Andhra News: సార్.. చొక్కా విప్పి కొడతాననడం కరెక్టేనా?
విశాఖపట్నం శారదాపీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా బుధవారం విధుల్లో ఉన్న సీఐపై ఓ ప్రజాప్రతినిధి దుర్భాషలాడిన ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురయ్యాయని ఓ మహిళా ఏఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ శారదాపీఠం వద్ద సీఐపై దౌర్జన్య ఘటనకు స్పందన
నగర పరిధిలో పనిచేసే ఓ ఏఎస్సై వాయిస్ రికార్డు వైరల్
విశాఖపట్నం (గోపాలపట్నం), న్యూస్టుడే: విశాఖపట్నం శారదాపీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా బుధవారం విధుల్లో ఉన్న సీఐపై ఓ ప్రజాప్రతినిధి దుర్భాషలాడిన ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురయ్యాయని ఓ మహిళా ఏఎస్సై ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఓ స్టేషన్లో పనిచేసే ఏఎస్సై వాయిస్ రికార్డు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
‘సార్.. నమస్తే. మీరు పెద్దలు. మీతో కలిసి మాట్లాడాలన్నా అపాయింట్మెంట్ దొరకదు. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. అందుకే నా మాటల్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నాలో భావం, బాధ మీరు అర్థం చేసుకోవాలి సార్. పోలీసు శాఖ అంటే అందరికీ లోకువేనా సార్? మీతో మాట్లాడుతున్నా ఏడుపు వస్తోంది. ప్రతిసారీ పోలీసులను బూతులు తిట్టడమేనా? మేము ఏదైనా చేస్తే మాత్రం పోలీసులే తప్పు చేశారంటారు. సీఎం ప్రోటోకాల్ ఎంత కష్టంగా ఉంటుందో మీరే చెప్పండి. మా విధులు మేము సక్రమంగా నిర్వహించకూడదా? ఓ ప్రభుత్వ ఉద్యోగిపై అలా తిరగబడొచ్చా? మీ బందోబస్తు అంటే ఉదయం నుంచే మేమంతా రోడ్లపై ఉంటున్నాం. ప్రోటోకాల్ ప్రకారం ఒక్కరినే పంపాలని మాకు చెబుతారు. పైస్థాయి ఆదేశాలను మేము అమలు చేయకూడదా? అలాంటప్పుడు మేము ఎందుకు బందోబస్తు చేయాలి సార్? మమ్మల్ని తిట్టడంతో పాటు, మా ఆఫీసర్ని చొక్కా విప్పి కొడతానంటారా.. కరెక్టేనా సార్? ఎంత రాజకీయ నాయకుడైతే మాత్రం ప్రభుత్వ ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా..? పోలీసు వ్యవస్థ అంత దిగజారిపోయిందా? సార్ సీఎం అయ్యాక మొదటిసారి గతంలోనూ శారదా పీఠానికి వచ్చారు. అప్పుడూ మేము ప్రోటోకాల్ ప్రకారం ఓ వ్యక్తిని లోపలకు పంపలేదు. అప్పుడు ఓ ఎంపీ (పేరు వద్దులేండి) వచ్చి ఎవడ్రా లోపలకు పంపలేదు అన్నారు. ఇది కరెక్టేనా? అప్పుడే చాలా బాధ అనిపించింది. కష్టపడి శిక్షణ తీసుకుని రోడ్లపై ఉద్యోగాలు చేస్తే ఎవడ్రా.. వాడు.. వీడు అంటున్నారు. ఆ రోజు పోలీసు అధికారి తిరిగి ఎంపీ గారిని తిడితే పరిస్థితి ఏంటి? ప్రోటోకాల్లో ఓ ఎంపీదో, ఓ ఎమ్మెల్యేదో పేరు రాస్తారు. ఆయన వెంట మరో 5, 10 మంది వస్తే మేమేం చేయాలి? మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించడం మా బాధ్యత. ఎండలో, వానలో కష్టపడి పని చేస్తుంటే... దుస్తులు ఊడదీసి కొడతారా? యూనిఫాంలో ఉన్న ఓ ఆఫీసర్ని చేయి పట్టుకుని తోసేస్తారా.. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము పోలీసుశాఖలో క్రమశిక్షణతో ఉండాలని ఊరుకుంటున్నాం. ఇంకెవరైనా ఊరుకుంటారా? ఒకవేళ మా అధికారి తప్పు చేసి ఉంటే కమిషనర్కి ఫిర్యాదు చేయొచ్చు. ఇది సీఎం గారి దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు. మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. మీరు ఓ సారి పరిశీలించి చర్యలు తీసుకోండి. లేదు, అదే కరెక్ట్ అయితే వదిలేయండి. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు. -
పంచాయతీలపై రూ.23.08 కోట్ల వీల్ చైర్ల భారం!
పాడైన తాగునీటి మోటార్లు రిపేరు చేయించడానికి నిధుల్లేక బేల చూపులు చూస్తున్న గ్రామ పంచాయతీలపై మరో పిడుగు పడింది. -
విద్యాదీవెన అందక.. విద్యార్థుల విలవిల
మీరు ఇంజినీరింగ్ చదువుతారో.. ఇంకేం ఉన్నత చదువులు చదువుతారో చదవండి. ఆ చదువులకు అయ్యే ఫీజులను మీ మేనమామే చెల్లిస్తాడు’ గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా జగన్ చెప్పిన మాటలివి. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో రిజర్వేషన్ల వివాదంపై ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశం నిర్వహించడంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని