Andhra News: హోదా.. అబ్బే తూచ్!
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన
విభజన సమస్యల పరిష్కారాలకు కేంద్ర హోంశాఖ ఉపకమిటీ
ఎజెండాలో తొలుత ప్రత్యేక హోదా.. సాయంత్రం తొలగింపు
ఈ కమిటీ తొలి భేటీ 17న
వెనుకబడిన జిల్లాలకు గ్రాంటు అంశాన్ని తీసేశారు
ఈనాడు - అమరావతి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన ఉపకమిటీ ఎజెండాలో తొలుత హోదా అంశాన్నీ చేర్చారు. ఈ నెల 17న కమిటీ తొలిసారి సమావేశం కానుంది. శనివారం ఉదయం ఎజెండాలోనూ ప్రత్యేక హోదా ఉంది. కానీ, శనివారం సాయంత్రం హఠాత్తుగా కమిటీ ఎజెండాను సవరించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ... అందులో హోదాను తొలగించింది. ఆరేడు గంటల్లోనే ఎజెండా మారిపోయింది. ప్రత్యేక హోదాతో పాటు.. ఉత్తరాంధ్రలోని 3, రాయలసీమలోని 4 కలిపి మొత్తం 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గ్రాంటు అంశాన్ని తొలుత ఎజెండాలో ఉంచినా.. సవరణలో దాన్నీ తొలగించారు. పన్నుల రాయితీలు, వనరుల అంతరం అంశాలనూ సవరించిన ఎజెండాలో తొలగించారు. మొత్తమ్మీద మొదట 9 అంశాలను ఎజెండాలో పెట్టిన ఆ శాఖ.. సవరణలో అయిదింటినే ఉంచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్కుమార్, తెలంగాణ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఏపీ నుంచి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సభ్యులుగా ఏర్పాటైన ఈ కమిటీ ప్రతీనెలా సమావేశమవుతుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ నెల 17న నిర్వహించనున్న కమిటీ తొలి భేటీకి ఇరు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవ్వాలని కోరుతూ రెండు రాష్ట్రాల సీఎస్లకు వర్తమానం పంపింది.
కమిటీ ఏర్పాటు ఇలా..
జనవరి 12న ఇరు రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోం కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014తో పాటు ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే ద్వైపాక్షిక అంశాల పరిష్కారానికి ఆచరణాత్మక మార్గాన్ని సిఫార్సు చేసేందుకు ఈ కమిటీని నియమించారు. అవసరాన్ని బట్టి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సంయుక్త కార్యదర్శులను సభ్య, ఆహ్వానితులుగా కమిటీ ఆహ్వానించవచ్చు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకం మేరకు కమిటీ ఏ వ్యక్తినైనా కో-ఆప్ట్ చేసుకోవచ్చు.
తొలుత కమిటీ ఎజెండా అంశాలు
* ఏపీ ఆర్థిక సంస్థ విభజన
* ఏపీ, తెలంగాణ విద్యుత్ వినియోగం పరిష్కారం
* పన్నులకు సంబంధించిన వాటిలో వ్యత్యాసాలను తొలగించడం
* బ్యాంకుల్లో నగదు నిల్వ, డిపాజిట్ల విభజన
* ఉభయ రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థల మధ్య క్యాష్ క్రెడిట్
* వనరుల అంతరం
* ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గ్రాంటు
* ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా
* పన్ను రాయితీలు
సవరించిన ఎజెండా..
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన
* ఏపీ జెన్కోకి టీఎస్ డిస్కంల విద్యుత్ వినియోగ చెల్లింపుల బకాయిలు
* పన్నుల విషయంలో తలెత్తిన వివిధ అంశాలు
* బ్యాంకుల్లోని నగదు, డిపాజిట్ల విభజన
* ఉభయ రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థల మధ్య క్యాష్ క్రెడిట్ అంశం.
ఆర్థిక వివాదాల పరిష్కారానికే చర్చ పరిమితం
ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు భర్తీపై ఉండదు
ఎంపీ జీవీఎల్ స్పష్టీకరణ
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి రెండురాష్ట్రాల ప్రతినిధులతో ఈ నెల 17న కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలోని వివాద పరిష్కార సబ్కమిటీ నిర్వహించే సమావేశంలో ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు భర్తీపై ఎలాంటి చర్చా ఉండబోదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. అది కేవలం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక వివాదాల పరిష్కారానికే తప్ప ఏపీ ప్రత్యేక హోదా, రెవెన్యూలోటుపై చర్చించడానికి కాదన్నారు. ఆయన ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కేంద్ర హోంశాఖ ఉపకమిటీ విభజన సమస్యలపై ఈ నెల 17న రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఎజెండాలో ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు భర్తీ అంశంపైనా చర్చ ఉంటుందని వార్తలు రావడంతో దానిపై స్పష్టత కోసం నేను కేంద్రంలో అత్యంత సీనియర్ అధికారులతో మాట్లాడాను. ప్రత్యేక హోదా కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే సంబంధించింది. రెవెన్యూ లోటు భర్తీ కూడా అంతే. ఎజెండాలో ఈ అంశాలు ఎలా వచ్చాయన్నది వాకబు చేసినప్పుడు ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక విభేదాల పరిష్కారానికే ఏర్పాటైందని, ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ అంశాల చర్చకు ఆస్కారం లేదని తెలిసింది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాల ఆర్థికసాయం అందాలన్నది మా ఆకాంక్ష. ప్రధానమంత్రి పార్లమెంటులో విభజన తీరు, ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. అన్ని రకాల అవకాశాలు, రాయితీలు రాష్ట్రానికి దక్కాలన్నది మా కోరిక. అయితే ప్రస్తుతం ప్రత్యేక హోదాపై మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టిస్తుంది కాబట్టి నేను ఈ వివరణ ఇస్తున్నా’ అని జీవీఎల్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం