్మన్లకు లేఖలు పంపించాం. పీఆర్సీపై ప్రత్యేక ఉద్యమం చేపట్టనున్నాం. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో కలిసొచ్చే సంఘాలతో 12న రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఫిట్మెంట్ 27శాతం పైన ఉండాలని అడిగితే మంత్రుల కమిటీ ముగిసిన అధ్యయనం అని చెప్పింది. దీన్ని చర్చల్లో వ్యతిరేకించాం. మెజారిటీ సభ్యుల అంగీకరించారంటూ సాధన సమితి నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లబోయే ముందు మా అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాం. పీఆర్సీ ఉత్తర్వులతోపాటు మిశ్ర నివేదిక ఇస్తామని మంత్రుల కమిటీ చెప్పడంతో చర్చల్లో పాల్గొన్నాం. హెచ్ఆర్ఏ శ్లాబులపై పట్టుబట్టాం. సీలింగ్ వద్దన్నాం. సీలింగ్ వెయ్యికి పెంచడానికి రెండు గంటలకుపైగా చర్చలు సాగాయి. చర్చల సమయంలో ఎక్కడా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సంతకాలు చేయలేదు. ఒప్పందాల సమయంలో బయటకు వచ్చేశాం’ అని తెలిపారు.
కోరుకున్న ప్రయోజనాలు దక్కలేదు
- యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్
‘95శాతం మంది ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు. పీఆర్సీ సాధన సమితికి రాజీనామా చేశాం. ప్రత్యేక ఐక్య ఉద్యమం చేస్తాం. గతంలో ఫ్యాప్టో ఆందోళనలతో ఉద్యమాన్ని నిలబెట్టాం. ఆ తర్వాతే నాలుగు ఐకాసలు ఒక్కటయ్యాయి. సీఎం వద్ద ఫిట్మెంట్ను అడుగుతామన్నా కుదరదని మంత్రుల కమిటీ చెప్పింది. ఐఆర్ 27శాతానికి తగ్గకుండా తెలంగాణలో ఇచ్చినట్లు 30శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరినా అంగీకరించలేదు. సాధన సమితిలో ఏకాభిప్రాయం రాకపోయినా సమ్మెను విరమించారు. ఈనెల 6న సీఎం వద్దకు వెళ్లేందుకు రావాలని సాధన సమితి నేతలు పిలిచినా వెళ్లలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఉన్న అసంతృప్తిని సీఎం వద్ద ప్రస్తావించాలని చెప్పాం. కానీ, ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం మంచి ప్రయోజనాలు కల్పించారని సాధన సమితి నేతలు ప్రకటించారు’ అని యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ చెప్పారు.
వివరాలు సేకరించడాన్ని ఖండిస్తున్నాం: ‘ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న వారి వివరాలను సేకరించడంతోపాటు పోలీసుస్టేషన్లకు రప్పించి విచారించడాన్ని ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ అన్నారు.
హక్కుల కోసం చివరి దశ ఉద్యమం
- ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు
‘పీఆర్సీ ప్రయోజనాలను ఇప్పుడు కోల్పోతున్నాం. గతంలో సాధించుకున్న వాటిని వదులుకునేందుకు సిద్ధంగా లేము. హక్కులను కాపాడుకునేందుకు చివరి దశ పోరాటం చేపట్టాం. కలిసొచ్చే సంఘాలతో ఉద్యమానికి వెళ్తాం. సీపీఎస్ రద్దు చేయకుండా రోడ్ మ్యాప్ అంటున్నారు. వారంలో రద్దు చేస్తామన్నా హామీ ఏమైంది? ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు వేతనాలు పెంచాలి. 23శాతం పెంచితే వాళ్లు ఎలా ఐదేళ్లు బతుకుతారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు నుంచి ప్రొబేషన్ ఖరారు చేయాలి. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే పదవీవిరమణ వయస్సు 62ఏళ్లకు పెంచమని ఎవరు అడిగారు’ అని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం