Andhra News: ఆటోనగర్లపై కన్ను
రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో జనావాస ప్రాంతాలకు మధ్యలో ఉన్న ఆటోనగర్లు, పారిశ్రామికవాడలు కాలుష్యానికి కారణమవుతున్నాయని, వాటిని ఊరికి దూరంగా తరలిస్తామని చెబుతున్న ప్రభుత్వం... వాటిలో సగం స్థలం తనకు ఇచ్చేయాలనడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఊరి మధ్యలో ఉన్నవాటిని దూరంగా తరలించాలనడంలో భిన్నాభిప్రాయం లేదు. కానీ ఇప్పుడున్న స్థలంలో సగం ఇచ్చేయాలనడంపైనే పారిశ్రామిక యూనిట్లు, వర్క్షాపుల యజమానులు అభ్యంతరం
సగం భూమి ఇచ్చేయండి
నగరాల్లోని ఆటోనగర్లు, పారిశ్రామికవాడల్ని తరలించేందుకు ప్రభుత్వం కొత్త విధానం
మా భూములు మీకెందుకివ్వాలి?
పరిశ్రమల యజమానుల సూటిప్రశ్న
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో జనావాస ప్రాంతాలకు మధ్యలో ఉన్న ఆటోనగర్లు, పారిశ్రామికవాడలు కాలుష్యానికి కారణమవుతున్నాయని, వాటిని ఊరికి దూరంగా తరలిస్తామని చెబుతున్న ప్రభుత్వం... వాటిలో సగం స్థలం తనకు ఇచ్చేయాలనడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఊరి మధ్యలో ఉన్నవాటిని దూరంగా తరలించాలనడంలో భిన్నాభిప్రాయం లేదు. కానీ ఇప్పుడున్న స్థలంలో సగం ఇచ్చేయాలనడంపైనే పారిశ్రామిక యూనిట్లు, వర్క్షాపుల యజమానులు అభ్యంతరం చెబుతున్నారు. నగరాలు, పట్టణాల్లోని జనావాస ప్రాంతాల్లో ఉన్న ఆటోనగర్లను, పారిశ్రామికవాడల్ని ఖాళీ చేయించి, వాటి నుంచి ఆదాయం సంపాదించేందుకు ‘కోఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ’ పేరుతో ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చింది. వాటిని నివాస, వాణిజ్య ప్రాంతాలుగా మార్చేస్తామని, ఇప్పుడున్న స్థలంలో సగం యజమానులకు ఇచ్చి, మిగతా స్థలం తాను తీసుకుంటానని చెబుతోంది.సగం స్థలం ఇవ్వడం ఇష్టం లేకపోతే... మొత్తం స్థలం మార్కెట్ విలువలో సగాన్ని వాటి యజమానులు ప్రభుత్వానికి కట్టాలంటోంది. వారికి ఊరికి దూరంగా ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని అనుసరించి నిర్ణయించిన ధరకు స్థలాలు కేటాయిస్తామని చెబుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం ప్రభుత్వం నుంచి తాము కొనుక్కున్న స్థలాన్ని ఇప్పుడు ఉచితంగా ఎందుకు ఇవ్వాలని వాటి యజమానులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా ఆటోనగర్లు, పారిశ్రామికవాడలపై ఆధారపడి బతుకుతున్నామని, ఇప్పుడు వాటిని వదిలేసి బయటకు పొమ్మంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి రూ.కోట్లు
ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నది పక్కా వ్యాపారం. పారిశ్రామిక యూనిట్ల యజమానుల నుంచి సగం భూమిని ఉచితంగా తీసుకుని, దాన్ని విక్రయించి ఆదాయం సంపాదించాలని భావిస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ‘కోఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ’కి మంత్రివర్గం ఇటీవలే ఆమోదముద్ర వేసింది. విధివిధానాలు ప్రకటిస్తూ ఆటోనగర్లకు, ఇతర పారిశ్రామిక యూనిట్లకు విడివిడిగా పరిశ్రమలశాఖ ఈ నెల నాలుగో తేదీన రెండు జీవోలు జారీ చేసింది. వాటి ప్రకారం...
* రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో జనావాసాల మధ్యలో ఉన్న ఆటోనగర్లను ఏపీఐఐసీ గుర్తిస్తుంది. వాటిని నివాసగృహాలు, వాణిజ్య భవనాల నిర్మాణం వంటి వివిధ అవసరాలకు వినియోగించునేందుకు వీలుగా ‘మల్టీపర్పస్ జోన్’లుగా మార్చేందుకు అనుమతివ్వాలని సంబంధిత కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి ఏపీఐఐసీయే దరఖాస్తు చేస్తుంది.
* సంబంధిత మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ఆటోనగర్లలోని పారిశ్రామిక యూనిట్ల యజమానుల నుంచి... భూమి మార్కెట్ విలువలో సగం మొత్తాన్ని ‘ఇంపాక్ట్ ఫీజు’గా వసూలుచేస్తుంది. భూవినియోగ మార్పిడి ఫీజు దీనికి అదనం. ‘ఇంపాక్ట్ ఫీజు’గా వసూలుచేసిన మొత్తాన్ని ఆ తర్వాత ఏపీఐఐసీకి బదలాయిస్తుంది.
* ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులు, పారిశ్రామిక వాడలతో పాటు, వాటికి వెలుపల ప్రభుత్వం నుంచి స్థలం తీసుకుని ఏర్పాటుచేసిన పరిశ్రమల్ని... బహుళ అవసరాలకు వినియోగించుకునేలా మారుస్తుంది. దానికి వాటి యజమానులు ఆ భూమిలో సగం ఇవ్వాలి, లేదా మార్కెట్ విలువలో సగం ప్రభుత్వానికి చెల్లించాలి.
* సొంతంగా భూమి కొనుక్కుని పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నవారు... అది ఖాయిలా పడటమో, కాలుష్యం తదితర సమస్యలతో దాన్ని నిర్వహించలేకనో ఆ స్థలాన్ని వేరే అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటే, భూమి మార్కెట్ విలువలో ప్రభుత్వానికి 15% చెల్లించాలి.
* నగరం/ పట్టణాలకు దూరంగా కొత్త పారిశ్రామికవాడలు అభివృద్ధి చేస్తామని, ఇక్కడ ఖాళీ చేసినవారిని అక్కడికి తరలిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాగని అక్కడేమీ స్థలం ఉచితంగా ఇవ్వదు. ప్రభుత్వ పారిశ్రామిక విధానం ప్రకారం నిర్ణయించిన ధరకు అక్కడ మళ్లీ కొనుక్కోవలసిందే.
* ‘కొన్ని ఆటోనగర్లు, పారిశ్రామికవాడల చుట్టూ జనావాసాలు పెరిగిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల పట్టణీకరణ, పర్యావరణ సమస్యల వల్ల అక్కడ పరిశ్రమలు నడపలేకపోతున్నామని, భూ వినియోగ మార్పిడికి అవకాశం ఇవ్వాలని పారిశ్రామిక యూనిట్ల యజమానుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. ఆ భూమిని పారిశ్రామికేతర అవసరాలకు వాడుకునేందుకు అవకాశం ఇవ్వడం వల్ల భూమికి గరిష్ఠ విలువ రాబట్టవచ్చు. ప్రభుత్వానికి ఆదాయ వనరుగానూ ఉపయోగపడుతుంది’ అని గ్రోత్ పాలసీని ప్రభుత్వం సమర్థించుకుంటోంది.
భారీ ఆదాయం కోసమే!
రాష్ట్రంలోని మొత్తం 160కి పైగా ఆటోనగర్లు, పారిశ్రామికవాడలు ఉన్నాయి. వాటిలో దశాబ్దాల క్రితం ఏర్పడ్డవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు విజయవాడనే తీసుకుంటే.. 1964లో పారిశ్రామికవాడ, 1966లో ఆటోనగర్ ఏర్పాటు చేశారు. వాటిలో స్థలాల్ని పరిశ్రమల శాఖ నిర్దేశించిన ధరకు పారిశ్రామిక యూనిట్ల యజమానులు కొనుక్కున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఊరి మధ్యకు రావడంతో స్థలం ధరలు బాగా పెరిగాయి. ఇప్పుడు అక్కడ చదరపు గజం ధర రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. విజయవాడ పారిశ్రామికవాడ, ఆటోనగర్ కలిపి మొత్తం విస్తీర్ణం 334.8 ఎకరాలు. ప్రభుత్వం తెచ్చిన విధానం ప్రకారం.. 167 ఎకరాలు ఊరికే వచ్చేస్తుంది. ఒక్క విజయవాడ ఆటోనగర్లో తన వాటా స్థలాన్ని అమ్మితేనే ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం వస్తుంది.
మా భూములు ఎందుకిస్తాం?
- దుర్గాప్రసాద్, విజయవాడ ఐలా అధ్యక్షుడు
‘కొన్ని దశాబ్దాలుగా ఆటోనగర్లు, పారిశ్రామికవాడలపై ఆధారపడి మేం బతుకుతూ, కొన్ని లక్షల మందిని బతికిస్తున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలంటే మేమంతా రోడ్డున పడతాం. అయినా కొనుక్కున్న భూముల్లో సగం ఉచితంగా ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? విజయవాడలో ఇప్పుడున్న ఆటోనగర్, పారిశ్రామికవాడలే మా అవసరాలకు చాలవు. అటు కాజ వైపు 500 ఎకరాల్లో, ఇటు పెద అవుటపల్లి వైపు 500 ఎకరాల్లో... జాతీయ రహదారికి సమీపంలో ఆటోనగర్కి స్థలం కేటాయించాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. అక్కడ స్థలాలు కేటాయించి, అభివృద్ధి చేశాక అక్కడికి వెళ్లాలని చెబితే మా వాళ్లను ఎలాగోలా ఒప్పిస్తాం. అప్పుడు కూడా ఇక్కడున్న స్థలాల్లో ప్రభుత్వానికి వాటా ఇవ్వం. మల్లవల్లి పారిశ్రామికవాడలో గత ప్రభుత్వం ఎకరా రూ.15.50 లక్షల చొప్పున కేటాయిస్తే... ఈ ప్రభుత్వం రూ.79 లక్షలకు పెంచేసింది. ఊరికి దూరంగా కొత్తగా ఏర్పాటు చేస్తామని చెబుతున్న పారిశ్రామికవాడల్లోనూ అంతంత ధరలు పెట్టరని గ్యారంటీ ఏంటి?’
మాకేమైనా ఉచితంగా ఇచ్చారా?
- ఎ.కృష్ణ బాలాజీ, విశాఖ ఆటోనగర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు
‘విశాఖ ఆటోనగర్ 1,100 ఎకరాల్లో ఉంది. 1,000 నుంచి 1,500 పారిశ్రామిక యూనిట్లు నడుస్తున్నాయి. దాన్ని ఖాళీచేయించి ఊరికి 30-40 కి.మీ. దూరం పంపేస్తే... అంత దూరం వెళ్లి పరిశ్రమలు నడపడం కష్టం. మొత్తంగా ఆటోనగర్లను కాకుండా, వాటిలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమల వరకు దూరంగా పంపిస్తే సరిపోతుంది. పైగా ఆ భూముల్ని మాకు ఉచితంగానూ ఇవ్వలేదు. తక్కువ ధరకూ ఇవ్వలేదు. మా భూముల్లో ప్రభుత్వం సగం తీసుకుంటామనడాన్ని అంగీకరించం.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు