AP Capital: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించారు. సెమిస్టర్‌-2 తెలుగు మాధ్యమం పాఠ్య పుసక్తం చివర్లో ముద్రించిన భారతదేశ పటంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు

Updated : 11 Feb 2022 08:52 IST

నాలుగో తరగతి భారతదేశ పటంలో కనిపించని రాజధాని

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించారు. సెమిస్టర్‌-2 తెలుగు మాధ్యమం పాఠ్య పుసక్తం చివర్లో ముద్రించిన భారతదేశ పటంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాటి రాజధాని పేర్లు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం రాజధాని పేరు ఇవ్వలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్‌ అని మాత్రమే రాసి వదిలేశారు. దీనిపై ఉపాధ్యాయుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. భారతదేశ పటం చూపిస్తూ విద్యార్థులకు రాష్ట్రాలు, రాజధానులు పేర్లు చెప్పే సమయంలో రాష్ట్ర రాజధాని ఏమని చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020-21కి కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించింది. ద్విభాషా పుస్తకాలను తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాల పరిమాణం తక్కువగా ఉండేందుకు మూడు సెమిస్టర్లుగా విభజించి ముద్రించారు. రెండో సెమిస్టర్‌ పాఠ్య పుస్తకం చివరిలో భారతదేశ పటాన్ని ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని