MLC Ashok Babu: ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్టు.. బెయిలు
తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబును గురువారం అర్ధరాత్రి హడావుడిగా అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. 18 గంటలపాటు తమ అదుపులోనే ఉంచుకుని విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి సత్యవతి ఆయనకు బెయిల్ ఇచ్చారు.
గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
శుక్రవారం రాత్రి బెయిల్ ఇచ్చిన సీఐడీ కోర్టు
ఈనాడు, అమరావతి: తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబును గురువారం అర్ధరాత్రి హడావుడిగా అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. 18 గంటలపాటు తమ అదుపులోనే ఉంచుకుని విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి సత్యవతి ఆయనకు బెయిల్ ఇచ్చారు. ఓ వివాహ వేడుకకు హాజరై గురువారం రాత్రి 11.30కు ఇంటికి చేరుకున్న అశోక్బాబును మఫ్టీలో వేచి చూస్తున్న పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి 7గంటల వరకు తమ అదుపులోనే ఉంచుకుని విజయవాడ సీఐడీ కోర్టుకు తరలించారు. సుదీర్ఘ విచారణల అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. అంతకుముందు శుక్రవారం ఉదయం నుంచి ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్సీ అశోక్బాబును కలిసేందుకు ప్రయత్నించిన తెదేపా మాజీ మంత్రులు, నాయకులు, న్యాయవాదులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. అప్రజాస్వామికంగా అరెస్టు చేశారంటూ పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో దేవినేని ఉమా సహా పలువురు నాయకులను అరెస్టు చేసి నగరంపాలెం, నల్లపాడు స్టేషన్లకు తరలించి సాయంత్రం వరకు పోలీసులు అదుపులోనే ఉంచుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో విద్యార్హతపై తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని లోకాయుక్తకు అందిన ఫిర్యాదు మేరకు అశోక్బాబును ఉన్నఫళంగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. సీఐడీ కార్యాలయానికి వెళ్లే మార్గాలన్నింటినీ పోలీసులు మూసేశారు. కోర్టు రోడ్డు, అరండల్పేట పైవంతెన కింది భాగంలో ఉన్న రహదారులు, జీజీహెచ్ పరిసరాలు, నగరంపాలెం ఎస్బీఐ జంక్షన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. జీజీహెచ్తో పాటు కొత్తపేట తదితర ప్రాంతాలకు కోర్టు రోడ్డు నుంచే చాలా మంది ప్రయాణిస్తారు. వారంతా 2 కి.మీ.చుట్టూ తిరిగి మార్కెట్సెంటర్ నుంచి ప్రయాణించాల్సి వచ్చింది. జీజీహెచ్కు వెళ్లే అంబులెన్సులకుసైతం ఈ ఇబ్బందులు తప్పలేదు.
అప్రజాస్వామిక అరెస్టు: తెదేపా
పీఆర్సీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమిస్తున్న వారిని బెదిరించేందుకే ఎమ్మెల్సీ అశోక్బాబును అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని తెదేపా నేతలు మండిపడ్డారు. ముందస్తు నోటీసులివ్వకుండా సీఐడీ పోలీసులు అశోక్బాబును అరెస్టు చేసి తరలించటాన్ని వారు తప్పుబట్టారు. శుక్రవారం వస్తే ఎవరిని జైలుకు పంపుదామా? అని వైకాపా ప్రభుత్వం ఎదురుచూస్తోందని విమర్శించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఉన్న అశోక్బాబును పరామర్శించటానికి మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్అహ్మద్, కోవెలమూడి రవీంద్రతో పాటు పలువురు నాయకులు, న్యాయవాదులు సీఐడీ కార్యాలయ పరిసరాలకు చేరుకున్నారు. అశోక్బాబు వద్దకు వారిని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గతంలో ఎంపీ రఘురామరాజును ఇదే సీఐడీ కార్యాలయంలో పోలీసులు కొట్టారని, ప్రస్తుతం అశోక్బాబు విషయంలోనూ థర్డ్డిగ్రీ ప్రయోగించి ఉంటారని మాజీ మంత్రి దేవినేని ఉమా అనుమానం వ్యక్తం చేశారు. అశోక్బాబును చూపించాలని పట్టుబట్టారు. తెదేపా ప్రజాప్రతినిధులను హింసించటమే పనిగా జగన్రెడ్డి పాలన సాగుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. లోగడ ఆయనపై ఉన్న కేసును కొట్టివేశారని, దాన్ని తిరగదోడి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వివరించారు. ఎఫ్ఐఆర్లో తప్పుడు సెక్షన్లు పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్నారని, కోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు. మంత్రి అప్పలరాజు పోలీసు అధికారులను తిడితే కేసు లేదని, తెదేపా నాయకులపై మాత్రం కేసులకు అంతు లేదని నక్కా ఆనందబాబు విమర్శించారు. అశోక్బాబు ఎమ్మెల్సీగా ఎన్నికై మూడేళ్లయిందని, ఆయన ఉద్యోగ సర్వీసుకు సంబంధించిన వ్యవహారంపై వివాదం వస్తే ఇన్నాళ్లపాటు ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ ప్రశ్నించారు. సీఐడీ చీఫ్ సునీల్కుమార్ కక్ష సాధించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అశోక్బాబు తరఫున వెళ్లిన న్యాయవాదులు జంధ్యాల కోటేశ్వరరావు, హరిబాబులను సైతం పోలీసులు అడ్డుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు