APPSC: కొలువుల ప్రకటనకు ఇంకెన్నాళ్లో!
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయో తెలియక నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కొలువుల కోసం ఎన్నాళ్లు శిక్షణ పొందుతూ గడపాలని
గ్రూపు-1, 2, పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఇంకా నిరీక్షణే
జాబ్ క్యాలెండర్ ప్రకారం రాక నిరుద్యోగుల ఆందోళన
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయో తెలియక నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కొలువుల కోసం ఎన్నాళ్లు శిక్షణ పొందుతూ గడపాలని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకించి గ్రూప్-1, 2, పోలీసు ఉద్యోగాల భర్తీకి విడుదల చేసే ప్రకటనల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం ఈ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు దాటి నెలలు గడిచిపోతున్నా..ఫలితం కనిపించకపోవడంతో లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న 10,143 ఉద్యోగాల నియామకానికి 2022 మార్చి నాటికి ప్రకటనలు రావాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ కింద ద్వారా 6,143 పోస్టుల భర్తీ జరుగుతోంది. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీల (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు) కింద పేర్కొన్న 1,238 పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ, ఇతర శాఖల ద్వారా జరుగుతోంది. జాబ్ క్యాలెండరులో పేర్కొన్న ప్రకారం మరో 2,000 ఉద్యోగాల నియామక ప్రకటన వచ్చేందుకు ఈ నెలాఖరు వరకు, మరో 36 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువడేందుకు వచ్చే నెలాఖరు వరకు సమయం ఉంది.
గ్రూపు-1, 2 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఆగస్టులో రావాల్సి ఉండగా...!
జాబ్ క్యాలెండర్లో గ్రూపు-1, 2 కింద 36 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రూపు-1 కింద 31, గ్రూపు-2 కింద 5 పోస్టులు మాత్రమే చూపించారని తెలిసింది. ఈ ఉద్యోగాల భర్తీకి గత ఆగస్టులోనే నోటిఫికేషన్ రావల్సి ఉంది. ఈ పోస్టులు మరీ తక్కువగా ఉండడంతో నిరుద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. అయినా ఇప్పటివరకూ ఈ సంఖ్య పెరగలేదు. పోలీసు, ఇతర ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఎంతకీ రాకపోతుండటంతో కొందరు నిరుద్యోగులు దరఖాస్తు చేసేందుకు వయోపరిమితి రీత్యా అర్హత కోల్పోతున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి భర్తీచేస్తామని పేర్కొన్న పోస్టుల సంఖ్యే చాలా తక్కువని.. వాటికి కూడా ముందుగా ప్రకటించిన ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వకపోవటం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. దీనివల్ల ఖాళీ అయ్యే పోస్టులు మరింత తగ్గినట్లు నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు ఉద్యోగాలు ఎక్కడ
గతేడాది జూన్ 18న సీఎం విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం పోలీసు శాఖలో 450 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో నోటిఫికేషన్ రావాల్సి ఉండగా ఇప్పటికీ జారీ కాలేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2018 డిసెంబరులో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. చివరిసారిగా ప్రకటన విడుదలైనప్పుడు దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడూ అదే స్థాయిలో ఆశావాహులు ఉన్నారు.
లెక్చరర్ల భర్తీ ఎప్పుడు?
ఉన్నత విద్యాశాఖ తరపున ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా గత నెలలోనే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. పోస్టుల భర్తీ వివరాలను ప్రభుత్వానికి పంపబోతున్నట్లు కళాశాల విద్యా శాఖ అధికారులు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం ఈ నెలాఖరులోగా ప్రకటన రావాల్సి ఉంది. ఆయా శాఖల నుంచి వివరాలు అందితేనే ఏపీపీఎస్సీ ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడానికి వీలవుతుంది.
రాత పరీక్షల తేదీలు లేకుండా సన్నద్ధమెలా?
ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ జారీచేసిన నోటిఫికేషన్లలో ఒకటి, రెండింటికి మినహా మిగిలిన వాటికి రాత పరీక్షల తేదీలు ప్రకటించనందున ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యేందుకు నిరుద్యోగులకు అవకాశం లేకుండాపోతోంది. పరీక్షా కేంద్రాల గుర్తింపు, కేంద్ర, బ్యాంకు, ఇతర నియామక రాత పరీక్షల షెడ్యూల్కు అనుగుణంగా తేదీలు ఖరారు చేయాల్సి ఉన్నందున జాప్యం జరుగుతోంది.
‘ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందోనని చదువుకున్న పిల్లలు ఎదురుచూస్తారు. శిక్షణకు ఎంత సమయం కేటాయించాలా అని ఆలోచిస్తారు. జిల్లా కేంద్రాలు, నగరాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని శిక్షణ పొందుతూ.. నెలల తరబడి నోటిఫికేషన్లు రాక..మనోధైర్యం కోల్పోయేవారు. ఈ పరిస్థితిని మారుస్తున్నాం. రాబోయే తొమ్మిది నెలల్లో అంటే.. జులై నుంచి 2022 మార్చి వరకూ ఏయే ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తామో వివరిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం’
- ఇది ముఖ్యమంత్రి జగన్ గత ఏడాది జూన్ 18న చేసిన ప్రకటన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?